ETV Bharat / international

మాపై మెరుపుదాడులకు భారత్ ప్రణాళిక: పాక్​

author img

By

Published : Dec 19, 2020, 7:24 AM IST

భారత్​పై కీలక వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్​ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్ యూసఫ్​. భారత్​.. పాక్​పై మెరుపు దాడులు చేసేందుకు ప్రణాళిక రచించిందని ఆరోపించారు. అయితే ఆయన వ్యాఖ్యలను భారత జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్​ పర్సన్ పీఎస్ రాఘవన్​ తోసిపుచ్చారు.

India planning to conduct surgical strikes along LOC
'మాపై మెరుపుదాడులకు భారత్ ప్రణాళిక'

తమ దేశంపై భారత్​ మెరుపుదాడులకు ప్రణాళిక రూపొందించిందంటూ పాకిస్థాన్​ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్​ యూసఫ్ ఆరోపించారు. పాక్​ ప్రధాని ఇమ్రాన్​కు మొయీద్​ శుక్రవారం చేసిన ట్వీట్​లో.."షా మహమ్మద్​ ఖురేషీ(పాకిస్థాన్​ విదేశాంగ శాఖ మంత్రి) యూఏఈలో అంతర్జాతీయ మీడియాకు ఈ విషయం చెప్పారు. మనకున్న నిఘా సమాచారం ప్రకారం పాక్​పై భారత్​ మెరుపు దాడులు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది," అని పేర్కొన్నారు.

ఈ ఆరోపణల్ని భారత జాతీయ భద్రత సలహా బోర్డు ఛైర్​ పర్సన్ పీఎస్ రాఘవన్​ తోసిపుచ్చారు. ఆయన 'ఈటీవీ భారత్​'తో మాట్లాడుతూ.. భారత్​కు వ్యతిరేకంగా కుటిల చర్యలకు పాల్పడటానికి పాకిస్థాన్​ కుట్రలు పన్నుతోందన్నారు.

మరో అబద్ధం కూడా..

భారత సైన్యంపై కూడా పాకిస్థాన్​ ఆర్మీ అసత్య ప్రకటనలు చేసింది. నియంత్రణ రేఖ వెంబడి చిరికోట్​ సెక్టార్​లో భారత్​ సైన్యం ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే కాల్పులకు దిగిందని, ఐక్యరాజ్యసమితి మిలిటరీ పరిశీలకుల వాహనాన్ని కావాలనే లక్ష్యంగా చేసుకుందని పాక్ ఆర్మీ ఆరోపించింది. ఈ ఆరోపణలను దిల్లీలోని భారత సైనిక వర్గాలు తిప్పికొట్టాయి.

ఇదీ చదవండి : 'డ్రాగన్​'తో సహకారం.. భారత్​కు ఇబ్బందికరం

తమ దేశంపై భారత్​ మెరుపుదాడులకు ప్రణాళిక రూపొందించిందంటూ పాకిస్థాన్​ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్​ యూసఫ్ ఆరోపించారు. పాక్​ ప్రధాని ఇమ్రాన్​కు మొయీద్​ శుక్రవారం చేసిన ట్వీట్​లో.."షా మహమ్మద్​ ఖురేషీ(పాకిస్థాన్​ విదేశాంగ శాఖ మంత్రి) యూఏఈలో అంతర్జాతీయ మీడియాకు ఈ విషయం చెప్పారు. మనకున్న నిఘా సమాచారం ప్రకారం పాక్​పై భారత్​ మెరుపు దాడులు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది," అని పేర్కొన్నారు.

ఈ ఆరోపణల్ని భారత జాతీయ భద్రత సలహా బోర్డు ఛైర్​ పర్సన్ పీఎస్ రాఘవన్​ తోసిపుచ్చారు. ఆయన 'ఈటీవీ భారత్​'తో మాట్లాడుతూ.. భారత్​కు వ్యతిరేకంగా కుటిల చర్యలకు పాల్పడటానికి పాకిస్థాన్​ కుట్రలు పన్నుతోందన్నారు.

మరో అబద్ధం కూడా..

భారత సైన్యంపై కూడా పాకిస్థాన్​ ఆర్మీ అసత్య ప్రకటనలు చేసింది. నియంత్రణ రేఖ వెంబడి చిరికోట్​ సెక్టార్​లో భారత్​ సైన్యం ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే కాల్పులకు దిగిందని, ఐక్యరాజ్యసమితి మిలిటరీ పరిశీలకుల వాహనాన్ని కావాలనే లక్ష్యంగా చేసుకుందని పాక్ ఆర్మీ ఆరోపించింది. ఈ ఆరోపణలను దిల్లీలోని భారత సైనిక వర్గాలు తిప్పికొట్టాయి.

ఇదీ చదవండి : 'డ్రాగన్​'తో సహకారం.. భారత్​కు ఇబ్బందికరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.