ETV Bharat / international

న్యూజిలాండ్​ ప్రధానిగా జెసిండాకు మళ్లీ పట్టం

author img

By

Published : Oct 17, 2020, 3:57 PM IST

Updated : Oct 17, 2020, 4:33 PM IST

న్యూజిలాండ్​ సాధారణ ఎన్నికల్లో జెసిండా ఆర్డెర్న్​ ఘన విజయం సాధించారు. ఫలితంగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టానున్నారు. ఆమె ప్రాతినిధ్యం వహించిన లిబరల్​ లేబర్​ పార్టీ ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ అందుకుంది. మొత్తం ఓటింగ్​లో 49 శాతం ఓట్లు జెసిండా పార్టీకే దక్కాయి.

Jacinda Ardern's landslide victory
న్యూజిలాండ్​ ప్రధాని జెసిండాకు మరోసారి పట్టం

న్యూజిలాండ్​ ప్రధానిగా జెసిండా ఆర్డెర్న్​కు మళ్లీ పట్టం కట్టారు ఆ దేశ ప్రజలు. సాధారణ ఎన్నికల్లో ఆమెకు తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు. కరోనా నియంత్రణ, సామాజిక అసమానతల కట్టడిలో జెసిండా అద్భుతమైన పనితీరు వల్లే భారీ ఆధిక్యం సాధించారు. తాజా ఫలితాలతో మరో మూడేళ్లు జెసిండా ఆర్డెర్న్​ ప్రధానిగా పనిచేయనున్నారు.

ఈ ఎన్నికల్లో 49 శాతం ఓట్లు జెసిండా పార్టీకే వచ్చాయి. 1930 నుంచి ఇదే భారీ మెజార్టీ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షం కన్సర్వేటివ్​ నేషనల్​ పార్టీ 27 శాతం ఓట్లకే పరిమితమైంది. ఈ పార్టీ 2002 కంటే ఘోరమైన ఫలితాలను మూటగట్టుకుంది.

తొలిసారి..

కివీస్​లో చాలా ఏళ్లుగా కూటములే ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. 40 ఏళ్ల జెసిండా మొదటిసారి ఇదే తరహాలో అధికారం చేపట్టారు. అయితే ఈసారి సీన్​ రివర్సయింది. తాజాగా ఎన్నికల్లో మాత్రం ఒక్క పార్టీకే భారీ మెజార్టీ ఇచ్చారు ప్రజలు. గత 50 ఏళ్లలో తొలిసారి ఇలా జరగడం విశేషం.

లేబర్​ పార్టీ మొత్తం 120 సీట్లలో 64 స్థానాలు కైవసం చేసుకుంది. 1996 నుంచి అనుపాత ఓటింగ్​ పెట్టాక ఏ పార్టీకి అయినా ఇదే అతిపెద్ద విజయం. 2017, సెప్టెంబర్​ 23న ఏర్పాటైన కివీస్​ పార్లమెంటు పదవీకాలం.. ఈ ఏడాది సెప్టెంబర్​ 6తో ముగిసింది. పూర్తి ఫలితాలు, విజేతను అక్టోబర్​ 30న అధికారికంగా ప్రకటిస్తారు.

న్యూజిలాండ్​ ప్రధానిగా జెసిండా ఆర్డెర్న్​కు మళ్లీ పట్టం కట్టారు ఆ దేశ ప్రజలు. సాధారణ ఎన్నికల్లో ఆమెకు తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు. కరోనా నియంత్రణ, సామాజిక అసమానతల కట్టడిలో జెసిండా అద్భుతమైన పనితీరు వల్లే భారీ ఆధిక్యం సాధించారు. తాజా ఫలితాలతో మరో మూడేళ్లు జెసిండా ఆర్డెర్న్​ ప్రధానిగా పనిచేయనున్నారు.

ఈ ఎన్నికల్లో 49 శాతం ఓట్లు జెసిండా పార్టీకే వచ్చాయి. 1930 నుంచి ఇదే భారీ మెజార్టీ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షం కన్సర్వేటివ్​ నేషనల్​ పార్టీ 27 శాతం ఓట్లకే పరిమితమైంది. ఈ పార్టీ 2002 కంటే ఘోరమైన ఫలితాలను మూటగట్టుకుంది.

తొలిసారి..

కివీస్​లో చాలా ఏళ్లుగా కూటములే ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. 40 ఏళ్ల జెసిండా మొదటిసారి ఇదే తరహాలో అధికారం చేపట్టారు. అయితే ఈసారి సీన్​ రివర్సయింది. తాజాగా ఎన్నికల్లో మాత్రం ఒక్క పార్టీకే భారీ మెజార్టీ ఇచ్చారు ప్రజలు. గత 50 ఏళ్లలో తొలిసారి ఇలా జరగడం విశేషం.

లేబర్​ పార్టీ మొత్తం 120 సీట్లలో 64 స్థానాలు కైవసం చేసుకుంది. 1996 నుంచి అనుపాత ఓటింగ్​ పెట్టాక ఏ పార్టీకి అయినా ఇదే అతిపెద్ద విజయం. 2017, సెప్టెంబర్​ 23న ఏర్పాటైన కివీస్​ పార్లమెంటు పదవీకాలం.. ఈ ఏడాది సెప్టెంబర్​ 6తో ముగిసింది. పూర్తి ఫలితాలు, విజేతను అక్టోబర్​ 30న అధికారికంగా ప్రకటిస్తారు.

Last Updated : Oct 17, 2020, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.