ETV Bharat / international

'సైకో సైనికుడి'ని మట్టుబెట్టిన థాయ్ సేనలు! - thailand gun crime

థాయిలాండ్​లో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మంది ప్రాణాలు తీసిన జవాన్​ను ఆ దేశ సైన్యం మట్టుబెట్టింది. సైనికుడి కాల్పులు, అతడిని మట్టుబెట్టేందుకు సైన్యం ప్రయత్నంతో మొత్తంగా 17 గంటలపాటు ఆపరేషన్ కొనసాగింది. అయితే భూవివాదంతో విసుగు చెందే సైకో సైనికుడు ఈ కాల్పులకు తెగబడినట్టు సమాచారం.

thailand
'సైకో సైనికుడి'ని మట్టుబెట్టిన థాయ్ సేనలు!
author img

By

Published : Feb 9, 2020, 10:52 AM IST

Updated : Feb 29, 2020, 5:38 PM IST

'సైకో సైనికుడి'ని మట్టుబెట్టిన థాయ్ సేనలు!

థాయి​లాండ్​లోని ఓ షాపింగ్​మాల్​లో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మంది ప్రాణాలు పోయేందుకు కారణమైన నిందితుడిని కాల్చిచంపాయి థాయ్ సేనలు. సైకో జవాను కాల్పులు, మట్టుబెట్టేందుకు థాయ్ సేనల యత్నాలతో ఈ ఆపరేషన్​ 17 గంటలపాటు కొనసాగింది. నిందితుడి కాల్చివేతతో ఇది ముగిసింది. సైకో కాల్పుల్లో మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు థాయి​లాండ్ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.

ఇదీ జరిగింది..

సైన్యంలో జూనియర్ అధికారిగా పనిచేస్తున్న సార్జెంట్​ మేజర్​ జక్రపంత్ థోమా.. శనివారం సాయంత్రం నఖోన్​ రాచసిమాలోని ఆర్మీ బ్యారెక్స్​కు వచ్చాడు. అక్కడే ఉన్న సీనియర్​ కమాండింగ్ అధికారిపై కాల్పులు జరిపాడు. ఆయనతో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తర్వాత బ్యారెక్స్​ నుంచి ఆయుధాలు, ఓ వాహనాన్ని తస్కరించి నగరం నడిబొడ్డున ఉన్న టెర్మినల్ 21 షాపింగ్​ సెంటర్​లో ప్రవేశించాడు. వచ్చిన వెంటనే అక్కడున్న వారిపై కాల్పులు మొదలుపెట్టాడు. దీంతో జనం బెంబేలెత్తి అక్కడి నుంచి హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు.

భూ వివాదమే కారణమా!

భూ వివాదం కారణంగానే కోపోద్రిక్తుడైన జవాను కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు అధికారులు. భయంతో షాపింగ్​మాల్​లో నక్కిన ప్రజలను బయటకు తీసుకువచ్చేందుకు యోచిస్తోంది థాయ్ సర్కారు.

ప్రపంచంలో తుపాకీల వ్యాపారం జోరుగా సాగుతున్న దేశాల్లో థాయి​లాండ్ ఒకటి. ఇక్కడ కాల్పులు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఓ సైనికాధికారి సామాన్యులను లక్ష్యంగా చేసుకుని భారీగా కాల్పులకు పాల్పడటం మాత్రం ఇదే తొలిసారి.

'సైకో సైనికుడి'ని మట్టుబెట్టిన థాయ్ సేనలు!

థాయి​లాండ్​లోని ఓ షాపింగ్​మాల్​లో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మంది ప్రాణాలు పోయేందుకు కారణమైన నిందితుడిని కాల్చిచంపాయి థాయ్ సేనలు. సైకో జవాను కాల్పులు, మట్టుబెట్టేందుకు థాయ్ సేనల యత్నాలతో ఈ ఆపరేషన్​ 17 గంటలపాటు కొనసాగింది. నిందితుడి కాల్చివేతతో ఇది ముగిసింది. సైకో కాల్పుల్లో మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు థాయి​లాండ్ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.

ఇదీ జరిగింది..

సైన్యంలో జూనియర్ అధికారిగా పనిచేస్తున్న సార్జెంట్​ మేజర్​ జక్రపంత్ థోమా.. శనివారం సాయంత్రం నఖోన్​ రాచసిమాలోని ఆర్మీ బ్యారెక్స్​కు వచ్చాడు. అక్కడే ఉన్న సీనియర్​ కమాండింగ్ అధికారిపై కాల్పులు జరిపాడు. ఆయనతో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తర్వాత బ్యారెక్స్​ నుంచి ఆయుధాలు, ఓ వాహనాన్ని తస్కరించి నగరం నడిబొడ్డున ఉన్న టెర్మినల్ 21 షాపింగ్​ సెంటర్​లో ప్రవేశించాడు. వచ్చిన వెంటనే అక్కడున్న వారిపై కాల్పులు మొదలుపెట్టాడు. దీంతో జనం బెంబేలెత్తి అక్కడి నుంచి హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు.

భూ వివాదమే కారణమా!

భూ వివాదం కారణంగానే కోపోద్రిక్తుడైన జవాను కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు అధికారులు. భయంతో షాపింగ్​మాల్​లో నక్కిన ప్రజలను బయటకు తీసుకువచ్చేందుకు యోచిస్తోంది థాయ్ సర్కారు.

ప్రపంచంలో తుపాకీల వ్యాపారం జోరుగా సాగుతున్న దేశాల్లో థాయి​లాండ్ ఒకటి. ఇక్కడ కాల్పులు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఓ సైనికాధికారి సామాన్యులను లక్ష్యంగా చేసుకుని భారీగా కాల్పులకు పాల్పడటం మాత్రం ఇదే తొలిసారి.

Mumbai, Feb 09 (ANI): The international marathon of Maharashtra Police was flagged off in Mumbai on February 09. Marathon was flagged off from Bandra-Worli Sea Link to Gateway of India. Bollywood actors Farhan Akhtar and Suniel Shetty were also present. Maharashtra Home Minister Anil Deshmukh also marked his presence in the marathon. The 16-km marathon started from Toll Plaza, Rajiv Gandhi Sea Link which will reach at Gateway of India. The full marathon for the international elite was flagged off from Gateway of India at 05:00 am and full marathon for the Indian athletes was flagged off at 05:10 am. Around 6000 police staff and 17,000 other people participated in the marathon.
Last Updated : Feb 29, 2020, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.