ETV Bharat / international

5 నెలల తర్వాత పాక్​లో మోగిన బడి గంటలు

కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన పాఠశాలలు, కళాశాలలు, వ్యాపారాలు నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి. పాకిస్థాన్​లో 5 నెలల తర్వాత బడులు, విశ్వవిద్యాలయాలు నేడు తెరుచుకున్నాయి. భౌతిక దూరం సహా కఠిన నిబంధనల నడుమ విద్యాలయాలను తెరిచింది ప్రభుత్వం. అయితే పాఠశాలల పునఃప్రారంభంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

author img

By

Published : Sep 15, 2020, 7:49 PM IST

Pakistan reopens schools
5 నెలల అనంతరం పాక్​లో మోగిన బడి గంటలు

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో పాకిస్థాన్​ సర్కార్ మంగళవారం​ విద్యాలయాలను పునః ప్రారంభించింది. తొలి దఫాలో భాగంగా ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను తిరిగి తెరిచింది.

ఆరవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు సెప్టెంబర్​ 23 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ప్రాథమిక పాఠశాలలు సెప్టెంబర్​ 30 నుంచి మొదలుకానున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా దాదాపు 5 నెలల తర్వాత పాఠశాలలు తెరుచుకున్నాయి.

నిబంధనలు...

  • ఆరోగ్యశాఖ నిబంధనల ప్రకారం తరగతి గదిలో కేవలం 20 మంది విద్యార్థులనే అనుమతిస్తున్నారు.
  • విద్యార్థులను రెండు బృందాలుగా విభజించి ప్రత్యామ్నాయ రోజుల్లో పాఠశాలకు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
  • విద్యార్థులు, ఉపాధ్యాయులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.
  • ప్రవేశ ద్వారాల్లో తప్పనిసరిగా శానిటైజర్లు, హ్యాండ్​ వాషింగ్​ సదుపాయాలు ఉండాలి.

కేసులు...

పాక్​లో కొత్తగా 404 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 3,02,424కు పెరిగింది. మృతుల సంఖ్య 6,389కి చేరింది.

వివిధ దేశాల్లో కేసుల వివరాలు....

దేశంకేసులుమరణాలు
అమెరికా6,751,113199,148
బ్రెజిల్​4,349,544132,117
రష్యా1,073,84918,785
పెరూ733,86030,812
కొలంబియా721,89223,123

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో పాకిస్థాన్​ సర్కార్ మంగళవారం​ విద్యాలయాలను పునః ప్రారంభించింది. తొలి దఫాలో భాగంగా ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను తిరిగి తెరిచింది.

ఆరవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు సెప్టెంబర్​ 23 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ప్రాథమిక పాఠశాలలు సెప్టెంబర్​ 30 నుంచి మొదలుకానున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా దాదాపు 5 నెలల తర్వాత పాఠశాలలు తెరుచుకున్నాయి.

నిబంధనలు...

  • ఆరోగ్యశాఖ నిబంధనల ప్రకారం తరగతి గదిలో కేవలం 20 మంది విద్యార్థులనే అనుమతిస్తున్నారు.
  • విద్యార్థులను రెండు బృందాలుగా విభజించి ప్రత్యామ్నాయ రోజుల్లో పాఠశాలకు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
  • విద్యార్థులు, ఉపాధ్యాయులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.
  • ప్రవేశ ద్వారాల్లో తప్పనిసరిగా శానిటైజర్లు, హ్యాండ్​ వాషింగ్​ సదుపాయాలు ఉండాలి.

కేసులు...

పాక్​లో కొత్తగా 404 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 3,02,424కు పెరిగింది. మృతుల సంఖ్య 6,389కి చేరింది.

వివిధ దేశాల్లో కేసుల వివరాలు....

దేశంకేసులుమరణాలు
అమెరికా6,751,113199,148
బ్రెజిల్​4,349,544132,117
రష్యా1,073,84918,785
పెరూ733,86030,812
కొలంబియా721,89223,123
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.