ETV Bharat / international

'మ్యాన్​ వర్సెస్​ వైల్డ్'​తో మోదీ రికార్డుల వేట!

author img

By

Published : Aug 23, 2019, 6:36 AM IST

Updated : Sep 27, 2019, 11:03 PM IST

ప్రముఖ సాహసకారుడు బేర్​ గ్రిల్స్​తో కలిసి 'మ్యాన్​ వర్సెస్​ వైల్డ్'​ కార్యక్రమంలో.. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సాహసాలు నూతన రికార్డులు నెలకొల్పాయి. ఈ షో భారత్​లో రికార్డు స్థాయి వీక్షకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్​ ట్రెండింగ్​ టెలివిజన్​ ఈవెంట్​గా నిలిచినట్లు డిస్కవరీ ప్రకటించింది.

'మ్యాన్​ వర్సెస్​ వైల్డ్'​తో మోదీ రికార్డుల వేట!

'మ్యాన్​ వర్సెస్​ వైల్డ్'​ కార్యక్రమంలో బేర్​ గ్రిల్స్​తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సాహసాలు సరికొత్త రికార్డును సృష్టించాయని తెలిపింది డిస్కవరీ ఛానల్. ఈ నెల 12న డిస్కవరీలో ప్రసారమైన ఈ షోకు భారత్​లో రికార్డుస్థాయిలో.. 36 లక్షల 90వేల ఇంప్రెషన్స్​ వచ్చినట్లు తెలిపింది. డీడీ నేషనల్​తో కలిపి మొత్తంగా (తొలిసారి, మలిసారి ప్రసారాలు) 427 లక్షల (42.7 మిలియన్​) ఇంప్రెషన్స్​ వచ్చినట్లు ప్రకటించింది. బ్రాడ్​కాస్ట్​ ఆడియన్స్​ రీసెర్చ్​ కౌన్సిల్​ (బీఏఆర్​సీ) డేటా ప్రకారమే ఈ ప్రకటన చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఈ ప్రత్యేక కార్యక్రమంతో డిస్కవరీ ఛానల్‌ ఏకంగా 36 లక్షల 90 వేల ఇంప్రెషన్స్‌ సాధించి.. దేశవ్యాప్తంగా మూడోస్థానంలో నిలిచింది. స్టార్‌ ప్లస్‌ (36 లక్షల 70 వేల ఇంప్రెషన్స్‌)ను వెనక్కినెట్టి.. ఈ ఘనతను సొంతం చేసుకొంది. ఈ కార్యక్రమాన్ని సగటున 29.2 నిమిషాలపాటు ప్రేక్షకులు వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా 360 కోట్ల సోషల్‌ ఇంప్రెషన్స్‌తో మోస్ట్‌ ట్రెండింగ్‌ టెలివిజన్‌ ఈవెంట్‌గా నిలిచిందని డిస్కవరీ సంస్థ ప్రకటించింది.

పులుల సంరక్షణకు సాయం..

ఈ కార్యక్రమం రికార్డు స్థాయిలో విజయం సాధించినందుకు భారత్​లో పులుల సంరక్షణకు ఆర్థిక సాయం చేసేందుకు నిర్ణయించుకుంది డిస్కవరీ. అలాగే అంతర్జాతీయ ప్రాజెక్టు.. కన్జర్వేటివ్​ ఎకర్స్​ ఫర్​ టైగర్స్​ (సీఏటీ)లో భాగంగా నాలుగు దేశాల్లో భవిష్యత్​ తరాల పులుల కోసం 60 లక్షల ఎకరాల భూమిని సంరక్షిస్తామని స్పష్టం చేసింది.

ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్పెట్‌ జాతీయ పార్కులో బేర్​ గ్రిల్స్​తో కలిసి మోదీ చేసిన సాహసయాత్ర ఆగస్టు 12న రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో ప్రసారమైంది.

'మ్యాన్​ వర్సెస్​ వైల్డ్'​ కార్యక్రమంలో బేర్​ గ్రిల్స్​తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సాహసాలు సరికొత్త రికార్డును సృష్టించాయని తెలిపింది డిస్కవరీ ఛానల్. ఈ నెల 12న డిస్కవరీలో ప్రసారమైన ఈ షోకు భారత్​లో రికార్డుస్థాయిలో.. 36 లక్షల 90వేల ఇంప్రెషన్స్​ వచ్చినట్లు తెలిపింది. డీడీ నేషనల్​తో కలిపి మొత్తంగా (తొలిసారి, మలిసారి ప్రసారాలు) 427 లక్షల (42.7 మిలియన్​) ఇంప్రెషన్స్​ వచ్చినట్లు ప్రకటించింది. బ్రాడ్​కాస్ట్​ ఆడియన్స్​ రీసెర్చ్​ కౌన్సిల్​ (బీఏఆర్​సీ) డేటా ప్రకారమే ఈ ప్రకటన చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఈ ప్రత్యేక కార్యక్రమంతో డిస్కవరీ ఛానల్‌ ఏకంగా 36 లక్షల 90 వేల ఇంప్రెషన్స్‌ సాధించి.. దేశవ్యాప్తంగా మూడోస్థానంలో నిలిచింది. స్టార్‌ ప్లస్‌ (36 లక్షల 70 వేల ఇంప్రెషన్స్‌)ను వెనక్కినెట్టి.. ఈ ఘనతను సొంతం చేసుకొంది. ఈ కార్యక్రమాన్ని సగటున 29.2 నిమిషాలపాటు ప్రేక్షకులు వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా 360 కోట్ల సోషల్‌ ఇంప్రెషన్స్‌తో మోస్ట్‌ ట్రెండింగ్‌ టెలివిజన్‌ ఈవెంట్‌గా నిలిచిందని డిస్కవరీ సంస్థ ప్రకటించింది.

పులుల సంరక్షణకు సాయం..

ఈ కార్యక్రమం రికార్డు స్థాయిలో విజయం సాధించినందుకు భారత్​లో పులుల సంరక్షణకు ఆర్థిక సాయం చేసేందుకు నిర్ణయించుకుంది డిస్కవరీ. అలాగే అంతర్జాతీయ ప్రాజెక్టు.. కన్జర్వేటివ్​ ఎకర్స్​ ఫర్​ టైగర్స్​ (సీఏటీ)లో భాగంగా నాలుగు దేశాల్లో భవిష్యత్​ తరాల పులుల కోసం 60 లక్షల ఎకరాల భూమిని సంరక్షిస్తామని స్పష్టం చేసింది.

ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్పెట్‌ జాతీయ పార్కులో బేర్​ గ్రిల్స్​తో కలిసి మోదీ చేసిన సాహసయాత్ర ఆగస్టు 12న రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో ప్రసారమైంది.

Intro:Body:Conclusion:
Last Updated : Sep 27, 2019, 11:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.