ETV Bharat / international

పీవోకేలో ఆ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా-పాక్​ సంతకాలు - Pakistan-occupied Kashmir latest news

పాక్​ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో 'ఆజాద్​ పత్తాన్​' జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఒప్పందంపై చైనా-పాక్​ సంతకాలు చేశాయి. 'చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా (సీపెక్​)' లో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు పాక్​ పేర్కొంది.​ అయితే దీన్ని భారత్​ వ్యతిరేకిస్తోంది.

Chinese firm signs USD 1.5 bn deal with Pak to set up hydropower project in PoK
పీవోకేలో జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మించనున్న చైనా
author img

By

Published : Jul 7, 2020, 8:10 AM IST

పాక్​ ఆక్రమిత కశ్మీర్​ (పీవోకే)లో 1.5 కోట్ల డాలర్ల విలువైన 'ఆజాద్​ పత్తాన్​' జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఒప్పందంపై చైనా-పాకిస్థాన్​లు సోమవారం సంతకం చేశాయి. ఇరుదేశాలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా (సీపెక్​)' లో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు పాక్​ పేర్కొంది. పీవోకే ప్రాంతంలోని జీలం నదిపై నిర్మించనున్న 700 మెగావాట్ల జల విద్యుత్తు ప్రాజెక్టు వల్ల చౌకైన, సురక్షిత విద్యుత్తు లభిస్తుందని తెలిపింది.

2026 నాటికి నిర్మాణం పూర్తవుతుందని వివరించింది. ఈ సందర్భంగా పాక్​ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ మాట్లాడుతూ 'చైనా అభివృద్ధి నుంచి మేమెంతో నేర్చుకున్నాం. సీపెక్​ ప్రాజెక్టు ద్వారా పాకిస్థాన్​ తప్పకుండా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది.' అని అన్నారు. చైనలోని జిన్​ జియాంగ్​ ప్రావిన్సును బలూచిస్థాన్​లోని గ్వాదర్​ పోర్టుకు అనుసంధానించే సీపెక్​ ప్రాజెక్టు పీవోకే గుండా వెళ్తుండటం వల్ల దాన్ని భారత్​ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

పాక్​ ఆక్రమిత కశ్మీర్​ (పీవోకే)లో 1.5 కోట్ల డాలర్ల విలువైన 'ఆజాద్​ పత్తాన్​' జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఒప్పందంపై చైనా-పాకిస్థాన్​లు సోమవారం సంతకం చేశాయి. ఇరుదేశాలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా (సీపెక్​)' లో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు పాక్​ పేర్కొంది. పీవోకే ప్రాంతంలోని జీలం నదిపై నిర్మించనున్న 700 మెగావాట్ల జల విద్యుత్తు ప్రాజెక్టు వల్ల చౌకైన, సురక్షిత విద్యుత్తు లభిస్తుందని తెలిపింది.

2026 నాటికి నిర్మాణం పూర్తవుతుందని వివరించింది. ఈ సందర్భంగా పాక్​ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ మాట్లాడుతూ 'చైనా అభివృద్ధి నుంచి మేమెంతో నేర్చుకున్నాం. సీపెక్​ ప్రాజెక్టు ద్వారా పాకిస్థాన్​ తప్పకుండా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది.' అని అన్నారు. చైనలోని జిన్​ జియాంగ్​ ప్రావిన్సును బలూచిస్థాన్​లోని గ్వాదర్​ పోర్టుకు అనుసంధానించే సీపెక్​ ప్రాజెక్టు పీవోకే గుండా వెళ్తుండటం వల్ల దాన్ని భారత్​ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఇదీ చూడండి: ప్రయాణాలపై ఆంక్షల ఎత్తివేతకు ఇమ్రాన్​ ​విజ్ఞప్తి

For All Latest Updates

TAGGED:

POK updates
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.