ETV Bharat / international

బ్రిటీష్ ఇండియన్​ పుస్తకానికి 'చారిత్రక' అవార్డ్

author img

By

Published : Dec 2, 2020, 6:52 PM IST

బ్రిటీష్ ఇండియన్ జర్నలిస్ట్​ అనితా ఆనంద్ రాసిన పుస్తకం యూకే అత్యున్నత పురస్కారాన్ని కైవసం చేసుకుంది. జలియన్​వాలా బాగ్ ఉదంతంలో చిక్కుకున్న ఓ యువకుడి కథతో ఈ పుస్తకం రాశారు అనిత.

Anita Anand's Jallianwala Bagh story wins history prize
బ్రిటిష్ ఇండియన్​ పుస్తకానికి 'చారిత్రక' పురస్కారం

జలియన్​వాలా బాగ్ హత్యాకాండ నేపథ్యంలో బ్రిటీష్ ఇండియన్ జర్నలిస్ట్, రచయిత్రి అనితా ఆనంద్ రాసిన పుస్తకం యూకేలోని అత్యున్నత పురస్కారాన్ని దక్కించుకుంది. 1919లో జరిగిన ఈ దారుణ ఘటనలో చిక్కుకున్న ఓ యువకుడి కథతో రాసిన 'ద పేషెంట్ అసాసిన్: ఏ ట్రూ టేల్ ఆఫ్ మాసెకర్, రివెంజ్ అండ్ ద రాజ్' పుస్తకానికి 'పెన్-హెసెల్ టిల్ట్​మన్ ప్రైజ్ ఫర్ హిస్టరీ-2020' పురస్కారం వరించింది. ఈ అవార్డు కోసం పోటీ పడ్డ మరో ఆరు పుస్తకాలను దాటుకొని పురస్కారం గెలుచుకుంది.

British Indian author Anita Anand's Jallianwala Bagh story wins history prize
అనితా ఆనంద్ రాసిన పుస్తకం

అనితా ఆనంద్ రాసిన పుస్తకాన్ని 'వాస్తవ చారిత్రక మహాకావ్యం'గా అభివర్ణించారు న్యాయనిర్ణేతలు. వచ్చే దశాబ్దాల పాటు ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చని పేర్కొన్నారు. చారిత్రక దృఢత్వంతో పాటు పరిశోధాత్మక పుస్తకానికి ఈ ఏడాది పురస్కారం ఇవ్వాలని అనుకున్నట్లు తెలిపారు. అనితా రాసిన పుస్తకానికి ఈ లక్షణాలన్నీ ఉన్నాయని చెప్పారు.

రాజకీయ జర్నలిస్ట్ అయిన అనితా ఆనంద్.. 20 ఏళ్ల పాటు బీబీసీలో పనిచేశారు. ప్రతిష్టాత్మక అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు.

చారిత్రక ఘటనలపై వెలువడిన పుస్తకాలకు ఏటా ఈ అవార్డులు ఇస్తారు. విజేతకు రెండు వేల పౌండ్ల నగదు బహుమతి అందిస్తారు.

జలియన్​వాలా బాగ్ హత్యాకాండ నేపథ్యంలో బ్రిటీష్ ఇండియన్ జర్నలిస్ట్, రచయిత్రి అనితా ఆనంద్ రాసిన పుస్తకం యూకేలోని అత్యున్నత పురస్కారాన్ని దక్కించుకుంది. 1919లో జరిగిన ఈ దారుణ ఘటనలో చిక్కుకున్న ఓ యువకుడి కథతో రాసిన 'ద పేషెంట్ అసాసిన్: ఏ ట్రూ టేల్ ఆఫ్ మాసెకర్, రివెంజ్ అండ్ ద రాజ్' పుస్తకానికి 'పెన్-హెసెల్ టిల్ట్​మన్ ప్రైజ్ ఫర్ హిస్టరీ-2020' పురస్కారం వరించింది. ఈ అవార్డు కోసం పోటీ పడ్డ మరో ఆరు పుస్తకాలను దాటుకొని పురస్కారం గెలుచుకుంది.

British Indian author Anita Anand's Jallianwala Bagh story wins history prize
అనితా ఆనంద్ రాసిన పుస్తకం

అనితా ఆనంద్ రాసిన పుస్తకాన్ని 'వాస్తవ చారిత్రక మహాకావ్యం'గా అభివర్ణించారు న్యాయనిర్ణేతలు. వచ్చే దశాబ్దాల పాటు ఈ పుస్తకాన్ని చదువుకోవచ్చని పేర్కొన్నారు. చారిత్రక దృఢత్వంతో పాటు పరిశోధాత్మక పుస్తకానికి ఈ ఏడాది పురస్కారం ఇవ్వాలని అనుకున్నట్లు తెలిపారు. అనితా రాసిన పుస్తకానికి ఈ లక్షణాలన్నీ ఉన్నాయని చెప్పారు.

రాజకీయ జర్నలిస్ట్ అయిన అనితా ఆనంద్.. 20 ఏళ్ల పాటు బీబీసీలో పనిచేశారు. ప్రతిష్టాత్మక అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు.

చారిత్రక ఘటనలపై వెలువడిన పుస్తకాలకు ఏటా ఈ అవార్డులు ఇస్తారు. విజేతకు రెండు వేల పౌండ్ల నగదు బహుమతి అందిస్తారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.