ETV Bharat / international

ఆ దేశ ప్రభుత్వం, పార్లమెంట్​పై సైబర్ దాడి! - ప్రభుత్వం, పార్లమెంట్​పై సైబర్ దాడి!

బెల్జియం దేశ పార్లమెంట్, ప్రభుత్వ సంస్థలకు అంతర్జాల సేవలందించే కంపెనీపై సైబర్ దాడి జరిగింది. అయితే ఎలాంటి సమాచారం తస్కరణకు గురికాలేదని సంస్థ తెలిపింది. దాడి కారణంగా ప్రభుత్వ టీకా పంపిణీ కార్యక్రమంలో పలు అవాంతరాయాలు ఎదురైనట్లు తెలుస్తోంది.

BELGIUM CYBERATTACK
ఆ దేశ ప్రభుత్వం, పార్లమెంట్​పై సైబర్ దాడి!
author img

By

Published : May 5, 2021, 6:18 AM IST

బెల్జియం పార్లమెంట్, ప్రభుత్వ ఏజెన్సీలకు అంతర్జాల సేవలందిస్తున్న 'బెల్​నెట్​' సంస్థపై సైబర్ దాడి జరిగింది. తమ కస్టమర్లకు సేవల్లో అంతరాయాలు ఏర్పడినట్లు సంస్థ తెలిపింది. సైబర్ దాడి ఇంకా కొనసాగుతోందని, దశల వారిగా ఈ దాడి జరిగిందని వెల్లడించింది. సైబర్ దాడి ప్రభావం తగ్గుతున్నట్లు కనిపిస్తోందని రెండు గంటల తర్వాత ప్రకటన జారీ చేసింది బెల్​నెట్. అయితే దీనిపై మరింత సమాచారం ఇవ్వలేదు.

"ఇలాంటి భారీ దాడిని ఎదుర్కోవడం మాకు ఇదే తొలిసారి. ఈ దాడులకు ప్రతిస్పందించడం చాలా కష్టం. మధ్యాహ్నం సమయానికి దాడి తీవ్ర స్థాయికి చేరింది. కానీ ఎలాంటి సమాచారం తస్కరణకు గురికాలేదు. వ్యవస్థను ధ్వంసం చేయడమే ఈ దాడుల లక్ష్యం. అంతేగానీ సమాచారాన్ని చోరీ చేయడం కాదు."

-డిర్క్ హేక్స్, బెల్​నెట్ డైరెక్టర్

అయితే ఈ దాడి వెనక ఎవరున్నారనేది ఇప్పుడే చెప్పలేమని హేక్స్ పేర్కొన్నారు.

సైబర్ దాడి తర్వాత కరోనా టీకా పంపిణీ కేంద్రాల్లో ఆన్​లైన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని స్థానిక మీడియా తెలిపింది. బ్రసెల్స్​లోని ప్రాసిక్యూటర్స్ కార్యాలయంలో సమస్యలు తలెత్తినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: బ్రిటన్​లో సీరం సంస్థ భారీ పెట్టుబడులు

బెల్జియం పార్లమెంట్, ప్రభుత్వ ఏజెన్సీలకు అంతర్జాల సేవలందిస్తున్న 'బెల్​నెట్​' సంస్థపై సైబర్ దాడి జరిగింది. తమ కస్టమర్లకు సేవల్లో అంతరాయాలు ఏర్పడినట్లు సంస్థ తెలిపింది. సైబర్ దాడి ఇంకా కొనసాగుతోందని, దశల వారిగా ఈ దాడి జరిగిందని వెల్లడించింది. సైబర్ దాడి ప్రభావం తగ్గుతున్నట్లు కనిపిస్తోందని రెండు గంటల తర్వాత ప్రకటన జారీ చేసింది బెల్​నెట్. అయితే దీనిపై మరింత సమాచారం ఇవ్వలేదు.

"ఇలాంటి భారీ దాడిని ఎదుర్కోవడం మాకు ఇదే తొలిసారి. ఈ దాడులకు ప్రతిస్పందించడం చాలా కష్టం. మధ్యాహ్నం సమయానికి దాడి తీవ్ర స్థాయికి చేరింది. కానీ ఎలాంటి సమాచారం తస్కరణకు గురికాలేదు. వ్యవస్థను ధ్వంసం చేయడమే ఈ దాడుల లక్ష్యం. అంతేగానీ సమాచారాన్ని చోరీ చేయడం కాదు."

-డిర్క్ హేక్స్, బెల్​నెట్ డైరెక్టర్

అయితే ఈ దాడి వెనక ఎవరున్నారనేది ఇప్పుడే చెప్పలేమని హేక్స్ పేర్కొన్నారు.

సైబర్ దాడి తర్వాత కరోనా టీకా పంపిణీ కేంద్రాల్లో ఆన్​లైన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని స్థానిక మీడియా తెలిపింది. బ్రసెల్స్​లోని ప్రాసిక్యూటర్స్ కార్యాలయంలో సమస్యలు తలెత్తినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: బ్రిటన్​లో సీరం సంస్థ భారీ పెట్టుబడులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.