ETV Bharat / international

సముద్రమట్టానికి 3000 మీ. ఎత్తులో బెంగాల్​ టైగర్!

author img

By

Published : Dec 12, 2020, 10:13 PM IST

నేపాల్​ తూర్పు కొండ ప్రాంతాల్లో పులి జాడను మొదటిసారి కనుగొన్నారు. 3,000 మీటర్ల కంటే ఎత్తైన ప్రాంతంలో బెంగాల్​ టైగర్​ను గుర్తించారు. కెమెరాల్లో ఈ పులి చిత్రాలు నమోదయ్యాయి.

tigers in nepal
3,000 మీటర్ల ఎత్తులో కెమెరా కంటికి చిక్కిన పులి

నేపాల్​లో సముద్రమట్టానికి 3,000 మీటర్ల కంటే ఎత్తైన ప్రాంతంలో మొదటిసారి బెంగాల్​ టైగర్​ను గుర్తించారు. ఈ విషయాన్ని నేపాల్​కు చెందిన వన్యప్రాణుల సంరక్షణ విభాగం, అటవీ శాఖ, జాతీయ ఉద్యానవనాల శాఖలు తెలిపాయి. వన్యప్రాణులు కనుమరుగవుతున్నాయని ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో.. ఈ పులిని హిమాలయాల్లో గుర్తించడం వల్ల ప్రాధాన్యం ఏర్పడింది.

"అరుదైన రాయల్​ బెంగాల్​ టైగర్​.. తూర్పు నేపాల్​ ఇల్లమ్​ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాలకు చిక్కింది. 3,165 మీటర్ల ఎత్తులో ఈ పులి కనిపించింది. దేశంలోని తూర్పు కొండ ప్రాంతాల్లో పులులు ఉన్నాయనడానికి ఈ ఫొటో మెదటి సాక్ష్యంగా నిలిచింది."

-- నేపాల్​ అటవీ &వన్యప్రాణుల సంరక్షణ, జాతీయ ఉద్యానవన శాఖ

మొదటిసారి ఈ పులి జాడ కనిపించిన నేపథ్యంలో.. అదే ప్రాంతంలో 'లింక్సెస్'​(పెద్ద పిల్లులు)ను గుర్తించడానికి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని నేపాల్​ అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, జాతీయ ఉద్యానవన శాఖలు తెలిపాయి.

అంతకుముందు 4,038 మీటర్ల ఎత్తులో పులిని భూటాన్​ గుర్తించింది. అరుణాచల్​ ప్రదేశ్​లో 3,630 మీటర్ల ఎత్తులో పులిని గుర్తించారు.

2016 ప్రపంచ పులుల లెక్క ప్రకారం.. భారత్​లో 2,226 పులులు ఉండగా, రష్యా- 433, ఇండోనేసియా- 371, మలేసియా- 250, నేపాల్​- 198, థాయిలాండ్​- 789, బంగ్లాదేశ్- 106, భూటాన్​-103 పులులు ఉన్నాయి.

తాజాగా.. 2018 గణాంకాల ప్రకారం నేపాల్​లో 235 పులులు ఉన్నాయని తేలింది. 2022 కల్లా ఈ పులుల సంఖ్యను 250కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది నేపాల్​ ప్రభుత్వం.

ఇదీ చూడండి:ఆ మూడు సంరక్షణ కేంద్రాల్లో పులులు మాయం!

ఇదీ చూడండి:పులుల సంఖ్యలో ఏటా 6 శాతం వృద్ధి

నేపాల్​లో సముద్రమట్టానికి 3,000 మీటర్ల కంటే ఎత్తైన ప్రాంతంలో మొదటిసారి బెంగాల్​ టైగర్​ను గుర్తించారు. ఈ విషయాన్ని నేపాల్​కు చెందిన వన్యప్రాణుల సంరక్షణ విభాగం, అటవీ శాఖ, జాతీయ ఉద్యానవనాల శాఖలు తెలిపాయి. వన్యప్రాణులు కనుమరుగవుతున్నాయని ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో.. ఈ పులిని హిమాలయాల్లో గుర్తించడం వల్ల ప్రాధాన్యం ఏర్పడింది.

"అరుదైన రాయల్​ బెంగాల్​ టైగర్​.. తూర్పు నేపాల్​ ఇల్లమ్​ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాలకు చిక్కింది. 3,165 మీటర్ల ఎత్తులో ఈ పులి కనిపించింది. దేశంలోని తూర్పు కొండ ప్రాంతాల్లో పులులు ఉన్నాయనడానికి ఈ ఫొటో మెదటి సాక్ష్యంగా నిలిచింది."

-- నేపాల్​ అటవీ &వన్యప్రాణుల సంరక్షణ, జాతీయ ఉద్యానవన శాఖ

మొదటిసారి ఈ పులి జాడ కనిపించిన నేపథ్యంలో.. అదే ప్రాంతంలో 'లింక్సెస్'​(పెద్ద పిల్లులు)ను గుర్తించడానికి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని నేపాల్​ అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, జాతీయ ఉద్యానవన శాఖలు తెలిపాయి.

అంతకుముందు 4,038 మీటర్ల ఎత్తులో పులిని భూటాన్​ గుర్తించింది. అరుణాచల్​ ప్రదేశ్​లో 3,630 మీటర్ల ఎత్తులో పులిని గుర్తించారు.

2016 ప్రపంచ పులుల లెక్క ప్రకారం.. భారత్​లో 2,226 పులులు ఉండగా, రష్యా- 433, ఇండోనేసియా- 371, మలేసియా- 250, నేపాల్​- 198, థాయిలాండ్​- 789, బంగ్లాదేశ్- 106, భూటాన్​-103 పులులు ఉన్నాయి.

తాజాగా.. 2018 గణాంకాల ప్రకారం నేపాల్​లో 235 పులులు ఉన్నాయని తేలింది. 2022 కల్లా ఈ పులుల సంఖ్యను 250కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది నేపాల్​ ప్రభుత్వం.

ఇదీ చూడండి:ఆ మూడు సంరక్షణ కేంద్రాల్లో పులులు మాయం!

ఇదీ చూడండి:పులుల సంఖ్యలో ఏటా 6 శాతం వృద్ధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.