బాలీవుడ్ దిగ్గజ నటులు దిలీప్ కుమార్, రాజ్కపూర్లకు సంబంధించిన భవంతుల్ని(హవేలీ) కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా(కేపీ) ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవసరమైన రూ. 2.35 కోట్ల నిధులను విడుదల చేయడానికి కేపీ ముఖ్యమంత్రి మెహమూద్ ఖాన్ అంగీకరించారు.
కమ్యూనికేషన్ అండ్ వర్క్స్ శాఖ మార్గదర్శకాలను అనుసరించి.. దిలీప్ కుమార్ నివసించిన 101 చదరపు మీటర్ల ఇంటికి రూ.80.56 లక్షలు; రాజ్కపూర్ నివసించిన 151.75 చదరపు మీటర్ల ఇంటికి రూ.1.50 కోట్లు గానూ పెషావర్ డిప్యూటీ కమిషనర్ ముహమ్మద్ అలీ అస్ఘర్ ధరలను నిర్ణయించారు. కొనుగోలు అనంతరం ఈ భవంతుల్ని మ్యూజియంలుగా మార్చేందుకు పురావస్తు శాఖ యోచిస్తోంది.
ఇదీ చదవండి: 'నేల కుంగిపోతోంది.. జాగ్రత్త'