ETV Bharat / international

చైనా దృష్టికి భారతీయ విద్యార్థుల సమస్యలు - COVID-19 restrictions

కరోనా కారణంగా చైనాలో చదివే భారత విద్యార్థుల పరిస్థితిపై నిరంతరం సమీక్షిస్తున్నట్లు అక్కడి ఇండియన్​ ఎంబసీ తెలిపింది. కొవిడ్​ ఆంక్షల నేపథ్యంలో వీరంతా భారత్​కు వచ్చారు. ఇప్పట్లో విద్యార్థుల్ని తమ దేశానికి రావొద్దని చైనా చెబుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఆ సమస్యను చైనా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.

Closely following up with China on plight of Indian students
చైనా దృష్టికి భారతీయ విద్యార్థుల సమస్యలు
author img

By

Published : Mar 23, 2021, 5:49 AM IST

కరోనా ఆంక్షల కారణంగా చైనాలో అడుగుపెట్టలేని వేలాదిమంది భారతీయ విద్యార్థుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు బీజింగ్​లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

దాదాపు 4 లక్షల 40 వేల మంది విదేశీ విద్యార్థులు చైనాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు.

భారత్​ నుంచే దాదాపు 23 వేల మందికిపైగా అక్కడ విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో ఎక్కువమంది వైద్యవిద్యార్థులే. వీరంతా కొవిడ్​ కారణంగా భారత్​కు తిరిగి వెళ్లారు. అప్పటినుంచి ఆన్​లైన్​లోనే విద్యాబోధన జరుపుతున్నారు. చైనా కూడా వీరిని తమ దేశానికి అప్పుడే రావొద్దని అంటోంది. తమ దేశంలో కొవిడ్​-19 ఆంక్షలు ఇంకా అమల్లో ఉన్నాయని, ఆన్​లైన్​లోని విద్యను కొనసాగించాలని కోరుతోంది.

తమకు ఉపకార వేతనాలు ఇవ్వట్లేదని విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజింగ్​లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత విద్యార్థుల సమస్యలను చైనా విద్యాధికారుల దృష్టికి తీసుకొస్తున్నామని తెలిపింది.

ఇదీ చూడండి: ''భారతీయ విద్యార్థులకు చైనా టీకా'పై పరిశీలిస్తాం'

కరోనా ఆంక్షల కారణంగా చైనాలో అడుగుపెట్టలేని వేలాదిమంది భారతీయ విద్యార్థుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు బీజింగ్​లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

దాదాపు 4 లక్షల 40 వేల మంది విదేశీ విద్యార్థులు చైనాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు.

భారత్​ నుంచే దాదాపు 23 వేల మందికిపైగా అక్కడ విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో ఎక్కువమంది వైద్యవిద్యార్థులే. వీరంతా కొవిడ్​ కారణంగా భారత్​కు తిరిగి వెళ్లారు. అప్పటినుంచి ఆన్​లైన్​లోనే విద్యాబోధన జరుపుతున్నారు. చైనా కూడా వీరిని తమ దేశానికి అప్పుడే రావొద్దని అంటోంది. తమ దేశంలో కొవిడ్​-19 ఆంక్షలు ఇంకా అమల్లో ఉన్నాయని, ఆన్​లైన్​లోని విద్యను కొనసాగించాలని కోరుతోంది.

తమకు ఉపకార వేతనాలు ఇవ్వట్లేదని విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజింగ్​లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత విద్యార్థుల సమస్యలను చైనా విద్యాధికారుల దృష్టికి తీసుకొస్తున్నామని తెలిపింది.

ఇదీ చూడండి: ''భారతీయ విద్యార్థులకు చైనా టీకా'పై పరిశీలిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.