ETV Bharat / international

ఆసియాన్​ సదస్సులో మోదీ కీలక ప్రసంగం

author img

By

Published : Oct 27, 2021, 10:54 PM IST

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఆసియాన్ కూటమికి మద్దతు కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పునరుద్ఘాటించారు. బ్రూనై వేదికగా జరుగుతున్న 16వ తూర్పు ఆసియా సదస్సులో వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించిన మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

PM Modi
మోదీ

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో బహిరంగ స్వేచ్ఛ, సమ్మిళిత వృద్ధిని కొనసాగించడమే భారత్​ కర్తవ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. బ్రూనైలో నిర్వహించిన 16వ తూర్పు ఆసియా(Asean Countries) కూటమి శిఖరాగ్ర సమావేశంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వివిధ దేశాలతో అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా బహుపాక్షిక సంబంధాలను(Asean India Summit) కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దేశాల సార్వభౌమాధికారంతో పాటు.. ప్రాదేశిక సమగ్రతను బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇక.. గురువారం ప్రారంభంకానున్న 18వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారు.

ఆగ్నేయాసియాకు చెందిన ఇండోనేసియా, పిలిప్పిన్స్​, సింగపూర్​, థాయి​లాండ్​, బ్రూనై, వియత్నాం, లావోస్​, మయన్మార్​, కంబోడియా(10 దేశాలు) ఉన్న ఈ కూటమిలో(Asean Countries).. భారత్​, చైనా, అమెరికా, జపాన్​, ఆస్ట్రేలియా దేశాలు భాగస్వామ్య​ దేశాలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సదస్సులో భారత్, చైనా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్, రష్యాలు సభ్య దేశాలతో పాటు పాల్గొంటున్నాయి.

ఆసియాన్ దేశాలు-భారత్(Asean Countries India) మధ్య సంబంధాలు గత కొన్నేళ్లుగా మంచి ఫలితాలనిస్తున్నాయి. ప్రధానంగా.. పెట్టుబడులు, వాణిజ్యం, భద్రత, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించే అంశాలపై భారత్ గతకొన్నాళ్లుగా దృష్టి సారిస్తోంది.

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, రక్షణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఆసియాన్ ముఖ్య వేదికగా మారింది. 2005లో ప్రారంభమైనప్పటి(Asean Established) నుంచి తూర్పు ఆసియా దేశాలు వ్యూహాత్మక, భౌగోళిక రాజకీయ, ఆర్థిక అంశాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో బహిరంగ స్వేచ్ఛ, సమ్మిళిత వృద్ధిని కొనసాగించడమే భారత్​ కర్తవ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. బ్రూనైలో నిర్వహించిన 16వ తూర్పు ఆసియా(Asean Countries) కూటమి శిఖరాగ్ర సమావేశంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వివిధ దేశాలతో అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా బహుపాక్షిక సంబంధాలను(Asean India Summit) కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దేశాల సార్వభౌమాధికారంతో పాటు.. ప్రాదేశిక సమగ్రతను బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇక.. గురువారం ప్రారంభంకానున్న 18వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారు.

ఆగ్నేయాసియాకు చెందిన ఇండోనేసియా, పిలిప్పిన్స్​, సింగపూర్​, థాయి​లాండ్​, బ్రూనై, వియత్నాం, లావోస్​, మయన్మార్​, కంబోడియా(10 దేశాలు) ఉన్న ఈ కూటమిలో(Asean Countries).. భారత్​, చైనా, అమెరికా, జపాన్​, ఆస్ట్రేలియా దేశాలు భాగస్వామ్య​ దేశాలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సదస్సులో భారత్, చైనా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్, రష్యాలు సభ్య దేశాలతో పాటు పాల్గొంటున్నాయి.

ఆసియాన్ దేశాలు-భారత్(Asean Countries India) మధ్య సంబంధాలు గత కొన్నేళ్లుగా మంచి ఫలితాలనిస్తున్నాయి. ప్రధానంగా.. పెట్టుబడులు, వాణిజ్యం, భద్రత, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించే అంశాలపై భారత్ గతకొన్నాళ్లుగా దృష్టి సారిస్తోంది.

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, రక్షణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఆసియాన్ ముఖ్య వేదికగా మారింది. 2005లో ప్రారంభమైనప్పటి(Asean Established) నుంచి తూర్పు ఆసియా దేశాలు వ్యూహాత్మక, భౌగోళిక రాజకీయ, ఆర్థిక అంశాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.