ETV Bharat / international

'కరోనా కట్టడికి ఆ రెండే ప్రధాన అస్త్రాలు'

వైరస్ బాధితులతో సన్నిహితంగా ఉన్నవారిని త్వరగా గుర్తించి వేరు చేస్తేనే ​ కరోనాను త్వరగా కట్టడి చేయగలమని ఓ అధ్యయనం ద్వారా స్పష్టమైంది. వీలైనంత త్వరగా అనుమానితులను పరీక్షిస్తే మంచి ఫలితాలు ఉంటాయని తేలింది. అయితే వీరిని గుర్తించే క్రమంలో జాగ్రత్త వహించాలని సూచించారు పరిశోధకులు.

author img

By

Published : Apr 28, 2020, 2:44 PM IST

VIRUS-CONTROL-CONTACT TRACING
'వారిని త్వరగా గుర్తిస్తేనే కరోనా కట్టడి సాధ్యం'

కాంటాక్ట్​ ట్రేసింగ్, ఐసోలేషన్​... కరోనా కట్టడికి అతి కీలకమని ఓ పరిశోధన ద్వారా తేలింది. ఎంత వేగంగా ఈ ప్రక్రియ చేపడితే కరోనా వ్యాప్తిని అంత త్వరగా అడ్డుకోవచ్చని ఆ నివేదిక స్పష్టంచేసింది.

చైనా షెంఝెన్​లోని హార్బిన్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ టెక్నాలజీ ఈ అధ్యయనం చేసింది. ఈ పరిశోధన లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీసెస్ జర్నల్​లో ప్రచురితమైంది. 391 కేసులపై అధ్యయనం చేసిన పరిశోధకులు.. వారితో సన్నిహితంగా ఉన్న 1,286 మందిని పరిశీలించారు.

షెంఝెన్ మోడల్..

కాంటాక్ట్ ట్రేసింగ్ వల్ల షెంఝెన్​లో 4 వారాల్లో సామాజిక వ్యాప్తిని నియంత్రించగలిగినట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. అయితే వీరిని గుర్తించే క్రమంలో కొన్ని సవాళ్లు తప్పవని హెచ్చరించారు పరిశోధకులు. సన్నిహితులను పరీక్షించే క్రమంలో లక్షణాలు కనిపించని వారివల్ల వైరస్ సోకే ప్రమాదం ఉందని తెలిపారు.

"కాంటాక్ట్​ ట్రేసింగ్ వేగం పెరిగే కొద్దీ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య సగటు 5.5 నుంచి 3.2కు దిగివచ్చింది. ఎవరిని అనుమానితులుగా గుర్తించి వేరు చేయాలన్న విషయంలో అధికారులకు స్పష్టత వచ్చింది. వేగంగా పరీక్షలు నిర్వహించటం వల్ల షెంఝెన్​లో వైరస్ వ్యాప్తిని నియంత్రణ సాధ్యమైంది."

- హార్బిన్ పరిశోధకులు

లాక్​డౌన్​ కూడా..

కాంటాక్ట్​ ట్రేసింగ్ కాకుండా లాక్​డౌన్​, భౌతిక దూరం పాటించటం కూడా మంచి ఫలితాలను ఇస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

"షెంఝెన్​లో లాక్​డౌన్​ అమలు చేయలేదు. కానీ వుహాన్​లో కఠిన ఆంక్షల కారణంగా షెంఝెన్​కు వైరస్​ వ్యాప్తి తీవ్రత చాలా తగ్గింది. ఒక వ్యక్తి వైరస్​ ఎప్పటి నుంచి వ్యాప్తి చేయగలడో స్పష్టంగా తెలియదు. కానీ.. ఇతరులతో అతనిని కలవకుండా వేరుచేయటం వల్ల వైరస్ వ్యాప్తి నియంత్రించగలం."

- హార్బిన్ పరిశోధకులు

ఇదీ చూడండి: సెప్టెంబర్​ నాటికి కరోనా వ్యాక్సిన్ సిద్ధం!

కాంటాక్ట్​ ట్రేసింగ్, ఐసోలేషన్​... కరోనా కట్టడికి అతి కీలకమని ఓ పరిశోధన ద్వారా తేలింది. ఎంత వేగంగా ఈ ప్రక్రియ చేపడితే కరోనా వ్యాప్తిని అంత త్వరగా అడ్డుకోవచ్చని ఆ నివేదిక స్పష్టంచేసింది.

చైనా షెంఝెన్​లోని హార్బిన్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ టెక్నాలజీ ఈ అధ్యయనం చేసింది. ఈ పరిశోధన లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీసెస్ జర్నల్​లో ప్రచురితమైంది. 391 కేసులపై అధ్యయనం చేసిన పరిశోధకులు.. వారితో సన్నిహితంగా ఉన్న 1,286 మందిని పరిశీలించారు.

షెంఝెన్ మోడల్..

కాంటాక్ట్ ట్రేసింగ్ వల్ల షెంఝెన్​లో 4 వారాల్లో సామాజిక వ్యాప్తిని నియంత్రించగలిగినట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. అయితే వీరిని గుర్తించే క్రమంలో కొన్ని సవాళ్లు తప్పవని హెచ్చరించారు పరిశోధకులు. సన్నిహితులను పరీక్షించే క్రమంలో లక్షణాలు కనిపించని వారివల్ల వైరస్ సోకే ప్రమాదం ఉందని తెలిపారు.

"కాంటాక్ట్​ ట్రేసింగ్ వేగం పెరిగే కొద్దీ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య సగటు 5.5 నుంచి 3.2కు దిగివచ్చింది. ఎవరిని అనుమానితులుగా గుర్తించి వేరు చేయాలన్న విషయంలో అధికారులకు స్పష్టత వచ్చింది. వేగంగా పరీక్షలు నిర్వహించటం వల్ల షెంఝెన్​లో వైరస్ వ్యాప్తిని నియంత్రణ సాధ్యమైంది."

- హార్బిన్ పరిశోధకులు

లాక్​డౌన్​ కూడా..

కాంటాక్ట్​ ట్రేసింగ్ కాకుండా లాక్​డౌన్​, భౌతిక దూరం పాటించటం కూడా మంచి ఫలితాలను ఇస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

"షెంఝెన్​లో లాక్​డౌన్​ అమలు చేయలేదు. కానీ వుహాన్​లో కఠిన ఆంక్షల కారణంగా షెంఝెన్​కు వైరస్​ వ్యాప్తి తీవ్రత చాలా తగ్గింది. ఒక వ్యక్తి వైరస్​ ఎప్పటి నుంచి వ్యాప్తి చేయగలడో స్పష్టంగా తెలియదు. కానీ.. ఇతరులతో అతనిని కలవకుండా వేరుచేయటం వల్ల వైరస్ వ్యాప్తి నియంత్రించగలం."

- హార్బిన్ పరిశోధకులు

ఇదీ చూడండి: సెప్టెంబర్​ నాటికి కరోనా వ్యాక్సిన్ సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.