ETV Bharat / international

చంద్రుడిపై పరిశోధన ప్రారంభించిన చైనా చాంగే-4

author img

By

Published : Jan 9, 2021, 8:30 AM IST

చంద్రుడిపై కీలక పరిశోధనలకు గాను చైనా పంపిన చాంగే ల్యాండర్​, రోవర్​లు పని చేయడం ప్రారంభించాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని అయిట్కెన్​ బేసిన్​లో పరిశోధనలు సాగనున్నాయి.

china lander and rover chang'e-4 started work on moon
చంద్రుడిపై పరిశోధన ప్రారంభించిన చైనా చాంగే-4

చంద్రుడి ఆవలి భాగంలో పరిశోధనలు సాగిస్తోన్న చైనా చాంగే-4 ల్యాండర్​, రోవర్​లు తాజాగా తమ పనిని పునఃప్రారంభించాయి. ఆ ప్రాంతంలో 14 రోజులు పగటి సమయం ఆరంభం కావడం వల్ల అవి నిద్రాణస్థితి నుంచి బయటకు వచ్చాయి. చాంగే-4 వ్యోమనౌక 2019 జనవరి 3న చంద్రుడి ఆవలి భాగంలోని దక్షిణ ధ్రువంలో దిగింది. అక్కడి అయిట్కెన్​ బేసిన్​లో పరిశోధనలు సాగిస్తోంది. 736 రోజుల పాటు దాని ప్రస్థానం కొనసాగింది.

ఆవలి భాగం ఎన్నడూ భూమి నుంచి కనిపించదు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3.13 గంటలకు ల్యాండర్​ క్రియాశీలమైంది. ఉదయం 10.29 గంటలకు యుతు-2 రోవర్​ పనిచేయడం ప్రారంభించింది. ఇది జాబిల్లి ఉపరితలంపై వాయువ్య దిశగా పయనించనుంది. గ్రహశకలాల ఢీ వల్ల ఏర్పడ్డ బసాల్ట్​ శిల ప్రాంతంలోకి వెళ్లనుంది. ఆ ప్రాంతాన్ని కెమెరాతో క్లిక్​మనిపిస్తుంది. పరారుణ ఇమేజింగ్​ స్పెక్ట్రోమీటర్​, న్యూట్రల్​ అటమ్​ డిటెక్టర్​, లూనార్​ రాడార్​ల సాయంతో శాస్త్రీయ పరిశోధనల సాగిస్తుంది. చంద్రుడిపై పగటి సమయం 14 రోజులు ఉంటుంది. అలాగే రాత్రివేళ అదే నిడిపిని కలిగి ఉంటుంది. ఈ లెక్కన చాంగే-4కు ఇది 26వ రోజు.

చంద్రుడి ఆవలి భాగంలో పరిశోధనలు సాగిస్తోన్న చైనా చాంగే-4 ల్యాండర్​, రోవర్​లు తాజాగా తమ పనిని పునఃప్రారంభించాయి. ఆ ప్రాంతంలో 14 రోజులు పగటి సమయం ఆరంభం కావడం వల్ల అవి నిద్రాణస్థితి నుంచి బయటకు వచ్చాయి. చాంగే-4 వ్యోమనౌక 2019 జనవరి 3న చంద్రుడి ఆవలి భాగంలోని దక్షిణ ధ్రువంలో దిగింది. అక్కడి అయిట్కెన్​ బేసిన్​లో పరిశోధనలు సాగిస్తోంది. 736 రోజుల పాటు దాని ప్రస్థానం కొనసాగింది.

ఆవలి భాగం ఎన్నడూ భూమి నుంచి కనిపించదు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3.13 గంటలకు ల్యాండర్​ క్రియాశీలమైంది. ఉదయం 10.29 గంటలకు యుతు-2 రోవర్​ పనిచేయడం ప్రారంభించింది. ఇది జాబిల్లి ఉపరితలంపై వాయువ్య దిశగా పయనించనుంది. గ్రహశకలాల ఢీ వల్ల ఏర్పడ్డ బసాల్ట్​ శిల ప్రాంతంలోకి వెళ్లనుంది. ఆ ప్రాంతాన్ని కెమెరాతో క్లిక్​మనిపిస్తుంది. పరారుణ ఇమేజింగ్​ స్పెక్ట్రోమీటర్​, న్యూట్రల్​ అటమ్​ డిటెక్టర్​, లూనార్​ రాడార్​ల సాయంతో శాస్త్రీయ పరిశోధనల సాగిస్తుంది. చంద్రుడిపై పగటి సమయం 14 రోజులు ఉంటుంది. అలాగే రాత్రివేళ అదే నిడిపిని కలిగి ఉంటుంది. ఈ లెక్కన చాంగే-4కు ఇది 26వ రోజు.

ఇదీ చూడండి: చందమామ నమూనాల బరువు 1,731 గ్రాములు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.