ఉత్తర కొరియా ఇవాళ సముద్రం వైపు పలు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా భద్రతా దళాలు చెబుతున్నాయి. ముంచోన్ ప్రాంతం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణులు... 'స్వల్ప శ్రేణి క్రూయిజ్ మిస్సైల్స్' అయ్యుండొచ్చని జాయింట్స్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ అభిప్రాయపడింది.
తాత జయంతి సందర్భంగా...!
ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు, ప్రస్తుత దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాత అయిన కిమ్ ఇల్ సుంగ్ 108వ జయంతి బుధవారం. మరోవైపు ఉత్తర కొరియా.. దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటరీ ఎన్నికలు కూడా రేపే జరగనున్నాయి. వీటికి ఒక్క రోజు ముందు ఈ అణు సంపన్న దేశం క్షిపణి పరీక్షలు నిర్వహించడం గమనార్హం.
తరచుగా ప్రయోగాలు...
ప్రపంచమంతా కరోనాతో అతలాకుతలం అవుతుంటే.. ఉత్తర కొరియా మాత్రం ఇటీవలి కాలంలో తరచుగా బాలిస్టిక్ క్షిపణులను పరీక్షిస్తోంది. లక్ష్యాన్ని ఛేదించే ముందు తమ క్షిపణులను భూమ్యాకర్షణకు అందని రీతిలో గగనతలంలోకి ప్రయోగిస్తుంది. అగ్రరాజ్యం అమెరికాతో జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ ఉత్తర కొరియా దూకుడుగా వ్యవహరిస్తుండడం గమనార్హం.
కిమ్ రాజ్యాన్ని తాకని కరోనా...
ప్రపంచాన్నంతా తన కబంద హస్తాలతో నలిపేస్తున్న కరోనా మహమ్మారి... ఉత్తర కొరియా వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు ఆ దేశంలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదని తెలుస్తోంది.
ఇదీ చూడండి: కరోనా 'విభేదాల'పై ట్రంప్-ఫౌచి క్లారిటీ