ETV Bharat / international

ప్రయాణాలపై ఆంక్షల ఎత్తివేతకు ఇమ్రాన్​ ​విజ్ఞప్తి

పాకిస్థాన్​పై ప్రయాణాల ఆంక్షల ఎత్తివేసే దిశగా డబ్ల్యూహెచ్​ఓ కృషి చేయాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ అభ్యర్థించారు. ప్రయాణాలపై ఆంక్షలతో ఇప్పటికే కుదేలైన ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

author img

By

Published : Jul 7, 2020, 6:22 AM IST

PM Imran Khan
ఇమ్రాన్​ ఖాన్

కరోనా నేపథ్యంలో పాకిస్థాన్​పై ప్రయాణ పరిమితులను తొలగించేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) కృషి చేయాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ కోరారు. డబ్ల్యూహెచ్​ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్​తో వీడియో కాల్​లో మాట్లాడిన ఇమ్రాన్​.. ఈ మేరకు అభ్యర్థించారు.

"కరోనా నేపథ్యంలో పాకిస్థాన్​పై ప్రయాణ నిషేధాన్ని విధించాయి. ఇప్పటికే కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థ ఈ నిర్ణయంతో మరింత దిగజారే అవకాశం ఉంది. ఈ విషయంలో డబ్ల్యూహెచ్​ఓ జోక్యం చేసుకుని ప్రయాణ ఆంక్షలను ఎత్తివేసేలా చర్యలు చేపట్టాలి. ప్రయాణాలకు సంబంధించి వివక్ష లేని నిబంధనలను రూపొందించాలి."

- ఇమ్రాన్​ ఖాన్​, పాక్ ప్రధాని

అంతర్జాతీయంగా కరోనా వైరస్ సంబంధిత ప్రయాణ నిషేధాలపై మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నట్లు అధనోమ్​ ఓ ప్రకటనలో వెల్లడించారు. కరోనా వైరస్​పై పోరులో పాక్ ప్రభుత్వ కృషిని ప్రశంసించారు.

పాకిస్థాన్​లో కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తోంది. ఆ దేశంలో ఇప్పటివరకు 2.31 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 4,762 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా పాక్ ఆరోగ్య మంత్రి డాక్టర్ జఫర్ మీర్జాకు కరోనా పాజిటివ్​గా తేలింది.

ఇదీ చూడండి: పాకిస్థాన్​ ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా

కరోనా నేపథ్యంలో పాకిస్థాన్​పై ప్రయాణ పరిమితులను తొలగించేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) కృషి చేయాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్ కోరారు. డబ్ల్యూహెచ్​ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్​తో వీడియో కాల్​లో మాట్లాడిన ఇమ్రాన్​.. ఈ మేరకు అభ్యర్థించారు.

"కరోనా నేపథ్యంలో పాకిస్థాన్​పై ప్రయాణ నిషేధాన్ని విధించాయి. ఇప్పటికే కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థ ఈ నిర్ణయంతో మరింత దిగజారే అవకాశం ఉంది. ఈ విషయంలో డబ్ల్యూహెచ్​ఓ జోక్యం చేసుకుని ప్రయాణ ఆంక్షలను ఎత్తివేసేలా చర్యలు చేపట్టాలి. ప్రయాణాలకు సంబంధించి వివక్ష లేని నిబంధనలను రూపొందించాలి."

- ఇమ్రాన్​ ఖాన్​, పాక్ ప్రధాని

అంతర్జాతీయంగా కరోనా వైరస్ సంబంధిత ప్రయాణ నిషేధాలపై మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నట్లు అధనోమ్​ ఓ ప్రకటనలో వెల్లడించారు. కరోనా వైరస్​పై పోరులో పాక్ ప్రభుత్వ కృషిని ప్రశంసించారు.

పాకిస్థాన్​లో కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తోంది. ఆ దేశంలో ఇప్పటివరకు 2.31 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 4,762 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా పాక్ ఆరోగ్య మంత్రి డాక్టర్ జఫర్ మీర్జాకు కరోనా పాజిటివ్​గా తేలింది.

ఇదీ చూడండి: పాకిస్థాన్​ ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.