ETV Bharat / international

కరోనా పంజా: ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మంది మృతి

author img

By

Published : Jun 28, 2020, 8:03 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. రోజురోజుకూ నమోదవుతోన్న కొత్త కేసులు, మరణాల సంఖ్య ఆందోళనకర పరిస్థితిని తెలియజేస్తోంది. ఈ వైరస్​కు ఇప్పటివరకు 5 లక్షల మందికి పైగా బలయ్యారు. ఇందులో ఒక్క బ్రిటన్​ నుంచే 43 వేల మంది ఉండగా.. ఇటలీలో 35 వేలు, ఫ్రాన్స్​లో 30 వేలు, స్పెయిన్​లో 28 వేలు, మెక్సికోలో 26 వేల మంది చనిపోయారు.

Global COVID-19 tracker
కరోనా పంజా: ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మంది మృతి

కరోనా ప్రతాపం ఏమాత్రం తగ్గలేదు. దాదాపు అన్ని అగ్ర దేశాల్లో వైరస్​ ప్రభావం తీవ్రంగానే ఉంది. అంతర్జాతీయంగా ఇప్పటి వరకు ఒక కోటీ లక్షా 29 వేల మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. మొత్తం 5 లక్షల 2 వేల మంది మృతిచెందారు. దాదాపు 55 లక్షల మంది కోలుకున్నారు.

Global COVID-19 tracker
కరోనా వివరాలు

రష్యాలో కొత్తగా 6,791 కేసులు..

రష్యాలో కరోనా తీవ్రతకు అడ్డుకట్టపడటం లేదు. దేశవ్యాప్తంగా మరో 6,791 మంది వైరస్​ బాధితులుగా మారారు. ఇప్పటివరకు 6,34,437 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు తెలిపారు. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 104 మంది మహమ్మారి సోకి మరణించారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 9 వేలు దాటింది.

పాక్​లో 2 లక్షలకు పైగా..

పాకిస్థాన్​లో తాజాగా మరో 4,072 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. దేశంలో ఇప్పటివరకు 2,02,955 మంది కరోనా ​ బారినపడ్డారు. మరో 83 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 4,118కి చేరింది.

మొత్తం 77 జిల్లాలకు...

నేపాల్​లోనూ కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. ఆ దేశంలోని మొత్తం 77 జిల్లాలకు వైరస్​ వ్యాప్తి చెందినట్లు అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో 463 మందికి వైరస్​ సోకినట్లు ఆ దేశ వైద్య విభాగం ప్రకటించింది. ఇప్పటివరకు 12 వేల 772 మంది కరోనా బారినపడ్డారు. 28 మంది మరణించారు.

  • బ్రిటన్​లో మళ్లీ లాక్​డౌన్​ విధించాలని భావిస్తోంది అక్కడి ప్రభుత్వం.​ అయితే కరోనా కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే కఠిన ఆంక్షలు పెట్టనున్నారు. కరోనా ఉద్ధృతి గల ప్రాంతంలో భారత్ సంతతికి చెందిన ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 3,11,739 బాధితులు ఉన్నారు. ఇప్పటివరకు మహమ్మారికి 43,598 మంది బలయ్యారు.
  • సింగపూర్​లో గడచిన 24 గంటల్లో 213 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 202 మంది విదేశీ వలస కార్మికులని ఆ దేశ ఆరోగ్య వర్గాలు తెలిపాయి.
  • చైనాలో మళ్లీ కరోనా పుంజుకుంటోంది. కొత్తగా మరో 17 కేసులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
  • మెక్సికోలో కొత్తగా 4 వేల 410 మంది బాధితులను గుర్తించారు. మరో 602 మంది మృతి చెందారు.
  • సౌదీ అరేబియాలో తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం లక్షా 82 వేల 483 మందికి కరోనా సోకింది.
  • బంగ్లాదేశ్​లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. తాజాగా 3,809 మంది కరోనా బారిన పడగా.. మొత్తం బాధితుల సంఖ్య లక్షా 37 వేలకు చేరింది.
  • దక్షిణ కొరియాలో కరోనా జయించినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 62 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 26 మంది రాజధాని నగరం సియోల్​ నుంచే ఉన్నారు.
  • చెక్​ రిపబ్లిక్​లో కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో 260 మంది వైరస్​ సోకింది. మహమ్మారి సోకి 347 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 11 వేల మంది బాధితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
  • దక్షిణాఫ్రికాలో కరోనా తీవ్రత ఎక్కువ అవుతోంది. మొత్తం బాధితుల సంఖ్య లక్షా 31 వేలకు చేరినట్లు ఆ దేశ వైద్య విభాగం ప్రకటించింది.

ఇదీ చూడండి:తమిళనాడులో ఒక్కరోజే 3,940 మందికి కరోనా

కరోనా ప్రతాపం ఏమాత్రం తగ్గలేదు. దాదాపు అన్ని అగ్ర దేశాల్లో వైరస్​ ప్రభావం తీవ్రంగానే ఉంది. అంతర్జాతీయంగా ఇప్పటి వరకు ఒక కోటీ లక్షా 29 వేల మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. మొత్తం 5 లక్షల 2 వేల మంది మృతిచెందారు. దాదాపు 55 లక్షల మంది కోలుకున్నారు.

Global COVID-19 tracker
కరోనా వివరాలు

రష్యాలో కొత్తగా 6,791 కేసులు..

రష్యాలో కరోనా తీవ్రతకు అడ్డుకట్టపడటం లేదు. దేశవ్యాప్తంగా మరో 6,791 మంది వైరస్​ బాధితులుగా మారారు. ఇప్పటివరకు 6,34,437 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు తెలిపారు. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 104 మంది మహమ్మారి సోకి మరణించారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 9 వేలు దాటింది.

పాక్​లో 2 లక్షలకు పైగా..

పాకిస్థాన్​లో తాజాగా మరో 4,072 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. దేశంలో ఇప్పటివరకు 2,02,955 మంది కరోనా ​ బారినపడ్డారు. మరో 83 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 4,118కి చేరింది.

మొత్తం 77 జిల్లాలకు...

నేపాల్​లోనూ కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. ఆ దేశంలోని మొత్తం 77 జిల్లాలకు వైరస్​ వ్యాప్తి చెందినట్లు అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో 463 మందికి వైరస్​ సోకినట్లు ఆ దేశ వైద్య విభాగం ప్రకటించింది. ఇప్పటివరకు 12 వేల 772 మంది కరోనా బారినపడ్డారు. 28 మంది మరణించారు.

  • బ్రిటన్​లో మళ్లీ లాక్​డౌన్​ విధించాలని భావిస్తోంది అక్కడి ప్రభుత్వం.​ అయితే కరోనా కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే కఠిన ఆంక్షలు పెట్టనున్నారు. కరోనా ఉద్ధృతి గల ప్రాంతంలో భారత్ సంతతికి చెందిన ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 3,11,739 బాధితులు ఉన్నారు. ఇప్పటివరకు మహమ్మారికి 43,598 మంది బలయ్యారు.
  • సింగపూర్​లో గడచిన 24 గంటల్లో 213 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 202 మంది విదేశీ వలస కార్మికులని ఆ దేశ ఆరోగ్య వర్గాలు తెలిపాయి.
  • చైనాలో మళ్లీ కరోనా పుంజుకుంటోంది. కొత్తగా మరో 17 కేసులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
  • మెక్సికోలో కొత్తగా 4 వేల 410 మంది బాధితులను గుర్తించారు. మరో 602 మంది మృతి చెందారు.
  • సౌదీ అరేబియాలో తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం లక్షా 82 వేల 483 మందికి కరోనా సోకింది.
  • బంగ్లాదేశ్​లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. తాజాగా 3,809 మంది కరోనా బారిన పడగా.. మొత్తం బాధితుల సంఖ్య లక్షా 37 వేలకు చేరింది.
  • దక్షిణ కొరియాలో కరోనా జయించినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 62 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 26 మంది రాజధాని నగరం సియోల్​ నుంచే ఉన్నారు.
  • చెక్​ రిపబ్లిక్​లో కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో 260 మంది వైరస్​ సోకింది. మహమ్మారి సోకి 347 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 11 వేల మంది బాధితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
  • దక్షిణాఫ్రికాలో కరోనా తీవ్రత ఎక్కువ అవుతోంది. మొత్తం బాధితుల సంఖ్య లక్షా 31 వేలకు చేరినట్లు ఆ దేశ వైద్య విభాగం ప్రకటించింది.

ఇదీ చూడండి:తమిళనాడులో ఒక్కరోజే 3,940 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.