అంతరిక్షంలో మరో కీలక ప్రయోగాన్ని చేపట్టింది చైనా. 2020లో అంగారకుడిపై పరిశోధనలు చేసేందుకు తొలి అడుగుగా ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన రాకెట్ను నింగిలోకి పంపింది.
దక్షిణ ద్వీపమైన హైనన్లోని వెన్చాంగ్ ప్రాంతం నుంచి అతి పెద్ద 'లాంగ్ మార్చ్ 5' రాకెట్ను ఈరోజు రాత్రి 8.45 గంటలకు ప్రయోగించింది డ్రాగన్ దేశం. అనంతరం 2 వేల సెకన్ల తర్వాత షిజియాన్ 20 ఉపగ్రహన్ని నిర్ణీత కక్షలోకి పంపినట్లు అధికారులు తెలిపారు.
మానవులతో కూడిన అంతరిక్ష కేంద్రం...
2022లో అంగారకుడిపై మానవులతో కూడిన అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది డ్రాగన్ దేశం. దీనికి సంబంధించిన కీలక అంశాలను తెలుసుకునేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది.
2017లో విఫలం...
చైనా 2017లో ఈ ప్రయోగాన్ని చేపట్టగా.. మధ్యలోనే విఫలమైంది.
ఇదీ చూడండి:ముస్లింలకు భరోసా ఇచ్చేందుకు ప్రత్యేక సదస్సు