ETV Bharat / international

భారత్​ ఆస్తులే లక్ష్యంగా.. పాక్​ మరో కుట్ర

author img

By

Published : Jul 19, 2021, 7:40 AM IST

అఫ్గానిస్థాన్​లో భారత్‌ ఆస్తులను.. ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్​ గూఢచర్య ఐఎస్ఐ మరో కుట్రకు తెరతీసింది. తాలిబన్లకు మద్దతుగా 10,000 మంది సాయుధులను అఫ్గాన్​లోకి పంపింది. తాలిబన్లు ఆక్రమించిన ప్రాంతాల్లో వీరు భారత్‌ ఆస్తులను ధ్వంసం చేయనున్నట్లు తెలుస్తోంది.

talibans in afghanistan
అఫ్గాన్​లో పాక్​ సాయుధులు

పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ మరో కుట్రకు తెర తీసింది. అఫ్గానిస్థాన్​లో భారత్‌ ఆస్తులను, ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుంది. ఇందుకోసం 10,000 మంది సాయుధులను అఫ్గాన్​కు పంపింది. "తాలిబన్లకు మద్దతుగా భారీ సంఖ్యలో పాక్‌ సాయుధులు అఫ్గాన్​లోకి ప్రవేశించారు. భారత ఆస్తులను, భవనాలను లక్ష్యంగా చేసుకోవాలని వీరికి సూచనలు ఇచ్చారు" అని అఫ్గాన్​లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న భారత్‌ వర్గాలు తెలిపాయి. కొన్ని నెలలుగా అఫ్గాన్‌లోని కీలక ప్రాంతాలను తాలిబన్లు ఆక్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల అధీనంలోకి వచ్చిన ప్రాంతాల్లోని భారత్‌ ఆస్తులను ధ్వంసం చేయాలని పాక్‌ భావిస్తోంది. అందుకే సాయుధ మూకలను పంపింది. తాలిబన్లు ఆక్రమించిన ప్రాంతాల్లో వీరు భారత్‌ ప్రాజెక్టులపై దాడి చేస్తారు. 2001 నుంచి అఫ్గాన్​ పునర్నిర్మాణంలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు 800 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఆ దేశ పార్లమెంటును నిర్మించింది. ప్రతి ప్రావిన్స్‌లో పాఠశాలలు, రహదారుల నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది.

రెండో రోజూ కొనసాగిన అఫ్గాన్​-తాలిబన్‌ చర్చలు

అఫ్గాన్​ ప్రభుత్వ ప్రతినిధులు, తాలిబన్ల మధ్య కతార్‌ రాజధాని దోహాలో శనివారం ప్రారంభమైన చర్చలు ఆదివారం కూడా కొనసాగాయి. అయితే తాలిబన్లు ఓ వైపు ప్రభుత్వ దళాలపై దాడులు చేస్తూ, కీలక ప్రాంతాలను ఆక్రమిస్తున్న నేపథ్యంలో చర్చల పురోగతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్‌ నాయకుడు హైబతుల్లా అఖుంద్‌జాదా కీలక వ్యాఖ్యలు చేశారు. సైనిక పరంగా తాము ముందంజలో ఉన్నా.. తమకు రాజకీయ పరిష్కారమే కావాలని తెలిపారు. ఈ చర్చల్లో కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అఫ్గానిస్థాన్‌లో ఇస్లామిక్‌ వ్యవస్థను స్థాపించడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటామని తెలిపారు.

ఇవీ చూడండి:

పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ మరో కుట్రకు తెర తీసింది. అఫ్గానిస్థాన్​లో భారత్‌ ఆస్తులను, ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుంది. ఇందుకోసం 10,000 మంది సాయుధులను అఫ్గాన్​కు పంపింది. "తాలిబన్లకు మద్దతుగా భారీ సంఖ్యలో పాక్‌ సాయుధులు అఫ్గాన్​లోకి ప్రవేశించారు. భారత ఆస్తులను, భవనాలను లక్ష్యంగా చేసుకోవాలని వీరికి సూచనలు ఇచ్చారు" అని అఫ్గాన్​లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న భారత్‌ వర్గాలు తెలిపాయి. కొన్ని నెలలుగా అఫ్గాన్‌లోని కీలక ప్రాంతాలను తాలిబన్లు ఆక్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల అధీనంలోకి వచ్చిన ప్రాంతాల్లోని భారత్‌ ఆస్తులను ధ్వంసం చేయాలని పాక్‌ భావిస్తోంది. అందుకే సాయుధ మూకలను పంపింది. తాలిబన్లు ఆక్రమించిన ప్రాంతాల్లో వీరు భారత్‌ ప్రాజెక్టులపై దాడి చేస్తారు. 2001 నుంచి అఫ్గాన్​ పునర్నిర్మాణంలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు 800 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఆ దేశ పార్లమెంటును నిర్మించింది. ప్రతి ప్రావిన్స్‌లో పాఠశాలలు, రహదారుల నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది.

రెండో రోజూ కొనసాగిన అఫ్గాన్​-తాలిబన్‌ చర్చలు

అఫ్గాన్​ ప్రభుత్వ ప్రతినిధులు, తాలిబన్ల మధ్య కతార్‌ రాజధాని దోహాలో శనివారం ప్రారంభమైన చర్చలు ఆదివారం కూడా కొనసాగాయి. అయితే తాలిబన్లు ఓ వైపు ప్రభుత్వ దళాలపై దాడులు చేస్తూ, కీలక ప్రాంతాలను ఆక్రమిస్తున్న నేపథ్యంలో చర్చల పురోగతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్‌ నాయకుడు హైబతుల్లా అఖుంద్‌జాదా కీలక వ్యాఖ్యలు చేశారు. సైనిక పరంగా తాము ముందంజలో ఉన్నా.. తమకు రాజకీయ పరిష్కారమే కావాలని తెలిపారు. ఈ చర్చల్లో కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అఫ్గానిస్థాన్‌లో ఇస్లామిక్‌ వ్యవస్థను స్థాపించడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటామని తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.