ETV Bharat / international

మాజీ ప్రధానికి కరోనా- ప్రభుత్వంపై అనుమానం!

author img

By

Published : Jun 13, 2020, 5:33 PM IST

Updated : Jun 13, 2020, 6:09 PM IST

Yousuf Raza Gilani tests positive for COVID19
మాజీ ప్రధాన మంత్రికి కరోనా పాజిటివ్

17:30 June 13

పాక్​ మాజీ ప్రధాని గిలానీకి కరోనా పాజిటివ్​

​పాకిస్థాన్​ మాజీ ప్రధాని యూసఫ్​ రజా గిలానీకి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వైద్యులు ఆయన్ను ఐసొలేషన్​లో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. ఓ అవినీతి కేసులో నేషనల్​ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్​ఏబీ)కు హాజరైన తర్వాత గిలానీకి పాజిటివ్​గా తేలింది.

ఇంతకుముందు మనీలాండరింగ్ కేసులో ఎన్​ఏబీకి హాజరైన పాక్ ప్రతిపక్ష నేత, పాకిస్థాన్​ ముస్లిం లీగ్ (నవాజ్) చీఫ్​ షెబాజ్​ షరీఫ్​ కూడా ​కరోనా బారిన పడ్డారు. తాజాగా గిలానీకి ఇదే విధంగా వైరస్​ సోకటంపై ఆయన కుమారుడు కాసీం గిలానీ ట్విట్టర్​ ద్వారా ప్రభుత్వంపై విమర్శలకు దిగారు.  

"ఇమ్రాన్​ ఖాన్ ​ప్రభుత్వానికి, ఎన్​ఏబీకి కృతజ్ఞతలు. మీరు విజయవంతంగా నా తండ్రి జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టారు. ఆయన కరోనా పరీక్షల్లో పాజిటివ్​గా తేలింది."

- కాసీం గిలానీ

పాకిస్థాన్​ క్రికెట్​ జట్టు మాజీ కెప్టెన్​ షాహిద్​ అఫ్రిదీకి కూడా కరోనా సోకినట్లు శనివారం నిర్ధరించారు అధికారులు.  

పాకిస్థాన్​లో గడిచిన 24 గంటల్లో 6,472 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కేసుల సంఖ్య 1,32,405కి చేరింది. వైరస్​తో ఒక్క రోజులో 88 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 2,551కి చేరింది. 

17:30 June 13

పాక్​ మాజీ ప్రధాని గిలానీకి కరోనా పాజిటివ్​

​పాకిస్థాన్​ మాజీ ప్రధాని యూసఫ్​ రజా గిలానీకి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వైద్యులు ఆయన్ను ఐసొలేషన్​లో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. ఓ అవినీతి కేసులో నేషనల్​ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్​ఏబీ)కు హాజరైన తర్వాత గిలానీకి పాజిటివ్​గా తేలింది.

ఇంతకుముందు మనీలాండరింగ్ కేసులో ఎన్​ఏబీకి హాజరైన పాక్ ప్రతిపక్ష నేత, పాకిస్థాన్​ ముస్లిం లీగ్ (నవాజ్) చీఫ్​ షెబాజ్​ షరీఫ్​ కూడా ​కరోనా బారిన పడ్డారు. తాజాగా గిలానీకి ఇదే విధంగా వైరస్​ సోకటంపై ఆయన కుమారుడు కాసీం గిలానీ ట్విట్టర్​ ద్వారా ప్రభుత్వంపై విమర్శలకు దిగారు.  

"ఇమ్రాన్​ ఖాన్ ​ప్రభుత్వానికి, ఎన్​ఏబీకి కృతజ్ఞతలు. మీరు విజయవంతంగా నా తండ్రి జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టారు. ఆయన కరోనా పరీక్షల్లో పాజిటివ్​గా తేలింది."

- కాసీం గిలానీ

పాకిస్థాన్​ క్రికెట్​ జట్టు మాజీ కెప్టెన్​ షాహిద్​ అఫ్రిదీకి కూడా కరోనా సోకినట్లు శనివారం నిర్ధరించారు అధికారులు.  

పాకిస్థాన్​లో గడిచిన 24 గంటల్లో 6,472 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కేసుల సంఖ్య 1,32,405కి చేరింది. వైరస్​తో ఒక్క రోజులో 88 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 2,551కి చేరింది. 

Last Updated : Jun 13, 2020, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.