ETV Bharat / international

కరోనాతో సమస్తం బంద్​- స్తంభించిన జనజీవనం

author img

By

Published : Mar 12, 2020, 9:51 PM IST

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా ప్రభావం ఐక్యరాజ్య సమితి సమావేశాలపైనా పడింది. ఐరాస మానవ హక్కుల మండలి సమావేశం రద్దయింది. మరోవైపు కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థతో పాటు విద్యావ్యవస్థపైనా భారీగా పడింది.

UN Human Rights Council to suspend session over COVID-19 aond world effected countries
ఐక్యరాజ్య సమితి సమావేశాలకు కరోనా ప్రభావం

ప్రాణాంతక కరోనా వైరస్​తో ప్రపంచం బెంబేలెత్తిపోతోంది. ఇప్పటికే అనేక వేడుకలు, ముఖ్య సమావేశాలు రద్దయ్యాయి. ఈ జాబితాలోకి ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ వార్షిక సమావేశం కూడా చేరింది.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశం ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. ఈ నెల 20 వరకు సమావేశం జరగాల్సి ఉంది. అయితే కరోనా విజృంభిస్తోన్న తరుణంలో.. శుక్రవారం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సమావేశాన్ని రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. సమావేశంలో పాల్గొన్న వారు దీనికి మద్దతు పలికారు. కరోనా వైరస్​ను అంతర్జాతీయ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) పేర్కొన్న మరుసటి రోజే.. ఈ నిర్ణయం వెలువడింది.

మార్స్​ మిషన్ వాయిదా

కరోనా ప్రభావం అంతరిక్ష పరిశోధనలపైనా పడింది. రష్యా- ఐరోపా సంయుక్తంగా చేపట్టిన మార్స్​ మిషన్​ వాయిదా పడింది. ప్రాణాంతక వైరస్​తో పాటు సాంకేతిక లోపాలు కూడా ఇందుకు కారణమని రష్యా అంతరిక్ష సంస్థ ప్రకటించింది. 2022లో ఈ మిషన్​ చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది.

స్పెయిన్​లో రెట్టింపు..

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్​ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. స్పెయిన్​లో దాదాపు 3 వేల కేసులు నమోదవగా మృతుల సంఖ్య 84కు చేరింది. కేవలం 24 గంటల వ్యవధిలో మృతుల సంఖ్య రెట్టింపవడం ఆ దేశ ప్రజలను కలవరపెడుతోంది.

కరోనా వల్ల పోలాండ్​లో తొలి మరణం సంభవించింది. దేశంలో మరో 46 మంది వైరస్​ బారిన పడ్డారు.

విద్యాసంస్థలు బంద్​...

అంతర్జాతీయ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మూతపడుతున్నాయి. ఈ జాబితాలోకి ఐర్లాండ్​, శ్రీలంక కూడా చేరాయి. ఐర్లాండ్​లో 43 కరోనా కేసులు నమోదుకాగా, ఒకరు మృతి చెందారు.

శ్రీలంకలో అన్ని విద్యాసంస్థలు ఏప్రిల్​ 20 వరకు మూసివేస్తున్నట్లు ఆ దేశ విద్యాశాఖ ప్రకటించింది. ఇటీవల శ్రీలంకలో రెండో వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది.

ప్రాణాంతక కరోనా వైరస్​తో ప్రపంచం బెంబేలెత్తిపోతోంది. ఇప్పటికే అనేక వేడుకలు, ముఖ్య సమావేశాలు రద్దయ్యాయి. ఈ జాబితాలోకి ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ వార్షిక సమావేశం కూడా చేరింది.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశం ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. ఈ నెల 20 వరకు సమావేశం జరగాల్సి ఉంది. అయితే కరోనా విజృంభిస్తోన్న తరుణంలో.. శుక్రవారం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సమావేశాన్ని రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. సమావేశంలో పాల్గొన్న వారు దీనికి మద్దతు పలికారు. కరోనా వైరస్​ను అంతర్జాతీయ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) పేర్కొన్న మరుసటి రోజే.. ఈ నిర్ణయం వెలువడింది.

మార్స్​ మిషన్ వాయిదా

కరోనా ప్రభావం అంతరిక్ష పరిశోధనలపైనా పడింది. రష్యా- ఐరోపా సంయుక్తంగా చేపట్టిన మార్స్​ మిషన్​ వాయిదా పడింది. ప్రాణాంతక వైరస్​తో పాటు సాంకేతిక లోపాలు కూడా ఇందుకు కారణమని రష్యా అంతరిక్ష సంస్థ ప్రకటించింది. 2022లో ఈ మిషన్​ చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది.

స్పెయిన్​లో రెట్టింపు..

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్​ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. స్పెయిన్​లో దాదాపు 3 వేల కేసులు నమోదవగా మృతుల సంఖ్య 84కు చేరింది. కేవలం 24 గంటల వ్యవధిలో మృతుల సంఖ్య రెట్టింపవడం ఆ దేశ ప్రజలను కలవరపెడుతోంది.

కరోనా వల్ల పోలాండ్​లో తొలి మరణం సంభవించింది. దేశంలో మరో 46 మంది వైరస్​ బారిన పడ్డారు.

విద్యాసంస్థలు బంద్​...

అంతర్జాతీయ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మూతపడుతున్నాయి. ఈ జాబితాలోకి ఐర్లాండ్​, శ్రీలంక కూడా చేరాయి. ఐర్లాండ్​లో 43 కరోనా కేసులు నమోదుకాగా, ఒకరు మృతి చెందారు.

శ్రీలంకలో అన్ని విద్యాసంస్థలు ఏప్రిల్​ 20 వరకు మూసివేస్తున్నట్లు ఆ దేశ విద్యాశాఖ ప్రకటించింది. ఇటీవల శ్రీలంకలో రెండో వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.