ETV Bharat / international

భారత్​లో 50 లక్షల మంది నిరాశ్రయులా?

author img

By

Published : May 5, 2020, 12:42 PM IST

ప్రకృతి విపత్తులు, అల్లర్లు, సంఘర్షణల కారణంగా.. భారత్​లో గతేడాది 50 లక్షల మందికిపైగా స్వస్థలాలు విడిచివెళ్లారని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో భారత దేశమే మొదటిస్థానంలో ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 2019లో మొత్తం 3 కోట్ల 3 లక్షల మందికిపైగా నిర్వాసితులుగా మిగిలిపోయారని పేర్కొంది.

Over 5 million people internally displaced in India in 2019: UN
భారత్​లో 50 లక్షల మంది నిరాశ్రయులా..?

ప్రపంచవ్యాప్తంగా 2019లో 3.3కోట్ల మందికిపైగా నిర్వాసితులయ్యారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఎక్కువగా తూర్పు, దక్షిణాసియా, పసిఫిక్​ దేశాల్లోనే బాధితులు తమ స్వస్థలాలను వీడి శరణార్థులుగా మిగిలారని తెలిపింది. మొత్తం 2 కోట్ల 50 లక్షల మందికిపైగా ప్రకృతి విపత్తుల కారణంగా, మరో 85 లక్షల మంది.. సంఘర్షణలు, ఇతర అల్లర్లు, హింస కారణంగా అంతర్గతంగా వేరే ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చిందని యూనిసెఫ్​ తన 'లాస్ట్​ ఎట్​ హోమ్'​ నివేదికలో స్పష్టం చేసింది.

భారత్​లో ఈ సంఖ్య 50 లక్షల కంటే ఎక్కువేనని.. ప్రపంచ దేశాల్లో ఇదే అత్యధికమని తెలిపింది యూనిసెఫ్​. దాదాపు 50 లక్షల 18 వేల మంది విపత్తులతో, 19 వేల మంది ఇతర ఘర్షణలు, హింస కారణంగా ఆస్తులు, ఇళ్లు పోగొట్టుకున్నట్లు తన నివేదికలో వెల్లడించింది.

ఫిలిప్పీన్స్​, బంగ్లాదేశ్​, చైనా వరుసగా భారత్​ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

పిల్లలే అధికం...

ప్రపంచవ్యాప్తంగా స్థానభ్రంశం చెందినవారిలో కోటీ 20 లక్షల మంది పిల్లలే ఉన్నారని.. హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలోనే నిర్వాసితులుగా మారారని వెల్లడించింది. 2019లో దాదాపు 19 మిలియన్ల మంది చిన్నారులు.. హింస కారణంగా అంతర్గతంగా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందని వివరించింది ఐక్యరాజ్యసమితి విభాగం. చరిత్రలో ఇదే అత్యధికమని తెలిపింది.

ప్రస్తుతం ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతోన్న కరోనా మహమ్మారి జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని.. ఇది మరింత సందిగ్ధ పరిస్థితులకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు యూనిసెఫ్​ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్ హెన్రీట్టా ఫోరే. ​

ప్రపంచవ్యాప్తంగా 2019లో 3.3కోట్ల మందికిపైగా నిర్వాసితులయ్యారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఎక్కువగా తూర్పు, దక్షిణాసియా, పసిఫిక్​ దేశాల్లోనే బాధితులు తమ స్వస్థలాలను వీడి శరణార్థులుగా మిగిలారని తెలిపింది. మొత్తం 2 కోట్ల 50 లక్షల మందికిపైగా ప్రకృతి విపత్తుల కారణంగా, మరో 85 లక్షల మంది.. సంఘర్షణలు, ఇతర అల్లర్లు, హింస కారణంగా అంతర్గతంగా వేరే ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చిందని యూనిసెఫ్​ తన 'లాస్ట్​ ఎట్​ హోమ్'​ నివేదికలో స్పష్టం చేసింది.

భారత్​లో ఈ సంఖ్య 50 లక్షల కంటే ఎక్కువేనని.. ప్రపంచ దేశాల్లో ఇదే అత్యధికమని తెలిపింది యూనిసెఫ్​. దాదాపు 50 లక్షల 18 వేల మంది విపత్తులతో, 19 వేల మంది ఇతర ఘర్షణలు, హింస కారణంగా ఆస్తులు, ఇళ్లు పోగొట్టుకున్నట్లు తన నివేదికలో వెల్లడించింది.

ఫిలిప్పీన్స్​, బంగ్లాదేశ్​, చైనా వరుసగా భారత్​ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

పిల్లలే అధికం...

ప్రపంచవ్యాప్తంగా స్థానభ్రంశం చెందినవారిలో కోటీ 20 లక్షల మంది పిల్లలే ఉన్నారని.. హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలోనే నిర్వాసితులుగా మారారని వెల్లడించింది. 2019లో దాదాపు 19 మిలియన్ల మంది చిన్నారులు.. హింస కారణంగా అంతర్గతంగా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందని వివరించింది ఐక్యరాజ్యసమితి విభాగం. చరిత్రలో ఇదే అత్యధికమని తెలిపింది.

ప్రస్తుతం ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతోన్న కరోనా మహమ్మారి జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని.. ఇది మరింత సందిగ్ధ పరిస్థితులకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు యూనిసెఫ్​ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్ హెన్రీట్టా ఫోరే. ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.