వ్యక్తిగత సమాచారాన్ని చట్టవిరుద్ధంగా సేకరిస్తున్న 129 మొబైల్ యాప్లకు చైనా ఇంటర్నెట్ నియంత్రణ సంస్థ సైబర్స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నోటీసులు జారీ చేసింది. కొందరు యూజర్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు చేపట్టింది. సదరు అప్లికేషన్లు అందించే సేవలకు అవి అడిగే పర్మిషన్లకు పొంతన లేదని వినియోగదారులు ఫిర్యాదు చేసినట్లు స్థానిక వార్తా ఛానెళ్లు తెలిపాయి. కొన్ని యాప్లు అనుమతి లేకుండానే వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయని పేర్కొన్నాయి.
నోటీసులు అందుకున్న వాటిలో టిక్టాక్ మాతృసంస్థ బైట్డాన్స్కు చెందిన జిన్రి టౌటియావో, టెన్సెంట్కు చెందిన కువాయి బావో, టెన్సెంట్ న్యూస్, సగౌ న్యూస్, క్యుటౌటియాఓ వంటి యాప్లు ఉన్నాయి. 15 రోజుల్లోగా తమ సమాచార సేకరణ విధానాన్ని మార్చుకోవాలని సైబర్స్పేస్ అడ్మినిస్ట్రేషన్ 129 యాప్లను ఆదేశించింది.
మే నెలలో పలు యాప్లపై చర్యలు తీసుకుంది చైనా. సొగౌ ట్రాన్స్లేట్, బైడు మ్యాప్ సహా డజన్ల కొద్దీ యాప్లను యాప్ స్టోర్ నుంచి తొలగించింది.
ఇదీ చదవండి: గల్వాన్ హీరోను కీర్తిస్తూ చైనా దేశభక్తి రాగం!