ETV Bharat / international

తల్లికి కరోనా వైరస్​.. మరి ఇప్పుడే పుట్టిన పాపకు?

author img

By

Published : Feb 11, 2020, 3:28 PM IST

Updated : Mar 1, 2020, 12:03 AM IST

చైనాలో కరోనా వైరస్​ సోకిన ఓ మహిళ ఎటువంటి వైరస్ లక్షణాలు లేని ఆడ శిశువుకు జన్మనిచ్చింది. వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. పాపకు వైరస్​ సోకలేదని తేలింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Mother infected with coronavirus in China gives birth to a healthy baby
తల్లికి కరోనా వైరస్​.. మరి ఇప్పుడే పుట్టిన పాపకు?

చైనాలోని షాన్సీ రాష్ట్రంలో కరోనా బాధితురాలైన 33 ఏళ్ల మహిళ ఎలాంటి వైరస్​ సోకిన లక్షణాలు లేని ఆడ శిశువుకు జన్మనిచ్చింది. జియాన్​లోని ఓ ఆసుపత్రిలో 2.7 కిలోల బరువుతో పుట్టిన పాప ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

చిన్నారికి కరోనాకు సంబంధించిన పరీక్షలు నిర్వహించగా.. వైరస్​ సోకలేదని తేలింది. మళ్లీ కొద్ది రోజుల తర్వాత వైరస్​ లేకపోవడాన్ని నిర్ధరించేందుకు పాపకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. తల్లి, బిడ్డను ఐసోలేషన్​ వార్డుకు తరలించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.

ఫిబ్రవరి 7న షాంగ్లూ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రత్యేక ఆస్పత్రికి మహిళను తరలించారు. అప్పటి నుంచి తల్లి, బిడ్డ సురక్షితంగా ఉండేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు.

పుట్టిన 30 గంటల్లోనే..

ఇటీవలే వుహాన్​ ఆసుపత్రిలో జన్మించిన ఓ శిశువుకు 30 గంటల్లోనే కరోనా సోకింది. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 1000 దాటింది. 40వేల మందికిపైగా వైరస్​ బారిన పడ్డారు.

చైనాలోని షాన్సీ రాష్ట్రంలో కరోనా బాధితురాలైన 33 ఏళ్ల మహిళ ఎలాంటి వైరస్​ సోకిన లక్షణాలు లేని ఆడ శిశువుకు జన్మనిచ్చింది. జియాన్​లోని ఓ ఆసుపత్రిలో 2.7 కిలోల బరువుతో పుట్టిన పాప ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

చిన్నారికి కరోనాకు సంబంధించిన పరీక్షలు నిర్వహించగా.. వైరస్​ సోకలేదని తేలింది. మళ్లీ కొద్ది రోజుల తర్వాత వైరస్​ లేకపోవడాన్ని నిర్ధరించేందుకు పాపకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. తల్లి, బిడ్డను ఐసోలేషన్​ వార్డుకు తరలించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.

ఫిబ్రవరి 7న షాంగ్లూ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రత్యేక ఆస్పత్రికి మహిళను తరలించారు. అప్పటి నుంచి తల్లి, బిడ్డ సురక్షితంగా ఉండేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు.

పుట్టిన 30 గంటల్లోనే..

ఇటీవలే వుహాన్​ ఆసుపత్రిలో జన్మించిన ఓ శిశువుకు 30 గంటల్లోనే కరోనా సోకింది. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 1000 దాటింది. 40వేల మందికిపైగా వైరస్​ బారిన పడ్డారు.

Last Updated : Mar 1, 2020, 12:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.