ఆసియాన్ దేశాల రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బ్యాంకాక్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగే రక్షణ, భద్రత ప్రదర్శన-2019లో ప్రారంభోత్సవానికి రాజ్నాథ్ హాజరు కానున్నారు.
అమెరికా రక్షణమంత్రి మార్క్ ఎస్పర్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు రాజ్నాథ్. ఇతర దేశాల రక్షణ మంత్రులతో సహా వ్యాపార, పారిశ్రామిక వర్గాలతో సమావేశమవుతారని అధికారులు తెలిపారు.