ETV Bharat / international

'ముందు సరిహద్దు ఉగ్రవాదాన్ని మానుకోండి' - మానవ హక్కుల మండలిలో భారత్

సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలకు పాకిస్థాన్​ ముగింపు పలకాలని భారత్​ హెచ్చరించింది. తమ దేశంలోని మైనారిటీల హక్కులను ఉల్లంఘించడం మానుకోవాలని తెలిపింది. కశ్మీర్​పై పాక్​ చేసిన ఆరోపణలను తిప్పికొట్టింది.

India tells Pakistan to stop state-sponsored cross-border terrorism
'ముందు సరిహద్దు ఉగ్రవాదాన్ని మానుకోండి'
author img

By

Published : Mar 2, 2021, 6:25 PM IST

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్​.. సరిహద్దు ఉగ్రవాద చర్యలకు వత్తాసు పలకడం మానుకోవాలని భారత్​ పేర్కొంది. తమ దేశంలోని మైనారిటీ, ఇతర వర్గాల మానవ హక్కుల ఉల్లంఘనకు ముగింపు పలకాలని తెలిపింది. 46వ మానవ హక్కుల మండలిలో.. పాక్​ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు భారత్​ ఈవిధంగా జవాబిచ్చింది. భారత్​కు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలను తప్పుపట్టింది.

"ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్​ లాంటి దేశం.. సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలు, మానవ హక్కుల ఉల్లంఘనకు ముగింపు పలకాలి. ఉగ్రవాద ముఠాలకు పాక్​ ప్రభుత్వం నిధులు సమకూర్చిన విషయం అందరికీ తెలుసు. అతిపెద్ద ఉగ్రముఠాలకు పాక్​ స్థావరం ఇస్తున్నట్లు ఐరాస కూడా గుర్తించింది."

-పవన్ కుమార్, భారత దౌత్యవేత్త.

పాక్​ ఉగ్రవాద స్థావరంగా మారినట్లు ఆ దేశ నేతలు కూడా ఒప్పుకున్నారని పవన్​ వ్యాఖ్యానించారు. మైనారిటీల హక్కులను హరించడంపై పాకిస్థాన్​ను 'మానవ హక్కుల మండలి' ప్రశ్నించాలని పేర్కొన్నారు. కశ్మీర్​ గురించి ప్రశ్నించే హక్కు పాక్​కు లేదని గుర్తుచేశారు.

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్​.. సరిహద్దు ఉగ్రవాద చర్యలకు వత్తాసు పలకడం మానుకోవాలని భారత్​ పేర్కొంది. తమ దేశంలోని మైనారిటీ, ఇతర వర్గాల మానవ హక్కుల ఉల్లంఘనకు ముగింపు పలకాలని తెలిపింది. 46వ మానవ హక్కుల మండలిలో.. పాక్​ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు భారత్​ ఈవిధంగా జవాబిచ్చింది. భారత్​కు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలను తప్పుపట్టింది.

"ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్​ లాంటి దేశం.. సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలు, మానవ హక్కుల ఉల్లంఘనకు ముగింపు పలకాలి. ఉగ్రవాద ముఠాలకు పాక్​ ప్రభుత్వం నిధులు సమకూర్చిన విషయం అందరికీ తెలుసు. అతిపెద్ద ఉగ్రముఠాలకు పాక్​ స్థావరం ఇస్తున్నట్లు ఐరాస కూడా గుర్తించింది."

-పవన్ కుమార్, భారత దౌత్యవేత్త.

పాక్​ ఉగ్రవాద స్థావరంగా మారినట్లు ఆ దేశ నేతలు కూడా ఒప్పుకున్నారని పవన్​ వ్యాఖ్యానించారు. మైనారిటీల హక్కులను హరించడంపై పాకిస్థాన్​ను 'మానవ హక్కుల మండలి' ప్రశ్నించాలని పేర్కొన్నారు. కశ్మీర్​ గురించి ప్రశ్నించే హక్కు పాక్​కు లేదని గుర్తుచేశారు.

ఇదీ చదవండి:

ముందు మీ పని చూసుకోండి: పాక్​కు భారత్​ చురకలు

ఇండిగో విమానం పాక్​లో అత్యవసర ల్యాండింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.