ETV Bharat / international

ముంబయి దాడుల సూత్రధారికి 15 ఏళ్ల జైలు

ముంబయి దాడుల సూత్రధారి, లష్కరే తొయిబా కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీకి 15 ఏళ్ల జైలు విధించింది పాకిస్థాన్​ ఉగ్రవాద నిరోధక కోర్టు. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నాడని ఇతడిపై ఆరోపణలున్నాయి.

author img

By

Published : Jan 8, 2021, 4:18 PM IST

Updated : Jan 8, 2021, 5:10 PM IST

Mumbai attack mastermind
ముంబయి దాడుల సూత్రధారి లఖ్వీకి 15 ఏళ్ల జైలు

ముంబయి దాడుల సూత్రధారి, లష్కర్​-ఏ-తోయిబా ఆపరేషన్స్​ కమాండర్​ జకీ-ఉర్​-రెహ్మాన్​ లఖ్వీకి పాకిస్థాన్​ ఉగ్రవాద నిరోధక కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2015 నుంచి బెయిల్​పై ఉన్న అతడిని పంజాబ్​ రాష్ట్రానికి చెందిన ఉగ్రవాద నిరోధక విభాగం(సీటీడీ) జనవరి 2న అరెస్టు చేసింది. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నాడనే నేరం కింద న్యాయస్థానం తాజాగా దోషిగా ప్రకటించినట్లు ఓ అధికారి తెలిపారు.

లఖ్వీకి మూడు కేసుల్లో.. ఐదేళ్ల కారాగార శిక్షతోపాటుగా లక్ష​ రూపాయల(పాక్​ కరెన్సీ)ను జరిమానాగా విధిస్తూ ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్​ అహ్మద్​ బుట్టార్​ తీర్పు వెలువరించారు. మూడు కేసుల్లో జరిమానాను చెల్లించకపోతే.. మరో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేశారు. అయితే.. ఈ కేసులో తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని లఖ్వీ.. కోర్టుకు తెలిపాడు.

ముంబయి దాడుల సూత్రధారి, లష్కర్​-ఏ-తోయిబా ఆపరేషన్స్​ కమాండర్​ జకీ-ఉర్​-రెహ్మాన్​ లఖ్వీకి పాకిస్థాన్​ ఉగ్రవాద నిరోధక కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2015 నుంచి బెయిల్​పై ఉన్న అతడిని పంజాబ్​ రాష్ట్రానికి చెందిన ఉగ్రవాద నిరోధక విభాగం(సీటీడీ) జనవరి 2న అరెస్టు చేసింది. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నాడనే నేరం కింద న్యాయస్థానం తాజాగా దోషిగా ప్రకటించినట్లు ఓ అధికారి తెలిపారు.

లఖ్వీకి మూడు కేసుల్లో.. ఐదేళ్ల కారాగార శిక్షతోపాటుగా లక్ష​ రూపాయల(పాక్​ కరెన్సీ)ను జరిమానాగా విధిస్తూ ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్​ అహ్మద్​ బుట్టార్​ తీర్పు వెలువరించారు. మూడు కేసుల్లో జరిమానాను చెల్లించకపోతే.. మరో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేశారు. అయితే.. ఈ కేసులో తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని లఖ్వీ.. కోర్టుకు తెలిపాడు.

Last Updated : Jan 8, 2021, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.