ETV Bharat / international

ఇద్దరు ప్రధానులను మార్చిన బ్రెగ్జిట్​కు బోరిస్​ చెక్​​​!

author img

By

Published : Dec 25, 2019, 11:17 AM IST

బ్రిటన్​ ఎన్నికలు ముగిశాయి. ప్రధానిగా బోరిస్​ బాధ్యతలు చేపట్టారు. ఇక మిగిలింది బ్రెగ్జిట్​ మాత్రమే. ఇన్నేళ్లు దేశ పార్లమెంట్​లో అధికార కన్జర్వేటివ్​కు మెజార్టీ లేకపోవడం వల్ల అనేక బ్రెగ్జిట్​ ఒప్పందాలు వీగిపోయాయి. ఇప్పుడు పరిస్థితి మారడం వల్ల ఈ సమస్యకు స్వస్తి పలకడానికి బోరిస్​ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అయితే ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్​ వైదొలగడం.. నిజంగా ఆ దేశానికి మంచి చేస్తుందా?

British electorate mandates quick closure of messy divorce (Brexit) with EU
ఇద్దరు ప్రధానులను మార్చిన బ్రెగ్జిట్​కు బోరిస్​ చెక్​​​!

బ్రిటన్​లో ఈ నెల 12న సాధారణ ఎన్నికలు ముగిశాయి. మునుపెన్నడూ లేని భారీ మెజారిటీతో కన్జర్వేటివ్​ పార్టీ అధికారాన్ని చేపట్టింది. కన్జర్వేటివ్​, లేబర్​, లిబరల్​ డెమోక్రట్స్​, స్కాటిష్​ నేషనల్​తో పాటు ఇతర పార్టీల మధ్య హోరాహోరీగా ఎన్నికల ప్రచారాలు జరిగాయి. కానీ ఈ ఎన్నికల్లో విజయం సాధించింది మాత్రం​ "బ్రెగ్జిట్​". ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగడమే(బ్రెగ్జిట్​) లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగిన ప్రధాని బోరిస్​ జాన్సన్​ నేతృత్వంలోని కన్జర్వేటివ్​ పార్టీ.. అనుకున్న దాని కంటే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

650 సీట్లున్న బ్రిటిష్​ పార్లమెంట్​లో 365 గెలుచుకుని దూసుకుపోయింది. ఇది 2017 ఎన్నికలతో పోల్చితే 47 సీట్లు అధికం. బ్రెగ్జిట్​ వ్యతిరేక నినాదాలతో బరిలో దిగిన ప్రతిపక్షం లేబర్​ పార్టీ ఈ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైంది. కేవలం 203 సీట్లే గెలుచుకోగలిగింది. ముందు కంటే ఈ సంఖ్య 59 తక్కువ. 1935 అనంతరం ఇదే ఆ పార్టీకి అత్యల్ప సంఖ్య కావడం గమనార్హం.

2016 జూన్​ నుంచి బ్రెగ్జిట్​ సమస్య వల్ల బ్రిటన్​ తంటాలుపడుతూనే ఉంది. దీని వల్ల ఇద్దరు ప్రధానులు తమ పదవులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈసారి జరిగిన ఎన్నికల్లో బోరిస్​ ఘన విజయం సాధించడం వల్ల బ్రెగ్జిట్​కు మార్గం సుగమమైంది. దీని వల్ల ఈయూ నుంచి వైదొలగడానికి జనవరి 31 వరకు ఉన్న తుది గడువును బ్రిటన్​ సులభంగా గట్టెక్కడానికి చాలా అవకాశాలున్నాయి.

బ్రెగ్జిట్​ వల్ల ఐరోపా సమాఖ్య రూపురేఖలు మారిపోతాయి అనడానికి కూడా లేదు. ఒకప్పుడు యూరోపియన్​ ఎకనామిక్​ కమిటీ (ఈఈసీ)గా పిలిచే ఈయూ.. కేవలం 6 దేశాలతో 1957లో ఏర్పడింది. ​6 దశాబ్దాల్లో దాని సంఖ్య 28కి చేరింది. బ్రిటన్​ 1973లో ఈయూలో చేరింది.

బ్రెగ్జిట్​తో బ్రిటన్​కు లాభమేనా!

బ్రసెల్స్​(ఐరోపా సమాఖ్య ప్రధాన కార్యాలయం) నుంచి విడిపోయి సార్వభౌమాధికారాన్ని పొందడం వల్ల దేశవాసులు ఆనందించినా... బ్రిటన్ లాభపడేది పెద్దగా ఏమీ ఉండదు. ఇన్నేళ్లు ఈయూలో అగ్రరాజ్యంగా చెలామణి అయిన బ్రిటన్​.. ఇప్పుడు ఎన్నో అధికారాలు కోల్పోనుంది.

స్కాట్లాండ్​, ఉత్తర ఐర్లాండ్​, ఇంగ్లాండ్​, వేల్స్​ను కలిపి యునైటెడ్​ కింగ్​డమ్​(బ్రిటన్​) అని అంటారు. ఈయూ నుంచి వైదొలగాలని 45 శాతం స్కాట్​లాండ్​ వాసులు ఓటేశారు. అనంతర కాలంలో లండన్​తో అనేక విషయాలపై విభేదాలు ఎదురయ్యాయి. అందువల్ల బ్రెగ్జిట్​పై యూటర్న్​ తీసుకుని.. రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని స్కాట్లాండ్​ పట్టుబడుతోంది.

తాజా ఎన్నికల్లో స్కాటిష్​ నేషనల్​ పార్టీ ఊహించని విధంగా 48 సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే 13 సీట్లు ఎక్కువ. అదే సమయంలో కన్జర్వేటివ్​ పార్టీ 7 సీట్లు కోల్పోయింది. దీని వల్ల స్కాట్లాండ్​ నుంచి బోరిస్​ ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత ఎదురవనుంది. ఉత్తర ఐర్లాండ్​ నుంచి కూడా బోరిస్​కు వ్యతిరేకత ఎదురయ్యే అవకాశముంది. తన వద్ద ఉన్న సరిహద్దు ప్రణాళికలను బోరిస్​ అమలు చేస్తే ఐర్లాండ్​తో సంబంధాలు క్షీణించే అవకాశముంది.

ఆర్థిక వ్యవస్థపై భారం...

బ్రెగ్జిట్​ వల్ల దేశం ఎంతో లాభపడుతుందని నేతలు ప్రకటిస్తున్నా.. ఈయూ నుంచి వైదొలిగితే బ్రిటన్​ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే సూచనలున్నాయి. దేశ జీడీపీ 3శాతం, అంతకుమించి పడిపోయే అవకాశముంది.

కేవలం బ్రెగ్జిట్​ ఒప్పందం గట్టెక్కితే సరిపోదు.. ఈయూ, అమెరికా, చైనా, భారత్​ వంటి దేశాలతో ఆర్థికంగా వ్యూహాత్మక భాగస్వామ్యం ఉండటం బ్రిటన్​కు ఎంతో ముఖ్యం. ఇది అంత సులభమైన విషయం కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా దేశాలతో సులభతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడమూ కష్టమే. ఒక వేళ ఒప్పందం కుదిరినా అది బ్రిటన్​కు అనుకూలంగా ఉంటుందని మాత్రం అనుకోలేము.

ఈ ఏడాది అక్టోబర్​ 17న ప్రధాని బోరిస్​-ఈయూ మధ్య ఒప్పందం కుదిరింది. కానీ ఆ సమయంలో బ్రిటన్​ పార్లమెంట్​లో మెజార్టీ లేకపోవడం వల్ల ఆ ఒప్పందానికి ఆమోదం లభించలేదు. తాజా ఎన్నికల అనంతరం పరిస్థితి మారడం వల్ల ఆ ఒప్పందాన్నే.. తదుపరి చర్చల కోసం బోరిస్​ వినియోగించవచ్చు.

ఇమిగ్రేషన్​ కష్టమే...!

నైపుణ్యం ఉన్నా లేకపోయినా... ఈయూ సభ్య దేశాల ప్రజలు ఇప్పటి వరకు ఇంగ్లాండ్​లో విద్య, ఉద్యోగ అవకాశాలు ఎంతో సులభంగా పొందేవారు. బ్రిటన్​ ప్రజలు బ్రెగ్జిట్​ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ఇదే. బ్రెగ్జిట్​ అనంతరం ఈ పరిస్థితి మారనుంది. ఇమిగ్రేషన్​ వ్యవస్థలో విశేష మార్పులు చోటుచేసుకుంటాయి. దేశాలతో సంబంధం లేకుండా కేవలం నైపుణ్యాన్నే ప్రాధాన్యతగా పరిగణించవచ్చు.

భారత్​తో చెలిమి...

భారత్​తో లేబర్​ పార్టీ కన్నా.. కన్జర్వేటివ్​ పార్టీకే ఎక్కువ మైత్రి ఉంది. ఎన్నికల్లో బోరిస్​ విజయం సాధించిన వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే బోరిస్​ భారత్​ను అనేక మార్లు సందర్శించారు. మరోమారు పర్యటనకు సిద్ధపడుతున్నట్టు సమాచారం.

బ్రిటన్​ దిగువ సభ 'హౌస్​​ ఆఫ్​ కామన్స్'​కు ఈసారి ఏకంగా 15 మంది భారత సంతతి ఎంపీలు ఎన్నికయ్యారు. వీరిలో ఏడుగురు కన్జర్వేటివ్​ పార్టీకి చెందిన వారే.

ఈ ఎన్నికల్లో బ్రిటన్​లోని భారత సంఘం కన్జర్వేటివ్​వైపే అధికంగా మొగ్గు చూపింది. ఇందుకు లేబర్​ పార్టీ నిర్ణయాలు కూడా ఓ కారణం. కశ్మీర్​ అంశంలో పాకిస్థాన్​కు అనుకూల వ్యాఖ్యలు చేసింది ఆ పార్టీ. దీనిపై భారతీయులు తమ ఆగ్రహాన్ని బహిరంగంగానే వ్యక్తపరిచారు.

ఎన్నో ఏళ్లుగా బ్రిటన్​ నేతలను ముప్పుతిప్పలు పెడుతున్న బ్రెగ్జిట్​ అంశానికి స్వస్తి పలకడానికి బోరిస్​ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. బ్రెగ్జిట్​కు గ్రీన్​ సిగ్నల్​ పడితే.. ఐరోపా సమాఖ్యలో చివరిగా చేరిన బ్రిటన్​.. ఇప్పుడు అదే ఈయూ నుంచి తప్పుకునే తొలి దేశంగా నిలవనుంది.

--- విష్ణు ప్రకాశ్​, భారత మాజీ విదేశాంగ ప్రతినిధి

బ్రిటన్​లో ఈ నెల 12న సాధారణ ఎన్నికలు ముగిశాయి. మునుపెన్నడూ లేని భారీ మెజారిటీతో కన్జర్వేటివ్​ పార్టీ అధికారాన్ని చేపట్టింది. కన్జర్వేటివ్​, లేబర్​, లిబరల్​ డెమోక్రట్స్​, స్కాటిష్​ నేషనల్​తో పాటు ఇతర పార్టీల మధ్య హోరాహోరీగా ఎన్నికల ప్రచారాలు జరిగాయి. కానీ ఈ ఎన్నికల్లో విజయం సాధించింది మాత్రం​ "బ్రెగ్జిట్​". ఐరోపా సమాఖ్య నుంచి వైదొలగడమే(బ్రెగ్జిట్​) లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగిన ప్రధాని బోరిస్​ జాన్సన్​ నేతృత్వంలోని కన్జర్వేటివ్​ పార్టీ.. అనుకున్న దాని కంటే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

650 సీట్లున్న బ్రిటిష్​ పార్లమెంట్​లో 365 గెలుచుకుని దూసుకుపోయింది. ఇది 2017 ఎన్నికలతో పోల్చితే 47 సీట్లు అధికం. బ్రెగ్జిట్​ వ్యతిరేక నినాదాలతో బరిలో దిగిన ప్రతిపక్షం లేబర్​ పార్టీ ఈ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైంది. కేవలం 203 సీట్లే గెలుచుకోగలిగింది. ముందు కంటే ఈ సంఖ్య 59 తక్కువ. 1935 అనంతరం ఇదే ఆ పార్టీకి అత్యల్ప సంఖ్య కావడం గమనార్హం.

2016 జూన్​ నుంచి బ్రెగ్జిట్​ సమస్య వల్ల బ్రిటన్​ తంటాలుపడుతూనే ఉంది. దీని వల్ల ఇద్దరు ప్రధానులు తమ పదవులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈసారి జరిగిన ఎన్నికల్లో బోరిస్​ ఘన విజయం సాధించడం వల్ల బ్రెగ్జిట్​కు మార్గం సుగమమైంది. దీని వల్ల ఈయూ నుంచి వైదొలగడానికి జనవరి 31 వరకు ఉన్న తుది గడువును బ్రిటన్​ సులభంగా గట్టెక్కడానికి చాలా అవకాశాలున్నాయి.

బ్రెగ్జిట్​ వల్ల ఐరోపా సమాఖ్య రూపురేఖలు మారిపోతాయి అనడానికి కూడా లేదు. ఒకప్పుడు యూరోపియన్​ ఎకనామిక్​ కమిటీ (ఈఈసీ)గా పిలిచే ఈయూ.. కేవలం 6 దేశాలతో 1957లో ఏర్పడింది. ​6 దశాబ్దాల్లో దాని సంఖ్య 28కి చేరింది. బ్రిటన్​ 1973లో ఈయూలో చేరింది.

బ్రెగ్జిట్​తో బ్రిటన్​కు లాభమేనా!

బ్రసెల్స్​(ఐరోపా సమాఖ్య ప్రధాన కార్యాలయం) నుంచి విడిపోయి సార్వభౌమాధికారాన్ని పొందడం వల్ల దేశవాసులు ఆనందించినా... బ్రిటన్ లాభపడేది పెద్దగా ఏమీ ఉండదు. ఇన్నేళ్లు ఈయూలో అగ్రరాజ్యంగా చెలామణి అయిన బ్రిటన్​.. ఇప్పుడు ఎన్నో అధికారాలు కోల్పోనుంది.

స్కాట్లాండ్​, ఉత్తర ఐర్లాండ్​, ఇంగ్లాండ్​, వేల్స్​ను కలిపి యునైటెడ్​ కింగ్​డమ్​(బ్రిటన్​) అని అంటారు. ఈయూ నుంచి వైదొలగాలని 45 శాతం స్కాట్​లాండ్​ వాసులు ఓటేశారు. అనంతర కాలంలో లండన్​తో అనేక విషయాలపై విభేదాలు ఎదురయ్యాయి. అందువల్ల బ్రెగ్జిట్​పై యూటర్న్​ తీసుకుని.. రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని స్కాట్లాండ్​ పట్టుబడుతోంది.

తాజా ఎన్నికల్లో స్కాటిష్​ నేషనల్​ పార్టీ ఊహించని విధంగా 48 సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే 13 సీట్లు ఎక్కువ. అదే సమయంలో కన్జర్వేటివ్​ పార్టీ 7 సీట్లు కోల్పోయింది. దీని వల్ల స్కాట్లాండ్​ నుంచి బోరిస్​ ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత ఎదురవనుంది. ఉత్తర ఐర్లాండ్​ నుంచి కూడా బోరిస్​కు వ్యతిరేకత ఎదురయ్యే అవకాశముంది. తన వద్ద ఉన్న సరిహద్దు ప్రణాళికలను బోరిస్​ అమలు చేస్తే ఐర్లాండ్​తో సంబంధాలు క్షీణించే అవకాశముంది.

ఆర్థిక వ్యవస్థపై భారం...

బ్రెగ్జిట్​ వల్ల దేశం ఎంతో లాభపడుతుందని నేతలు ప్రకటిస్తున్నా.. ఈయూ నుంచి వైదొలిగితే బ్రిటన్​ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే సూచనలున్నాయి. దేశ జీడీపీ 3శాతం, అంతకుమించి పడిపోయే అవకాశముంది.

కేవలం బ్రెగ్జిట్​ ఒప్పందం గట్టెక్కితే సరిపోదు.. ఈయూ, అమెరికా, చైనా, భారత్​ వంటి దేశాలతో ఆర్థికంగా వ్యూహాత్మక భాగస్వామ్యం ఉండటం బ్రిటన్​కు ఎంతో ముఖ్యం. ఇది అంత సులభమైన విషయం కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా దేశాలతో సులభతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడమూ కష్టమే. ఒక వేళ ఒప్పందం కుదిరినా అది బ్రిటన్​కు అనుకూలంగా ఉంటుందని మాత్రం అనుకోలేము.

ఈ ఏడాది అక్టోబర్​ 17న ప్రధాని బోరిస్​-ఈయూ మధ్య ఒప్పందం కుదిరింది. కానీ ఆ సమయంలో బ్రిటన్​ పార్లమెంట్​లో మెజార్టీ లేకపోవడం వల్ల ఆ ఒప్పందానికి ఆమోదం లభించలేదు. తాజా ఎన్నికల అనంతరం పరిస్థితి మారడం వల్ల ఆ ఒప్పందాన్నే.. తదుపరి చర్చల కోసం బోరిస్​ వినియోగించవచ్చు.

ఇమిగ్రేషన్​ కష్టమే...!

నైపుణ్యం ఉన్నా లేకపోయినా... ఈయూ సభ్య దేశాల ప్రజలు ఇప్పటి వరకు ఇంగ్లాండ్​లో విద్య, ఉద్యోగ అవకాశాలు ఎంతో సులభంగా పొందేవారు. బ్రిటన్​ ప్రజలు బ్రెగ్జిట్​ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ఇదే. బ్రెగ్జిట్​ అనంతరం ఈ పరిస్థితి మారనుంది. ఇమిగ్రేషన్​ వ్యవస్థలో విశేష మార్పులు చోటుచేసుకుంటాయి. దేశాలతో సంబంధం లేకుండా కేవలం నైపుణ్యాన్నే ప్రాధాన్యతగా పరిగణించవచ్చు.

భారత్​తో చెలిమి...

భారత్​తో లేబర్​ పార్టీ కన్నా.. కన్జర్వేటివ్​ పార్టీకే ఎక్కువ మైత్రి ఉంది. ఎన్నికల్లో బోరిస్​ విజయం సాధించిన వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే బోరిస్​ భారత్​ను అనేక మార్లు సందర్శించారు. మరోమారు పర్యటనకు సిద్ధపడుతున్నట్టు సమాచారం.

బ్రిటన్​ దిగువ సభ 'హౌస్​​ ఆఫ్​ కామన్స్'​కు ఈసారి ఏకంగా 15 మంది భారత సంతతి ఎంపీలు ఎన్నికయ్యారు. వీరిలో ఏడుగురు కన్జర్వేటివ్​ పార్టీకి చెందిన వారే.

ఈ ఎన్నికల్లో బ్రిటన్​లోని భారత సంఘం కన్జర్వేటివ్​వైపే అధికంగా మొగ్గు చూపింది. ఇందుకు లేబర్​ పార్టీ నిర్ణయాలు కూడా ఓ కారణం. కశ్మీర్​ అంశంలో పాకిస్థాన్​కు అనుకూల వ్యాఖ్యలు చేసింది ఆ పార్టీ. దీనిపై భారతీయులు తమ ఆగ్రహాన్ని బహిరంగంగానే వ్యక్తపరిచారు.

ఎన్నో ఏళ్లుగా బ్రిటన్​ నేతలను ముప్పుతిప్పలు పెడుతున్న బ్రెగ్జిట్​ అంశానికి స్వస్తి పలకడానికి బోరిస్​ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. బ్రెగ్జిట్​కు గ్రీన్​ సిగ్నల్​ పడితే.. ఐరోపా సమాఖ్యలో చివరిగా చేరిన బ్రిటన్​.. ఇప్పుడు అదే ఈయూ నుంచి తప్పుకునే తొలి దేశంగా నిలవనుంది.

--- విష్ణు ప్రకాశ్​, భారత మాజీ విదేశాంగ ప్రతినిధి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kathmandu - 24 December 2019
1. Various of police van at detention centre with detained Chinese nationals inside
2. Various of suspects covering their faces outside detention centre
3. Various of suspects being loaded into van
4. Exterior of detention centre with a police flag
5. SOUNDBITE (Nepali) Shahakul Thapa, Nepali Police Official:
"The police, in cooperation with other branches of law enforcement, were able to detain 122 Chinese nationals which included men and women. We have seized their laptops, mobile phones and passports and are analysing the devices for our investigation. We are taking them to court to seek additional days in detention for investigation."
6. Various of police van
STORYLINE:
Police in Nepal said Tuesday that they have detained 122 Chinese nationals who are suspected of being involved in financial crimes.
The suspects were detained Monday in Kathmandu, Nepal's capital, police said.
Police official Shahakul Thapa said the suspects' laptops and mobile devices were seized for the investigation.
Details of the cases were not released because the investigation was still open, but the suspects are likely to be presented before a judge to determine how long they can be held for investigation.
Among them were 116 men and eight women.
They were held at different detention centres in Kathmandu.
Police were also investigating if they had violated immigration laws by overstaying their visas.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.