జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై 'నిరసన కవాతు' పేరిట సరికొత్త నాటకానికి తెరలేపింది పాకిస్థాన్. పాక్ ఆక్రమిత కశ్మీర్కు చెందిన అనేక మంది... నియంత్రణ రేఖ దిశగా ర్యాలీగా వస్తున్నారు.
జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్) ఆధ్వర్యంలో ఈ ర్యాలీ సాగుతోంది. పీఓకే రాజధాని ముజఫరాబాద్లో బయలుదేరిన నిరసనకారులు శనివారం గఢీ దుపట్టాకు చేరుకుని రాత్రి అక్కడే బసచేశారు. ప్రస్తుతం ముజఫరాబాద్-శ్రీనగర్ రహదారిపై ర్యాలీ కొనసాగిస్తున్నారు.
గీత దాటతారా...?
నియంత్రణ రేఖ దాటవద్దని నిరసనకారులను శనివారం హెచ్చరించారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. కశ్మీరీలకు సాయం అందించాలనో, లేక మద్దతు తెలపాలనో గీత దాటితే... భారత్ దీనిని సాకుగా చూపి, ఎదురుదాడి చేసే ప్రమాదముందని చెప్పారు.
నిరసనకారులు మాత్రం తాము నియంత్రణ రేఖ దాటి తీరతామని ప్రకటించారు. అయితే... వారు ఛకోతీకి చేరుకోగానే పాక్ అధికార యంత్రాంగం అడ్డుకునే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చూడండి:ఆ కుటుంబంలో ఎవరూ మిగలలేదు, ఏం జరిగింది..?