ETV Bharat / international

'కరోనాపై చైనా దొంగ లెక్కలు- ఇవిగో సాక్ష్యాలు!'

చైనా- వుహాన్​లో పుట్టిన కరోనా వైరస్​పై హాంకాంగ్​ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఫిబ్రవరి మధ్యనాటికే దేశంలో 2.32 లక్షల మందికి కొవిడ్​ సోకినట్లు అంచనా వేశారు. అయితే చైనా ఇందుకు భిన్నంగా నాలుగోవంతు కేసులను మాత్రమే వెల్లడించింది.

author img

By

Published : Apr 24, 2020, 9:50 AM IST

China could have had 2.32 lakh coronavirus cases by mid-February
ఫిబ్రవరి నాటికే చైనాలో 2.32 లక్షల కరోనా కేసులు!

గతేడాది డిసెంబర్​లో చైనాలో పుట్టిన కరోనా వైరస్​పై పరిశోధించిన అధ్యయనాలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. ఫిబ్రవరి మధ్య నాటికే ఆ దేశంలో సుమారు 2.32 లక్షల వైరస్​ కేసులు ఉన్నాయని తెలిపాయి. అయితే చైనా అధికారికంగా ప్రకటించిన దానికంటే ఈ సంఖ్య నాలుగు రెట్లు అధికం.

చైనాలో వైరస్​ కేసులను లెక్కించే ప్రమాణాలపై అధ్యయనం చేశామని హాంకాంగ్​ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పారు. దీన్నిబట్టి ఆ దేశంలో ఫిబ్రవరిలోనే 2,32,000 మందికి వైరస్​ సోకి ఉంటుందని అంచనా వేశామన్నారు.

ఒక్కసారిగా లెక్కలు మార్చిన చైనా..

చైనా జాతీయ ఆరోగ్య కమిషన్​ ప్రకటించిన అధికారిక గణాంకాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 82,798 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి 4,632 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్​ కేంద్రబిందువైన వుహాన్​లో మృతుల సంఖ్యను ఏప్రిల్​ 17న ఒక్కసారిగా 1,290కు పెంచింది చైనా. దీంతో నగరంలో మొత్తం మృతుల సంఖ్య 3,869కు చేరింది.

కొవిడ్​ కేసులను తక్కువగా ప్రకటిస్తూ, తప్పుడు సమాచారం ఇస్తోందని చైనాపై ఇప్పటికే అమెరికా, ఐరోపా దేశాలు గుర్రుగా ఉన్నాయి.

ఇదీ చదవండి: మిత్రుల ఇంట్లో భోజనం చేసిన మంత్రి సస్పెన్షన్​​!

గతేడాది డిసెంబర్​లో చైనాలో పుట్టిన కరోనా వైరస్​పై పరిశోధించిన అధ్యయనాలు ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. ఫిబ్రవరి మధ్య నాటికే ఆ దేశంలో సుమారు 2.32 లక్షల వైరస్​ కేసులు ఉన్నాయని తెలిపాయి. అయితే చైనా అధికారికంగా ప్రకటించిన దానికంటే ఈ సంఖ్య నాలుగు రెట్లు అధికం.

చైనాలో వైరస్​ కేసులను లెక్కించే ప్రమాణాలపై అధ్యయనం చేశామని హాంకాంగ్​ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పారు. దీన్నిబట్టి ఆ దేశంలో ఫిబ్రవరిలోనే 2,32,000 మందికి వైరస్​ సోకి ఉంటుందని అంచనా వేశామన్నారు.

ఒక్కసారిగా లెక్కలు మార్చిన చైనా..

చైనా జాతీయ ఆరోగ్య కమిషన్​ ప్రకటించిన అధికారిక గణాంకాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 82,798 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి 4,632 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్​ కేంద్రబిందువైన వుహాన్​లో మృతుల సంఖ్యను ఏప్రిల్​ 17న ఒక్కసారిగా 1,290కు పెంచింది చైనా. దీంతో నగరంలో మొత్తం మృతుల సంఖ్య 3,869కు చేరింది.

కొవిడ్​ కేసులను తక్కువగా ప్రకటిస్తూ, తప్పుడు సమాచారం ఇస్తోందని చైనాపై ఇప్పటికే అమెరికా, ఐరోపా దేశాలు గుర్రుగా ఉన్నాయి.

ఇదీ చదవండి: మిత్రుల ఇంట్లో భోజనం చేసిన మంత్రి సస్పెన్షన్​​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.