ETV Bharat / international

పాక్​ 'కుట్రల కవాతు'.. నియంత్రణ రేఖ దాటి వస్తారా?

author img

By

Published : Oct 6, 2019, 3:36 PM IST

ఆర్టికల్​ 370 రద్దును జీర్ణించుకోలేకపోతున్న పాకిస్థాన్​... కశ్మీర్​లో అలజడి సృష్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా నిరసన ర్యాలీ పేరిట సరికొత్త కుట్ర పన్నింది. పాక్ ఆక్రమిత కశ్మీర్​ నుంచి పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు నియంత్రణ రేఖ దిశగా వస్తున్నారు.

పాక్​ 'కుట్రల కవాతు'.. నియంత్రణ రేఖ దాటి వస్తారా?

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్​ 370 రద్దుపై 'నిరసన కవాతు' పేరిట సరికొత్త నాటకానికి తెరలేపింది పాకిస్థాన్​. పాక్ ఆక్రమిత కశ్మీర్​కు చెందిన అనేక మంది... నియంత్రణ రేఖ దిశగా ర్యాలీగా వస్తున్నారు.

జమ్ముకశ్మీర్​ లిబరేషన్​ ఫ్రంట్​(జేకేఎల్​ఎఫ్​) ఆధ్వర్యంలో ఈ ర్యాలీ సాగుతోంది. పీఓకే రాజధాని ముజఫరాబాద్​లో బయలుదేరిన నిరసనకారులు శనివారం గఢీ దుపట్టాకు చేరుకుని రాత్రి అక్కడే బసచేశారు. ప్రస్తుతం ముజఫరాబాద్​-శ్రీనగర్ రహదారిపై ర్యాలీ కొనసాగిస్తున్నారు.

గీత దాటతారా...?

నియంత్రణ రేఖ దాటవద్దని నిరసనకారులను శనివారం హెచ్చరించారు పాక్ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​. కశ్మీరీలకు సాయం అందించాలనో, లేక మద్దతు తెలపాలనో గీత దాటితే... భారత్​ దీనిని సాకుగా చూపి, ఎదురుదాడి చేసే ప్రమాదముందని చెప్పారు.

నిరసనకారులు మాత్రం తాము నియంత్రణ రేఖ దాటి తీరతామని ప్రకటించారు. అయితే... వారు ఛకోతీకి చేరుకోగానే పాక్ అధికార యంత్రాంగం అడ్డుకునే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చూడండి:ఆ కుటుంబంలో ఎవరూ మిగలలేదు, ఏం జరిగింది..?

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్​ 370 రద్దుపై 'నిరసన కవాతు' పేరిట సరికొత్త నాటకానికి తెరలేపింది పాకిస్థాన్​. పాక్ ఆక్రమిత కశ్మీర్​కు చెందిన అనేక మంది... నియంత్రణ రేఖ దిశగా ర్యాలీగా వస్తున్నారు.

జమ్ముకశ్మీర్​ లిబరేషన్​ ఫ్రంట్​(జేకేఎల్​ఎఫ్​) ఆధ్వర్యంలో ఈ ర్యాలీ సాగుతోంది. పీఓకే రాజధాని ముజఫరాబాద్​లో బయలుదేరిన నిరసనకారులు శనివారం గఢీ దుపట్టాకు చేరుకుని రాత్రి అక్కడే బసచేశారు. ప్రస్తుతం ముజఫరాబాద్​-శ్రీనగర్ రహదారిపై ర్యాలీ కొనసాగిస్తున్నారు.

గీత దాటతారా...?

నియంత్రణ రేఖ దాటవద్దని నిరసనకారులను శనివారం హెచ్చరించారు పాక్ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​. కశ్మీరీలకు సాయం అందించాలనో, లేక మద్దతు తెలపాలనో గీత దాటితే... భారత్​ దీనిని సాకుగా చూపి, ఎదురుదాడి చేసే ప్రమాదముందని చెప్పారు.

నిరసనకారులు మాత్రం తాము నియంత్రణ రేఖ దాటి తీరతామని ప్రకటించారు. అయితే... వారు ఛకోతీకి చేరుకోగానే పాక్ అధికార యంత్రాంగం అడ్డుకునే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చూడండి:ఆ కుటుంబంలో ఎవరూ మిగలలేదు, ఏం జరిగింది..?

Mumbai, Oct 06 (ANI): Actress Tara Sutaria has been one of the most talked about new entrants in B-town. She walked the ramp in a glamorous avatar and turned showstopper at an event in Mumbai on October 05. Tara Sutaria was looking ethereal in white and gold gown. She made her Bollywood debut with 'Student Of The Year 2' co-starring Ananya Panday and Tiger Shroff in lead roles. Fashion Photographer Dabboo Ratnani came with his wife. Tara is gearing up for her next film with Sidharth Malhotra, 'Marjaavaan'.


For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.