ETV Bharat / international

ప్రచండతో చైనా రాయబారి కీలక భేటీ

author img

By

Published : Dec 24, 2020, 5:22 PM IST

చైనా రాయబారి హౌ యాంకీ నేపాల్​లో పర్యటించారు. నేపాల్​ కమ్యూనిస్టు పార్టీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​ ప్రచండతో భేటీ అయ్యారు. ఇటీవల పార్టీలో చీలికలు, పార్లమెంటు రద్దు నేపథ్యంలో ప్రస్తుత సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

Chinese envoy meets Prachanda amid political crisis in Nepal
ఎన్​సీపీ నేత ప్రచండతో చైనా రాయబారి భేటీ..

నేపాల్​ కమ్యూనిస్టు​ పార్టీ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​ పుష్ప కమల్​ దహల్​ (ప్రచండ)తో.. చైనా రాయబారి హౌ యాంకీ సమావేశమయ్యారు. ఖుమ్లతార్​లోని ప్రచండ నివాసంలో వీరి భేటి జరిగినట్లు అక్కడి మీడియా వర్గాలు ధ్రువీకరించాయి. ఇటీవల అధికార ఎన్​సీపీలో చీలిక ఏర్పడటం, ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి పార్లమెంట్​ను రద్దు చేసిన నేపథ్యంలో ప్రస్తుత సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

రాజకీయ సంక్షోభం తలెత్తిన నేపాల్​లో చైనా రాయబారి పర్యటన ఆసక్తికరంగా మారింది. అయితే నేపాల్​ అంతర్గత వ్యవహారాల్లో బీజింగ్​ తలదూర్చటం ఇదేమీ కొత్త కాదని అక్కడి విద్యార్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ భేటీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల కార్యకర్తలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. బీజింగ్​ రాయబార కార్యాలయం ముందు చైనా వ్యతిరేక నినాదాలు చేశారు.

తాజా రాజకీయ పరిణామాలపైనే ప్రస్తుత భేటీ జరిగినట్లు ప్రచండ వ్యక్తిగత కార్యదర్శి ఒకరు చెప్పారు.

నేపాల్​ రాష్ట్రపతి విద్యాదేవి భండారీని అధికార నివాసమైన శీతల్​ నివాస్​లో రెండు రోజుల క్రితం చైనా రాయబారి కలిశారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా గతంలోనూ ఆమె పలువురితో భేటీ అయ్యారు. రోడ్​ అండ్​ బెల్ట్ ఇన్షియేటివ్ ప్రాజెక్టులో భారీ పెట్టుబడులు పెట్టినప్పటి నుంచి నేపాల్​తో చైనా సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తోంది.

ఇదీ చూడండి: ఎన్​సీపీ ఛైర్మన్​ పదవి నుంచి ఓలి తొలగింపు

నేపాల్​ కమ్యూనిస్టు​ పార్టీ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​ పుష్ప కమల్​ దహల్​ (ప్రచండ)తో.. చైనా రాయబారి హౌ యాంకీ సమావేశమయ్యారు. ఖుమ్లతార్​లోని ప్రచండ నివాసంలో వీరి భేటి జరిగినట్లు అక్కడి మీడియా వర్గాలు ధ్రువీకరించాయి. ఇటీవల అధికార ఎన్​సీపీలో చీలిక ఏర్పడటం, ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి పార్లమెంట్​ను రద్దు చేసిన నేపథ్యంలో ప్రస్తుత సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

రాజకీయ సంక్షోభం తలెత్తిన నేపాల్​లో చైనా రాయబారి పర్యటన ఆసక్తికరంగా మారింది. అయితే నేపాల్​ అంతర్గత వ్యవహారాల్లో బీజింగ్​ తలదూర్చటం ఇదేమీ కొత్త కాదని అక్కడి విద్యార్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ భేటీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల కార్యకర్తలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. బీజింగ్​ రాయబార కార్యాలయం ముందు చైనా వ్యతిరేక నినాదాలు చేశారు.

తాజా రాజకీయ పరిణామాలపైనే ప్రస్తుత భేటీ జరిగినట్లు ప్రచండ వ్యక్తిగత కార్యదర్శి ఒకరు చెప్పారు.

నేపాల్​ రాష్ట్రపతి విద్యాదేవి భండారీని అధికార నివాసమైన శీతల్​ నివాస్​లో రెండు రోజుల క్రితం చైనా రాయబారి కలిశారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా గతంలోనూ ఆమె పలువురితో భేటీ అయ్యారు. రోడ్​ అండ్​ బెల్ట్ ఇన్షియేటివ్ ప్రాజెక్టులో భారీ పెట్టుబడులు పెట్టినప్పటి నుంచి నేపాల్​తో చైనా సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తోంది.

ఇదీ చూడండి: ఎన్​సీపీ ఛైర్మన్​ పదవి నుంచి ఓలి తొలగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.