ETV Bharat / international

భారత్ ఎలాగైనా​ ఆదుకో.. ఉక్రెయిన్ మరోమారు విజ్ఞప్తి

author img

By

Published : Feb 26, 2022, 10:18 AM IST

Ukraine India: భారత్​ తన దౌత్యశక్తిని ఉపయోగించి తమపై రష్యా చేస్తున్న దాడిని ఆపాలని ఉక్రెయిన్ మరోమారు విజ్ఞప్తి చేసింది. ఆ దేశ విదేశాంగమంత్రి ఈ మేరకు ట్వీట్ చేశారు. ఈ విషయంపై జైశంకర్​తో ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు.

Russia Ukraine War,భారత్ ఎలాగైనా​ ఆదుకో
భారత్ ఎలాగైనా​ ఆదుకో.. ఉక్రెయిన్ మరోమారు విజ్ఞప్తి

Russia attack Ukraine: ఉక్రెయిన్ విదేశాంగమంత్రి డిమిట్రో కులేబ.. భారత విదేశాంగమంత్రి ఎస్​ జైశంకర్​కు ఫోన్ చేశారు. మాస్కోతో దౌత్యసంబంధాలను ఉపయోగించి ఎలాగైనా రష్యా తమదేశంపై చేస్తున్న దండయాత్రను ఆపేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అంతేగాక ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్​లో శాంతిస్థాపనుకు ఉద్దేశించిన తీర్మానానికి మద్దతు తెలపాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Ukraine India Relations

దౌత్యం, చర్చలే ఏ సమస్యకైనా పరిష్కార మార్గమని కులేబకు జైశంకర్ సూచించారు. భారత్​ దీన్నే విశ్వసిస్తుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్​ నుంచి భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశం తరలించేందుకు సహకరిస్తున్నందుకు కులేబకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Russia Ukraine War

అంతకుముందు ఉక్రెయిన్​పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 15 సభ్య దేశాల్లో 11 దీనికి మద్దతు తెలిపాయి. భారత్​, చైనా, యూఏఈ ఓటింగ్​కు దూరంగా ఉన్నాయి. వీటోను ఉపయోగించి రష్యా తీర్మానాన్ని అడ్డుకుంది.

అయితే వివాదాలు పరిష్కారం కావాడానికి చర్చలు మాత్రమే మార్గమని భారత్​ తెలిపింది. ఇరు దేశాలు చర్చలు జరిపి శాంతిస్థాపన దిశగా అడుగులు వేయాలని సూచించింది.

ఇదీ చదవండి: 'స్విఫ్ట్​' అస్త్రం ప్రయోగిస్తే.. రష్యాకు జరిగే నష్టం ఏంటి?

Russia attack Ukraine: ఉక్రెయిన్ విదేశాంగమంత్రి డిమిట్రో కులేబ.. భారత విదేశాంగమంత్రి ఎస్​ జైశంకర్​కు ఫోన్ చేశారు. మాస్కోతో దౌత్యసంబంధాలను ఉపయోగించి ఎలాగైనా రష్యా తమదేశంపై చేస్తున్న దండయాత్రను ఆపేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అంతేగాక ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్​లో శాంతిస్థాపనుకు ఉద్దేశించిన తీర్మానానికి మద్దతు తెలపాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Ukraine India Relations

దౌత్యం, చర్చలే ఏ సమస్యకైనా పరిష్కార మార్గమని కులేబకు జైశంకర్ సూచించారు. భారత్​ దీన్నే విశ్వసిస్తుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్​ నుంచి భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశం తరలించేందుకు సహకరిస్తున్నందుకు కులేబకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Russia Ukraine War

అంతకుముందు ఉక్రెయిన్​పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 15 సభ్య దేశాల్లో 11 దీనికి మద్దతు తెలిపాయి. భారత్​, చైనా, యూఏఈ ఓటింగ్​కు దూరంగా ఉన్నాయి. వీటోను ఉపయోగించి రష్యా తీర్మానాన్ని అడ్డుకుంది.

అయితే వివాదాలు పరిష్కారం కావాడానికి చర్చలు మాత్రమే మార్గమని భారత్​ తెలిపింది. ఇరు దేశాలు చర్చలు జరిపి శాంతిస్థాపన దిశగా అడుగులు వేయాలని సూచించింది.

ఇదీ చదవండి: 'స్విఫ్ట్​' అస్త్రం ప్రయోగిస్తే.. రష్యాకు జరిగే నష్టం ఏంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.