ETV Bharat / international

బలగాల ఉపసంహరణ పూర్తి: చైనా

author img

By

Published : Jul 28, 2020, 6:36 PM IST

భారత్​- చైనా సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి సైనికుల ఉపసంహరణ పూర్తయినట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్​ వెన్​బిన్​ వెల్లడించారు. త్వరలోనే తదుపరి దశ సైనిక స్థాయి చర్చలు జరగనున్నట్లు పేర్కొన్నారు.

Disengagement of Troops Completes Most of areas on Indian Border China
బలగాల ఉపసంహరణ పూర్తయింది: చైనా

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఏర్పడిన దాదాపు అన్ని ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ పూర్తయినట్లు చైనా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం మీడియా సమావేశంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ వెల్లడించారు. త్వరలోనే తర్వాత దశ సైనికస్థాయి చర్చలు జరుగుతాయని తెలిపారు.

"ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు తగ్గి, అక్కడి పరిస్థితులు చక్కబడ్డాయి. ఇరు దేశాలకు చెందిన ముందు వరుసలో ఉండే సైనిక బలగాలను గల్వాన్‌ లోయ, హాట్ స్ప్రింగ్స్‌, గోగ్రా ప్రాంతాల నుంచి ఉపసంహరించడం జరిగింది. మరోసారి కమాండర్‌ స్థాయి అధికారుల మధ్య చర్చలకు సిద్ధమవుతున్నాం" అని తెలిపారు.

జూన్‌ 15 ఘటన తర్వాత ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్-చైనాలు పలుమార్లు దౌత్య, సైనికపరమైన చర్చలు జరిపాయి. ఇందులో భాగంగా ఇరు దేశాలు బలగాల ఉపసంహరణను ప్రారంభించాయి. అయితే చైనా తీరుతో భారత్‌లో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలన్న ఆలోచన ఊపందుకుంది. ఇప్పటికే భారత్ ప్రభుత్వం చైనాకు చెందిన పలు యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

ఇదీ చూడండి:'ఐదో రోజూ 30 వేలకుపైగా కరోనా రికవరీలు'

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఏర్పడిన దాదాపు అన్ని ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ పూర్తయినట్లు చైనా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం మీడియా సమావేశంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ వెల్లడించారు. త్వరలోనే తర్వాత దశ సైనికస్థాయి చర్చలు జరుగుతాయని తెలిపారు.

"ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు తగ్గి, అక్కడి పరిస్థితులు చక్కబడ్డాయి. ఇరు దేశాలకు చెందిన ముందు వరుసలో ఉండే సైనిక బలగాలను గల్వాన్‌ లోయ, హాట్ స్ప్రింగ్స్‌, గోగ్రా ప్రాంతాల నుంచి ఉపసంహరించడం జరిగింది. మరోసారి కమాండర్‌ స్థాయి అధికారుల మధ్య చర్చలకు సిద్ధమవుతున్నాం" అని తెలిపారు.

జూన్‌ 15 ఘటన తర్వాత ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్-చైనాలు పలుమార్లు దౌత్య, సైనికపరమైన చర్చలు జరిపాయి. ఇందులో భాగంగా ఇరు దేశాలు బలగాల ఉపసంహరణను ప్రారంభించాయి. అయితే చైనా తీరుతో భారత్‌లో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలన్న ఆలోచన ఊపందుకుంది. ఇప్పటికే భారత్ ప్రభుత్వం చైనాకు చెందిన పలు యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

ఇదీ చూడండి:'ఐదో రోజూ 30 వేలకుపైగా కరోనా రికవరీలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.