ETV Bharat / international

'కరోనాపై పోరుకు ఐకమత్యమే మహా బలం'

ప్రపంచదేశాలను భయపెడుతున్న కొవిడ్​ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజలంతా సమన్వయంతో కలిసి ముందుకురావాలని పిలుపునిచ్చారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ... ప్రభుత్వాలకు సవాలేనని అన్నారు.

author img

By

Published : May 3, 2020, 3:26 PM IST

People should unite to give coordinated response to COVID-19
'కరోనాపై పోరుకు ఐకమత్యమే మహా బలం'

కరోనా వ్యాప్తి మితీమీరుతున్న తరుణంలో.. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, బౌద్ధమత గురువు దలైలామా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని, సమన్వయంతో కలిసి ముందుకొస్తేనే మహమ్మారిని ఎదుర్కోగలమని వ్యాఖ్యానించారు.

వైరస్​ విసురుతున్న సవాళ్లతో కుదేలైన ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించడమే.. ప్రస్తుతం ప్రభుత్వాల ముందున్న అతిపెద్ద సవాలు అని హెచ్చరించారు. ఈ సంక్షోభం, పర్యవసానాలను.. కేవలం సమన్వయంతోనే ఎదుర్కొనగలమని ఆయన అన్నారు.

సమస్త మానవాళిని ఏకం చేసే అంశాలపై దృష్టి సారించాలని సూచించారు దలైలామా. అందరికీ ఒకే రకమైన భయాలు, ఆందోళనలు ఉన్నప్పటికీ.. సంతోషంగా ఉండాలనే కోరిక ద్వారా ఏకమవుతాయని ఆయన అన్నారు. పరిస్థితులను వాస్తవిక దృష్టితో చూస్తే కష్టాలను సైతం అవకాశాలుగా మార్చుకోవచ్చని దలైలామా తెలిపారు.

కరోనా వ్యాప్తి మితీమీరుతున్న తరుణంలో.. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, బౌద్ధమత గురువు దలైలామా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని, సమన్వయంతో కలిసి ముందుకొస్తేనే మహమ్మారిని ఎదుర్కోగలమని వ్యాఖ్యానించారు.

వైరస్​ విసురుతున్న సవాళ్లతో కుదేలైన ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించడమే.. ప్రస్తుతం ప్రభుత్వాల ముందున్న అతిపెద్ద సవాలు అని హెచ్చరించారు. ఈ సంక్షోభం, పర్యవసానాలను.. కేవలం సమన్వయంతోనే ఎదుర్కొనగలమని ఆయన అన్నారు.

సమస్త మానవాళిని ఏకం చేసే అంశాలపై దృష్టి సారించాలని సూచించారు దలైలామా. అందరికీ ఒకే రకమైన భయాలు, ఆందోళనలు ఉన్నప్పటికీ.. సంతోషంగా ఉండాలనే కోరిక ద్వారా ఏకమవుతాయని ఆయన అన్నారు. పరిస్థితులను వాస్తవిక దృష్టితో చూస్తే కష్టాలను సైతం అవకాశాలుగా మార్చుకోవచ్చని దలైలామా తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.