ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 32 వేలు దాటిన కరోనా మృతులు

author img

By

Published : Mar 29, 2020, 5:40 PM IST

Updated : Mar 29, 2020, 7:14 PM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా మరణించిన వారి సంఖ్య 32,139కు చేరింది. వీరిలో మూడో వంతు మంది ఐరోపా​లోనే వారు కావడం గమనార్హం. స్పెయిన్​లో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 838 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 6,83,525 మందికి వైరస్​ సోకినట్లు తెలుస్తోంది.

Coronavirus global death toll crosses 31,000
ప్రపంచవ్యాప్తంగా 32 వేలకు చేరువలో కరోనా మృతులు

కరోనా మహమ్మారికి మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటివరకు వరకు ప్రపంచ వ్యాప్తంగా 32,139 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం కేసుల సంఖ్య 6,83,525కు చేరగా.. వీరిలో 1,46,396 మంది కోలుకున్నట్లు వెల్లడించారు.

స్పెయిన్​లో...

కరోనా వైరస్​ స్పెయిన్​లో మరణ మృందగం మోగిస్తోంది. వైరస్​ ప్రభావంతో దేశంలో రోజురోజుకూ రికార్డు స్థాయిలో మృతువాత పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో మరో 838 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు స్పెయిన్​లో మహమ్మారి ధాటికి 6,528 మంది మృతి చెందారు.

దేశ వ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 9.1 శాతం కేసులు పెరిగినట్లు వెల్లడించారు అధికారులు. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 78,797కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చనిపోయిన దేశాల్లో ఇటలీ మొదటి స్థానంలో నిలవగా స్పెయిన్​ రెండో స్థానంలో నిలిచింది.

ఇరాన్​లోనూ...

కరోనా ధాటికి ఇరాన్​లో ఇవాళ 123 మంది మృతి చెందినట్లు ఆ దేశ యంత్రాంగం ప్రకటించింది. దీంతో దేశ వ్యాప్తంగా మరణాల సంఖ్య 2,640కు చేరింది. గడిచిన 24 గంటల్లో 2,901 మంది మందికి మహమ్మారి సోకినట్లు వెల్లడించారు. మొత్తం 38,309 మంది వైరస్​ బారిన పడగా, అందులో 12,391 మంది కోలుకున్నట్లు తెలిపారు. మరో 3,467 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

అమెరికా...

అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ న్యూయార్క్​ నగరాన్ని నిర్బంధించేది లేదని మరోసారి స్పష్టం చేశారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 1,23,781 మంది అమెరికన్​ వాసులకు వైరస్​ సోకినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 2,229 మంది మరణించారు.

ఇటలీలో...

కరోనా ధాటికి ఇటలీలో ఇప్పటి వరకు 10,023 మంది మరణించారు. మొత్తం 92,472 మంది వైరస్​ బారిన పడగా... అందులో 12,384 మంది కోలుకున్నారు.

Coronavirus global death toll crosses 32,000
ప్రపంచవ్యాప్తంగా 32 వేలు ధాటిన కరోనా మృతులు

ఇదీ చూడండి:కేరళలో కరోనా అనుమానితుడు మృతి

కరోనా మహమ్మారికి మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటివరకు వరకు ప్రపంచ వ్యాప్తంగా 32,139 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం కేసుల సంఖ్య 6,83,525కు చేరగా.. వీరిలో 1,46,396 మంది కోలుకున్నట్లు వెల్లడించారు.

స్పెయిన్​లో...

కరోనా వైరస్​ స్పెయిన్​లో మరణ మృందగం మోగిస్తోంది. వైరస్​ ప్రభావంతో దేశంలో రోజురోజుకూ రికార్డు స్థాయిలో మృతువాత పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో మరో 838 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు స్పెయిన్​లో మహమ్మారి ధాటికి 6,528 మంది మృతి చెందారు.

దేశ వ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 9.1 శాతం కేసులు పెరిగినట్లు వెల్లడించారు అధికారులు. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 78,797కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చనిపోయిన దేశాల్లో ఇటలీ మొదటి స్థానంలో నిలవగా స్పెయిన్​ రెండో స్థానంలో నిలిచింది.

ఇరాన్​లోనూ...

కరోనా ధాటికి ఇరాన్​లో ఇవాళ 123 మంది మృతి చెందినట్లు ఆ దేశ యంత్రాంగం ప్రకటించింది. దీంతో దేశ వ్యాప్తంగా మరణాల సంఖ్య 2,640కు చేరింది. గడిచిన 24 గంటల్లో 2,901 మంది మందికి మహమ్మారి సోకినట్లు వెల్లడించారు. మొత్తం 38,309 మంది వైరస్​ బారిన పడగా, అందులో 12,391 మంది కోలుకున్నట్లు తెలిపారు. మరో 3,467 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

అమెరికా...

అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ న్యూయార్క్​ నగరాన్ని నిర్బంధించేది లేదని మరోసారి స్పష్టం చేశారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 1,23,781 మంది అమెరికన్​ వాసులకు వైరస్​ సోకినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 2,229 మంది మరణించారు.

ఇటలీలో...

కరోనా ధాటికి ఇటలీలో ఇప్పటి వరకు 10,023 మంది మరణించారు. మొత్తం 92,472 మంది వైరస్​ బారిన పడగా... అందులో 12,384 మంది కోలుకున్నారు.

Coronavirus global death toll crosses 32,000
ప్రపంచవ్యాప్తంగా 32 వేలు ధాటిన కరోనా మృతులు

ఇదీ చూడండి:కేరళలో కరోనా అనుమానితుడు మృతి

Last Updated : Mar 29, 2020, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.