ETV Bharat / international

ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్​ భారత పర్యటన రద్దు

author img

By

Published : Jan 3, 2020, 9:40 PM IST

భారత పర్యటనను ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ రద్దు చేసుకున్నారు. స్వదేశంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోన్న నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు దౌత్యవర్గాలు తెలిపాయి.

Australian PM calls off India visit due to bush fires back home
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​ భారత్​ పర్యటన రద్దు

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్​ భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నెల 13 నుంచి నాలుగు రోజులపాటు ఆయన భారత్​లో పర్యటించి, ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపాల్సి ఉంది. అయితే స్వదేశంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోన్న నేపథ్యంలో ఆయన భారత పర్యటనను రద్దు చేసుకున్నట్లు దౌత్యవర్గాలు తెలిపాయి.

మోరిసన్ తన పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రిత్వశాఖ నిర్వహిస్తోన్న రైసిన్​ డైలాగ్​లో ప్రసంగించవలసి ఉంది. దీని తరువాత మోరిసన్ ముంబయి, బెంగళూరులను కూడా సందర్శించాలనుకున్నారు.

కార్చిచ్చు బీభత్సం

ఆస్ట్రేలియాలోని న్యూసౌత్​వేల్స్​, విక్టోరియా రాష్ట్రాల్లో దావానలం ఇంకా వ్యాపిస్తూనే ఉంది. ఇప్పటి వరకు మంటలకు చిక్కి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 500 ఇళ్లు దగ్ధమయ్యాయి. విక్టోరియాలోని మల్లకూట ప్రాంతంలో దాదాపు 3000 మంది పర్యటకులు సహా 4 వేల మంది చిక్కుకుపోయారు.

మోదీ పరామర్శ

ఇంతకు ముందు ప్రధాని మోదీ.. స్కాట్​ మోరిసన్​తో టెలిఫోన్​లో సంభాషించారు. కార్చిచ్చు వల్ల ఏర్పడిన భారీ ప్రాణ, ఆస్తి నష్టంపై భారతీయులందరి తరఫున సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి విపత్తును ధైర్యంగా ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా ప్రజలకు భారత్​ మద్దతుగా నిలుస్తుందని భారత విదేశాంగశాఖ కూడా ప్రకటించింది.

ఇదీ చూడండి: గగన్​యాన్​ వ్యోమగాముల కోసం డీఆర్​డీఓ ఆహారం!

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్​ భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నెల 13 నుంచి నాలుగు రోజులపాటు ఆయన భారత్​లో పర్యటించి, ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపాల్సి ఉంది. అయితే స్వదేశంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోన్న నేపథ్యంలో ఆయన భారత పర్యటనను రద్దు చేసుకున్నట్లు దౌత్యవర్గాలు తెలిపాయి.

మోరిసన్ తన పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రిత్వశాఖ నిర్వహిస్తోన్న రైసిన్​ డైలాగ్​లో ప్రసంగించవలసి ఉంది. దీని తరువాత మోరిసన్ ముంబయి, బెంగళూరులను కూడా సందర్శించాలనుకున్నారు.

కార్చిచ్చు బీభత్సం

ఆస్ట్రేలియాలోని న్యూసౌత్​వేల్స్​, విక్టోరియా రాష్ట్రాల్లో దావానలం ఇంకా వ్యాపిస్తూనే ఉంది. ఇప్పటి వరకు మంటలకు చిక్కి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 500 ఇళ్లు దగ్ధమయ్యాయి. విక్టోరియాలోని మల్లకూట ప్రాంతంలో దాదాపు 3000 మంది పర్యటకులు సహా 4 వేల మంది చిక్కుకుపోయారు.

మోదీ పరామర్శ

ఇంతకు ముందు ప్రధాని మోదీ.. స్కాట్​ మోరిసన్​తో టెలిఫోన్​లో సంభాషించారు. కార్చిచ్చు వల్ల ఏర్పడిన భారీ ప్రాణ, ఆస్తి నష్టంపై భారతీయులందరి తరఫున సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి విపత్తును ధైర్యంగా ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా ప్రజలకు భారత్​ మద్దతుగా నిలుస్తుందని భారత విదేశాంగశాఖ కూడా ప్రకటించింది.

ఇదీ చూడండి: గగన్​యాన్​ వ్యోమగాముల కోసం డీఆర్​డీఓ ఆహారం!

Jodhpur (Rajasthan), Jan 03 (ANI): While speaking to mediapersons on 'ICU where infants died due to lack of basic hygiene', Chief Minister Ashok Gehlot said that wherever you go, you will find some loopholes inside hospital. "Wherever you go in the state, some loopholes will be found inside hospital. Media and people have right to criticise, it makes government aware and government try to improve it," said CM Gehlot.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.