ETV Bharat / international

పీఓకే ప్రజల హక్కులు కాపాడతాం: ఇమ్రాన్​

కశ్మీర్​ స్వయం ప్రతిపత్తిని కాపాడితే భారత్​తో చర్చలకు సిద్ధమని పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ అన్నారు. పాక్​ ఆక్రమిత కశ్మీర్​ (పీఓకే) ప్రజల హక్కులను పాకిస్థాన్ కాపాడుతుందని స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా పీఓకే ప్రజలు స్వతంత్ర్యంగా ఉండడానికైనా లేదా తమ దేశంలో కలవడానికైనా అంగీకరిస్తామని పేర్కొన్నారు.

author img

By

Published : Feb 6, 2021, 5:31 PM IST

Pakistani PM urges Kashmir referendum, talks with India
'పీఓకే ప్రజల హక్కులు కాపాడతాం'

పాక్​ ఆక్రమిత కశ్మీర్​ ప్రజల హక్కులను పాకిస్థాన్​ కాపాడుతుందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ చెప్పారు. ప్రజాభిప్రాయసేకరణ ద్వారా పాక్​ ఆక్రమిత కాశ్మీర్​ ప్రజలు స్వతంత్ర్యంగా ఉండడానికైనా లేదా తమ దేశంలో కలవడానికైనా పాకిస్థాన్​ అనుమతిస్తుందని పేర్కొన్నారు. పాక్​ ఆక్రమిత కశ్మీర్​ సంఘీభావ దినోత్సవ సందర్భంగా కోట్లీ పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో ఈ మేరకు స్పష్టం చేశారు.

మోదీతో చర్చలకు సిద్ధం...

2019లో కశ్మీర్​ స్వయం ప్రతిపత్తిని మార్చేవిధంగా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకుంటే ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలకు సిద్ధమని ఖాన్​ స్పష్టం చేశారు. 2019లో కశ్మీర్​ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా భారత ప్రభుత్వం విభజించింది. అప్పటినుంచి భారత్​, పాకిస్థాన్​ మధ్య వివాదం తీవ్రతరమైంది. భారత్​తో చర్చలు జరపబోమని పాక్​ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:'భారత్​-చైనా చర్చల్లో ఆశించిన పురోగతి లేదు'

పాక్​ ఆక్రమిత కశ్మీర్​ ప్రజల హక్కులను పాకిస్థాన్​ కాపాడుతుందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ చెప్పారు. ప్రజాభిప్రాయసేకరణ ద్వారా పాక్​ ఆక్రమిత కాశ్మీర్​ ప్రజలు స్వతంత్ర్యంగా ఉండడానికైనా లేదా తమ దేశంలో కలవడానికైనా పాకిస్థాన్​ అనుమతిస్తుందని పేర్కొన్నారు. పాక్​ ఆక్రమిత కశ్మీర్​ సంఘీభావ దినోత్సవ సందర్భంగా కోట్లీ పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో ఈ మేరకు స్పష్టం చేశారు.

మోదీతో చర్చలకు సిద్ధం...

2019లో కశ్మీర్​ స్వయం ప్రతిపత్తిని మార్చేవిధంగా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకుంటే ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలకు సిద్ధమని ఖాన్​ స్పష్టం చేశారు. 2019లో కశ్మీర్​ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా భారత ప్రభుత్వం విభజించింది. అప్పటినుంచి భారత్​, పాకిస్థాన్​ మధ్య వివాదం తీవ్రతరమైంది. భారత్​తో చర్చలు జరపబోమని పాక్​ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:'భారత్​-చైనా చర్చల్లో ఆశించిన పురోగతి లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.