ETV Bharat / international

మొన్న విజయ్ మాల్యా... ఇప్పుడు నీరవ్ మోదీ!

author img

By

Published : Mar 9, 2019, 4:36 PM IST

Updated : Mar 9, 2019, 5:43 PM IST

బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి లండన్​ పరారైన విజయ్​ మాల్యాను భారత్​కు అప్పగించాలని ఇటీవలే తీర్పునిచ్చింది లండన్​ వెస్ట్​మినిస్టర్​ కోర్టు. ఇప్పుడదే కోర్టులో నీరవ్ మోదీ అప్పగింతపై విచారణ జరగనుంది.

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణం నిందితుడు నీరవ్​ మోదీ
పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణం నిందితుడు నీరవ్​ మోదీ

పంజాబ్ నేషనల్​ బ్యాంకు కుంభకోణంలో కీలక నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి బ్రిటన్​​ సూచనప్రాయంగా అంగీకరించింది. నీరవ్​ మోదీని తమకు అప్పగించాలని భారత్​ చేసిన విజ్ఞప్తిపై న్యాయప్రక్రియ ప్రారంభించింది.

మరో రెండు రోజుల్లో నీరవ్​ మోదీ కేసును లండన్​లోని వెస్ట్​మినిస్టర్​ న్యాయస్థానం ముందు ఉంచుతామని బ్రిటన్​ హోంమంత్రి సాజిద్​ జావేద్​ కార్యాలయం నుంచి ఈడీకి సమాచారం అందింది.

త్వరలోనే ఈడీ, సీబీఐ అధికారులు కలిసి లండన్​ వెళ్లి, నీరవ్​ మోదీ నేరాలపై అక్కడి న్యాయస్థానంలో సాక్ష్యాలు సమర్పించనున్నారు. మరో బ్యాంకు కుంభకోణ నిందితుడు విజయ్​మాల్యా కేసులోనూ సాక్ష్యాధారాలు అందజేస్తారు.

ఘరానా మోసగాళ్లు....

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణంలో నీరవ్​ మోదీ, అతని మామ మెహుల్​ చోక్సీ, కొందరు బ్యాంకు అధికారులు నిందితులుగా ఉన్నారు. వీరిపై ఈడీ, సీబీఐలు అక్రమ నగదు చలామణి కేసు నమోదు చేశాయి. వెంటనే వీరు దేశం విడిచి పారిపోయారు. వీరిని భారత్​కు రప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నీరవ్​ కోసం ఇప్పటికే ఇంటర్​పోల్ రెడ్​కార్నర్​ నోటీసులు జారీ చేసింది.

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణం నిందితుడు నీరవ్​ మోదీ

పంజాబ్ నేషనల్​ బ్యాంకు కుంభకోణంలో కీలక నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి బ్రిటన్​​ సూచనప్రాయంగా అంగీకరించింది. నీరవ్​ మోదీని తమకు అప్పగించాలని భారత్​ చేసిన విజ్ఞప్తిపై న్యాయప్రక్రియ ప్రారంభించింది.

మరో రెండు రోజుల్లో నీరవ్​ మోదీ కేసును లండన్​లోని వెస్ట్​మినిస్టర్​ న్యాయస్థానం ముందు ఉంచుతామని బ్రిటన్​ హోంమంత్రి సాజిద్​ జావేద్​ కార్యాలయం నుంచి ఈడీకి సమాచారం అందింది.

త్వరలోనే ఈడీ, సీబీఐ అధికారులు కలిసి లండన్​ వెళ్లి, నీరవ్​ మోదీ నేరాలపై అక్కడి న్యాయస్థానంలో సాక్ష్యాలు సమర్పించనున్నారు. మరో బ్యాంకు కుంభకోణ నిందితుడు విజయ్​మాల్యా కేసులోనూ సాక్ష్యాధారాలు అందజేస్తారు.

ఘరానా మోసగాళ్లు....

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణంలో నీరవ్​ మోదీ, అతని మామ మెహుల్​ చోక్సీ, కొందరు బ్యాంకు అధికారులు నిందితులుగా ఉన్నారు. వీరిపై ఈడీ, సీబీఐలు అక్రమ నగదు చలామణి కేసు నమోదు చేశాయి. వెంటనే వీరు దేశం విడిచి పారిపోయారు. వీరిని భారత్​కు రప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నీరవ్​ కోసం ఇప్పటికే ఇంటర్​పోల్ రెడ్​కార్నర్​ నోటీసులు జారీ చేసింది.

New Delhi, Mar 09 (ANI): While talking to ANI about Congress party and its president Rahul Gandhi, Union Minister for Minority Affairs Mukhtar Abbas Naqvi said, "Congress party has become the flop show of PVR (Priyanka, Vadra, Rahul). These fixers daily have some fake and fabricated story to tell just to divert the attention of people. But unfortunately no one listens to them. Congress will not understand the reality that has happened in PM Modi's government. In Congress rule, nothing was possible other than corruption, fraud and loot. But in Modi government, development, progress, dealing with terrorism and crime is possible. Congress attitude towards the issue of national security is very disappointing and wrong. People of the nation will give befitting reply to all the lies and false allegations that are made by the Congress party and its leaders".
Last Updated : Mar 9, 2019, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.