ETV Bharat / international

ఇరాన్-చైనా వ్యాపారానికి నేపాల్ బ్యాంకుల మధ్యవర్తిత్వం - నేపాల్ సంస్థలు ఫిన్​సెన్ పత్రాలు

నేపాల్​లోని పలు బ్యాంకులు, ప్రైవేటు సంస్థలు అనుమానాస్పద నిధులను విదేశాలకు బదిలీ చేసినట్లు తేలింది. ఇరాన్​తో చైనా వాణిజ్యం విషయంలో అమెరికా ఆంక్షలను తప్పించుకునేందుకు ప్రయత్నించాయని వెల్లడైంది. స్వతంత్ర విలేకరుల దర్యాప్తు సంస్థలు నిర్వహించిన విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Nepali banks act as channels for Iran-China to deceive US sanctions'
నేపాల్ చైనా ఫిన్​సెన్ ఫైల్స్
author img

By

Published : Sep 21, 2020, 7:13 PM IST

విదేశాల నుంచి వచ్చిన అనుమానాస్పద సొమ్మును బదిలీ చేయడంలో నేపాల్​లోని కొన్ని బ్యాంకులు, సంస్థల పాత్ర ఉన్నట్లు వెల్లడైంది. సెంటర్ ఫర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం(సీఐజే), ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) సంయుక్తంగా నిర్వహించిన దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇరాన్, చైనా వాణిజ్యంపై అమెరికా ఆంక్షలను తప్పుదారి పట్టించేందుకు నేపాల్ బ్యాంకులు ప్రయత్నించినట్లు ఈ దర్యాప్తులో తేలింది.

ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించే ప్రభుత్వ సంస్థ 'ఫైనాన్సియల్ క్రైమ్స్ ఎన్​ఫోర్స్​మెంట్ నెట్​వర్క్' రూపొందించే రహస్య పత్రాల ఆధారంగా ఈ దర్యాప్తు నిర్వహించారు. ఈ దర్యాప్తు నివేదికకు 'ఫిన్​సెన్ ఫైల్స్​'గా నామకరణం చేశారు.

"బంగారం, పురాతన వస్తువులు, టెలికమ్యునికేషన్ పరికరాల అంతర్జాతీయ స్మగ్లింగ్​లతో నేపాల్​కు చెందిన కొన్ని వ్యాపారాలకు సంబంధం ఉంది. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ప్రైమ్ కమర్షియల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కాఠ్​మాండూ, నేపాల్ ఇన్వెస్ట్​మెంట్ బ్యాంక్, ఎవరెస్ట్ బ్యాంక్, మెగా బ్యాంక్, హిమాలయన్ బ్యాంక్, అపెక్స్ డెవలప్​మెంట్ బ్యాంక్ ఆఫ్ కస్కి, నేపాల్ బంగ్లాదేశ్ బ్యాంక్​లు అనుమానాస్పదంగా నగదు బదిలీలో పాల్గొన్న బ్యాంకుల జాబితాలో ఉన్నాయి."

-ఫిన్​సెన్ ఫైల్స్

అనుమానాస్పద నిధుల బదిలీలో పది నేపాలీ సంస్థలకు నేరుగా ప్రమేయం ఉందని ఫిన్​సెన్ ఫైల్స్​ పత్రాలు పేర్కొన్నాయి. ఈ కంపెనీలు, బ్యాంకుల ద్వారా 11 ఏళ్లలో 292.7 మిలియన్ డాలర్ల నిధుల బదిలీ జరిగిందని తెలిపాయి.

రవునియార్ బ్రదర్స్ అండ్ కంపెనీ, సుభా సమృద్ధి ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్, శాస్తా ట్రేడింగ్ కంపెనీ, సేతీదేవి ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్​డీ. ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఫెల్ట్ అండ్ యార్న్ ప్రైవేట్ లిమిటెడ్, ఉమెన్స్ పేపర్ క్రాఫ్ట్స్, ఆక్మే మనీ ట్రాన్స్​ఫర్ సర్వీస్, సన్నీ ఎంటర్​ప్రైజెస్​లపై అనుమానాస్పద లావాదేవీలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

"పెట్రోలియం తదితర ఉత్పత్తులను ఎగుమతి చేసే దుబాయ్​కి చెందిన 'కైట్ ఇంటర్నేషనల్ ఎఫ్​జడ్ఈ' సంస్థ ద్వారా రవునియార్ బ్రదర్స్, శుభ సమృద్ధి ట్రేడర్స్ కంపెనీలు అనుమానిత లావాదేవీలు నిర్వహించాయి. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతుల పేరిట నాలుగేళ్లలో(2010-2014 మధ్య) 71.4 మిలియన్ డాలర్లను వివిధ దేశాలకు పంపించాయి."

-ఫిన్​సెన్ ఫైల్స్

అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్ నుంచి రవునియర్ కంపెనీ పలు ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నట్లు ఫిన్​సెన్ పత్రాలు పేర్కొన్నాయి. ఈ ఉత్పత్తులను దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు, పత్రాలను ఫోర్జరీ చేశారని తెలిపాయి. దర్యాప్తు సమయంలో ఈ విషయంపై కైట్ సంస్థ స్పందన కోసం ప్రయత్నించినప్పటికీ.. వారి నుంచి ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదని వెల్లడించాయి.

కెన్యా, జాంబియా, మొజాంబిక్, నేపాల్, అమెరికాలో 'కైట్ ఇంటర్నేషనల్​'కు శాఖలున్నట్లు జర్నలిస్ట్​లు గుర్తించారని నివేదిక వెల్లడించింది. ఉన్నత విద్య కోసం నేపాల్​లో కొత్త ప్రాజెక్టును ప్రారంభించినట్లు వారు తెలుసుకున్నారని పేర్కొంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక రికార్డులు లేవని తెలిపింది.

'ఎప్పుడో మూతపడ్డాయి'

అయితే.. తన రెండు కంపెనీలు మూతపడినట్లు కైట్ సంస్థతో లావాదేవీలు కొనసాగించిన రవునియార్ కంపెనీ డైరెక్టర్ నారాయణ్​జీ రవునియార్ పేర్కొన్నట్లు నివేదికలో జర్నలిస్టులు ప్రస్తావించారు. నాలుగైదు సంవత్సరాలుగా రెండు కంపెనీలు మూసే ఉన్నాయని ఆయన చెప్పినట్లు తెలిపారు. వీరి వ్యాపారం వెనక నారాయణ్​జీ తనయుడు ప్రకాష్ కుమార్ రవునియార్​దే మాస్టర్ మైండ్ అని పేర్కొన్నారు.

జడ్​టీఈతో సంబంధాలు

చైనాకు చెందిన అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన ఝోంగ్షింగ్ టెలికమ్యునికేషన్ ఎక్విప్​మెంట్(జడ్​టీఈ) కార్పొరేషన్.. నేపాల్ సహా పలు దేశాలకు 213.3 మిలియన్ డాలర్లను పంపించినట్లు ఫిన్​సెన్ ఫైల్స్​ నివేదిక తెలిపింది. 2011 మార్చి 17 నుంచి 2017 మార్చి 1 మధ్య ఈ లావాదేవీలు జరిగినట్లు వెల్లడించింది.

బీజింగ్​లోని చైనా కన్​స్ట్రక్షన్ బ్యాంక్​ ద్వారా జడ్​టీఈ ఈ లావాదేవీలను నిర్వహించినట్లు స్పష్టం చేసింది నివేదిక. ఈ లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని చైనా కన్​స్ట్రక్షన్ బ్యాంక్ న్యూయార్క్ బ్రాంచీ గుర్తించిందని తెలిపింది.

అయిదేళ్ల సుదీర్ఘ విచారణలో అమెరికా ఆంక్షలను తప్పించుకోవడానికి జడ్​టీఈ చేసిన 'కుట్ర'లను నివేదిక బహిర్గతం చేసిందని ఫిన్​సెన్ పేర్కొంది.

"జడ్​టీఈ కంపెనీ.. అమెరికా నుంచి టెలికమ్యునికేషన్ పరికరాలను కొనుగోలు చేసి వాటిని జడ్​టీఈ సంస్థ పరికరాలుగా ఇరాన్​కు అక్రమంగా విక్రయిస్తోంది. అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా నియంత్రణ సంస్థలను మోసగించడానికి వివిధ దేశాల్లో అనుమానాస్పదంగా నిధులను బదిలీ చేసింది."

-ఫిన్​సెన్ ఫైల్స్

నేపాల్​కు అత్యధికంగా టెలికమ్యునికేషన్ పరికరాలను ఎగుమతి చేస్తున్న సంస్థల్లో జడ్​టీఈ ప్రధానమైనది. నేపాల్​లోని 'ఎన్​సెల్' కంపెనీ తరపున టవర్ నిర్మించేందుకు పరికరాలను సరఫరా చేస్తోంది. వాణిజ్యపరమైన అవసరాల కోసమే పరికరాలను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ.. అసలు ఉద్దేశం మాత్రం కస్టమ్స్ డ్యూటీని ఎగవేయడమేనని ఫిన్​సెన్ తెలిపింది. ఓసారి కస్టమ్స్ తనిఖీలో పట్టుబడ్డ తర్వాత పరికరాలను విడిచిపెట్టేందుకు జడ్​టీఈ కోటి రూపాయలను చెల్లించుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది.

ఈ లావాదేవీలపై వివరణ ఇచ్చేందుకు మాత్రం నేపాల్ ఇన్వెస్ట్​మెంట్ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ బిజేంద్ర సువాల్ నిరాకరించారు. కస్టమర్​కు, బ్యాంకుకు మధ్య ఉన్న సంబంధాన్ని చట్ట ప్రకారం వెల్లడించకూడదని సమాధానం ఇచ్చినట్లు ఫిన్​సెన్ పేర్కొంది. సరైన ఆధారాలు లేవని సమాచారం ఇవ్వలేదని తెలిపింది. అయితే జడ్​టీఈ మాత్రం ఫిన్​సెన్ నివేదికపై స్పందించలేదు.

విదేశాల నుంచి వచ్చిన అనుమానాస్పద సొమ్మును బదిలీ చేయడంలో నేపాల్​లోని కొన్ని బ్యాంకులు, సంస్థల పాత్ర ఉన్నట్లు వెల్లడైంది. సెంటర్ ఫర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం(సీఐజే), ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) సంయుక్తంగా నిర్వహించిన దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇరాన్, చైనా వాణిజ్యంపై అమెరికా ఆంక్షలను తప్పుదారి పట్టించేందుకు నేపాల్ బ్యాంకులు ప్రయత్నించినట్లు ఈ దర్యాప్తులో తేలింది.

ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించే ప్రభుత్వ సంస్థ 'ఫైనాన్సియల్ క్రైమ్స్ ఎన్​ఫోర్స్​మెంట్ నెట్​వర్క్' రూపొందించే రహస్య పత్రాల ఆధారంగా ఈ దర్యాప్తు నిర్వహించారు. ఈ దర్యాప్తు నివేదికకు 'ఫిన్​సెన్ ఫైల్స్​'గా నామకరణం చేశారు.

"బంగారం, పురాతన వస్తువులు, టెలికమ్యునికేషన్ పరికరాల అంతర్జాతీయ స్మగ్లింగ్​లతో నేపాల్​కు చెందిన కొన్ని వ్యాపారాలకు సంబంధం ఉంది. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ప్రైమ్ కమర్షియల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ కాఠ్​మాండూ, నేపాల్ ఇన్వెస్ట్​మెంట్ బ్యాంక్, ఎవరెస్ట్ బ్యాంక్, మెగా బ్యాంక్, హిమాలయన్ బ్యాంక్, అపెక్స్ డెవలప్​మెంట్ బ్యాంక్ ఆఫ్ కస్కి, నేపాల్ బంగ్లాదేశ్ బ్యాంక్​లు అనుమానాస్పదంగా నగదు బదిలీలో పాల్గొన్న బ్యాంకుల జాబితాలో ఉన్నాయి."

-ఫిన్​సెన్ ఫైల్స్

అనుమానాస్పద నిధుల బదిలీలో పది నేపాలీ సంస్థలకు నేరుగా ప్రమేయం ఉందని ఫిన్​సెన్ ఫైల్స్​ పత్రాలు పేర్కొన్నాయి. ఈ కంపెనీలు, బ్యాంకుల ద్వారా 11 ఏళ్లలో 292.7 మిలియన్ డాలర్ల నిధుల బదిలీ జరిగిందని తెలిపాయి.

రవునియార్ బ్రదర్స్ అండ్ కంపెనీ, సుభా సమృద్ధి ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్, శాస్తా ట్రేడింగ్ కంపెనీ, సేతీదేవి ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్​డీ. ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఫెల్ట్ అండ్ యార్న్ ప్రైవేట్ లిమిటెడ్, ఉమెన్స్ పేపర్ క్రాఫ్ట్స్, ఆక్మే మనీ ట్రాన్స్​ఫర్ సర్వీస్, సన్నీ ఎంటర్​ప్రైజెస్​లపై అనుమానాస్పద లావాదేవీలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

"పెట్రోలియం తదితర ఉత్పత్తులను ఎగుమతి చేసే దుబాయ్​కి చెందిన 'కైట్ ఇంటర్నేషనల్ ఎఫ్​జడ్ఈ' సంస్థ ద్వారా రవునియార్ బ్రదర్స్, శుభ సమృద్ధి ట్రేడర్స్ కంపెనీలు అనుమానిత లావాదేవీలు నిర్వహించాయి. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతుల పేరిట నాలుగేళ్లలో(2010-2014 మధ్య) 71.4 మిలియన్ డాలర్లను వివిధ దేశాలకు పంపించాయి."

-ఫిన్​సెన్ ఫైల్స్

అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్ నుంచి రవునియర్ కంపెనీ పలు ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నట్లు ఫిన్​సెన్ పత్రాలు పేర్కొన్నాయి. ఈ ఉత్పత్తులను దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు, పత్రాలను ఫోర్జరీ చేశారని తెలిపాయి. దర్యాప్తు సమయంలో ఈ విషయంపై కైట్ సంస్థ స్పందన కోసం ప్రయత్నించినప్పటికీ.. వారి నుంచి ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదని వెల్లడించాయి.

కెన్యా, జాంబియా, మొజాంబిక్, నేపాల్, అమెరికాలో 'కైట్ ఇంటర్నేషనల్​'కు శాఖలున్నట్లు జర్నలిస్ట్​లు గుర్తించారని నివేదిక వెల్లడించింది. ఉన్నత విద్య కోసం నేపాల్​లో కొత్త ప్రాజెక్టును ప్రారంభించినట్లు వారు తెలుసుకున్నారని పేర్కొంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక రికార్డులు లేవని తెలిపింది.

'ఎప్పుడో మూతపడ్డాయి'

అయితే.. తన రెండు కంపెనీలు మూతపడినట్లు కైట్ సంస్థతో లావాదేవీలు కొనసాగించిన రవునియార్ కంపెనీ డైరెక్టర్ నారాయణ్​జీ రవునియార్ పేర్కొన్నట్లు నివేదికలో జర్నలిస్టులు ప్రస్తావించారు. నాలుగైదు సంవత్సరాలుగా రెండు కంపెనీలు మూసే ఉన్నాయని ఆయన చెప్పినట్లు తెలిపారు. వీరి వ్యాపారం వెనక నారాయణ్​జీ తనయుడు ప్రకాష్ కుమార్ రవునియార్​దే మాస్టర్ మైండ్ అని పేర్కొన్నారు.

జడ్​టీఈతో సంబంధాలు

చైనాకు చెందిన అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన ఝోంగ్షింగ్ టెలికమ్యునికేషన్ ఎక్విప్​మెంట్(జడ్​టీఈ) కార్పొరేషన్.. నేపాల్ సహా పలు దేశాలకు 213.3 మిలియన్ డాలర్లను పంపించినట్లు ఫిన్​సెన్ ఫైల్స్​ నివేదిక తెలిపింది. 2011 మార్చి 17 నుంచి 2017 మార్చి 1 మధ్య ఈ లావాదేవీలు జరిగినట్లు వెల్లడించింది.

బీజింగ్​లోని చైనా కన్​స్ట్రక్షన్ బ్యాంక్​ ద్వారా జడ్​టీఈ ఈ లావాదేవీలను నిర్వహించినట్లు స్పష్టం చేసింది నివేదిక. ఈ లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని చైనా కన్​స్ట్రక్షన్ బ్యాంక్ న్యూయార్క్ బ్రాంచీ గుర్తించిందని తెలిపింది.

అయిదేళ్ల సుదీర్ఘ విచారణలో అమెరికా ఆంక్షలను తప్పించుకోవడానికి జడ్​టీఈ చేసిన 'కుట్ర'లను నివేదిక బహిర్గతం చేసిందని ఫిన్​సెన్ పేర్కొంది.

"జడ్​టీఈ కంపెనీ.. అమెరికా నుంచి టెలికమ్యునికేషన్ పరికరాలను కొనుగోలు చేసి వాటిని జడ్​టీఈ సంస్థ పరికరాలుగా ఇరాన్​కు అక్రమంగా విక్రయిస్తోంది. అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా నియంత్రణ సంస్థలను మోసగించడానికి వివిధ దేశాల్లో అనుమానాస్పదంగా నిధులను బదిలీ చేసింది."

-ఫిన్​సెన్ ఫైల్స్

నేపాల్​కు అత్యధికంగా టెలికమ్యునికేషన్ పరికరాలను ఎగుమతి చేస్తున్న సంస్థల్లో జడ్​టీఈ ప్రధానమైనది. నేపాల్​లోని 'ఎన్​సెల్' కంపెనీ తరపున టవర్ నిర్మించేందుకు పరికరాలను సరఫరా చేస్తోంది. వాణిజ్యపరమైన అవసరాల కోసమే పరికరాలను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ.. అసలు ఉద్దేశం మాత్రం కస్టమ్స్ డ్యూటీని ఎగవేయడమేనని ఫిన్​సెన్ తెలిపింది. ఓసారి కస్టమ్స్ తనిఖీలో పట్టుబడ్డ తర్వాత పరికరాలను విడిచిపెట్టేందుకు జడ్​టీఈ కోటి రూపాయలను చెల్లించుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది.

ఈ లావాదేవీలపై వివరణ ఇచ్చేందుకు మాత్రం నేపాల్ ఇన్వెస్ట్​మెంట్ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ బిజేంద్ర సువాల్ నిరాకరించారు. కస్టమర్​కు, బ్యాంకుకు మధ్య ఉన్న సంబంధాన్ని చట్ట ప్రకారం వెల్లడించకూడదని సమాధానం ఇచ్చినట్లు ఫిన్​సెన్ పేర్కొంది. సరైన ఆధారాలు లేవని సమాచారం ఇవ్వలేదని తెలిపింది. అయితే జడ్​టీఈ మాత్రం ఫిన్​సెన్ నివేదికపై స్పందించలేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.