ETV Bharat / international

సూకీకి మద్దతుగా మయన్మార్​లో భగ్గుమన్న నిరసనలు

author img

By

Published : Feb 7, 2021, 2:48 PM IST

మయన్మార్​ సైనిక తిరుగుబాటును నిరసిస్తూ ఆందోళనలు భగ్గుమన్నాయి. దేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటైన యాంగూన్​లో 2వేల మంది నిరసనకారులు ర్యాలీ నిర్వహించారు. ఆంగ్ సాన్ సూకీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Thousands join Yangon protest against army coup
మయన్మార్​లో భగ్గుమన్న నిరసనలు

మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుపై ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటైన యాంగూన్​లో సుమారు 2వేల మందికి పైగా నిరసనకారులు ఆదివారం ర్యాలీలు నిర్వహించారు. నిర్బంధంలో ఉంచిన ఆంగ్ సాన్ సూకీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మయన్మార్​లో భగ్గుమన్న నిరసనలు

యాంగూన్ విశ్వవిద్యాలయానికి సమీపంలో ఆందోళనలు చేపట్టిన కార్మిక, విద్యార్థి సంఘూలు, సామాజిక కార్యకర్తలు 'లాంగ్ లివ్ మదర్ సూ' అనే నినాదాలతో ర్యాలీని హోరెత్తించారు. అలాగే 'మిలిటరీ నియంతృత్వం నశించాలి' అంటూ నినాదాలు చేశారు. ఆంగ్​ సాన్​ సూకీతో పాటు.. అధ్యక్షుడు 'విన్ మింట్​'లకు స్వేచ్ఛ ప్రసాదించాలని ప్లకార్డులు ప్రదర్శించారు.

ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లు కూడా..

ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లను ఉపయోగించడానికి వీల్లేకుండా.. ఇంటర్నెట్‌కు వ్యాప్తిని సైన్యం తగ్గించింది. ఇప్పటికే అక్కడ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపేసిన సైన్యం ఫేస్​బుక్​పై నిషేధించింది. గత ఎన్నికల్లో జరిగిన మోసాలపై అందిన ఫిర్యాదులను పరిష్కరించడంలో సూకీ విఫలమైందని మిలటరీ ఆరోపిస్తోంది.

మాదే నిజమైన ప్రభుత్వం..

మరోవైపు ప్రస్తుత చట్టసభ సభ్యులు శుక్రవారం ఆన్‌లైన్ సమావేశాన్ని నిర్వహించారు. తమను తాము చట్టబద్ధ ప్రతినిధులుగా ప్రకటించుకున్నారు. మయాన్మార్​ తదుపరి ప్రభుత్వంగా తమను గుర్తించాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి: మయన్మార్​లో సైనిక తిరుగుబాటు- ఖండించిన ప్రపంచ దేశాలు

మయన్మార్​లో సైనిక తిరుగుబాటు- ఖండించిన ప్రపంచ దేశాలు

మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుపై ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటైన యాంగూన్​లో సుమారు 2వేల మందికి పైగా నిరసనకారులు ఆదివారం ర్యాలీలు నిర్వహించారు. నిర్బంధంలో ఉంచిన ఆంగ్ సాన్ సూకీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మయన్మార్​లో భగ్గుమన్న నిరసనలు

యాంగూన్ విశ్వవిద్యాలయానికి సమీపంలో ఆందోళనలు చేపట్టిన కార్మిక, విద్యార్థి సంఘూలు, సామాజిక కార్యకర్తలు 'లాంగ్ లివ్ మదర్ సూ' అనే నినాదాలతో ర్యాలీని హోరెత్తించారు. అలాగే 'మిలిటరీ నియంతృత్వం నశించాలి' అంటూ నినాదాలు చేశారు. ఆంగ్​ సాన్​ సూకీతో పాటు.. అధ్యక్షుడు 'విన్ మింట్​'లకు స్వేచ్ఛ ప్రసాదించాలని ప్లకార్డులు ప్రదర్శించారు.

ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లు కూడా..

ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లను ఉపయోగించడానికి వీల్లేకుండా.. ఇంటర్నెట్‌కు వ్యాప్తిని సైన్యం తగ్గించింది. ఇప్పటికే అక్కడ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపేసిన సైన్యం ఫేస్​బుక్​పై నిషేధించింది. గత ఎన్నికల్లో జరిగిన మోసాలపై అందిన ఫిర్యాదులను పరిష్కరించడంలో సూకీ విఫలమైందని మిలటరీ ఆరోపిస్తోంది.

మాదే నిజమైన ప్రభుత్వం..

మరోవైపు ప్రస్తుత చట్టసభ సభ్యులు శుక్రవారం ఆన్‌లైన్ సమావేశాన్ని నిర్వహించారు. తమను తాము చట్టబద్ధ ప్రతినిధులుగా ప్రకటించుకున్నారు. మయాన్మార్​ తదుపరి ప్రభుత్వంగా తమను గుర్తించాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి: మయన్మార్​లో సైనిక తిరుగుబాటు- ఖండించిన ప్రపంచ దేశాలు

మయన్మార్​లో సైనిక తిరుగుబాటు- ఖండించిన ప్రపంచ దేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.