ETV Bharat / international

తాలిబన్లతో భారత్ చర్చలు- కీలక నేతతో భేటీ

author img

By

Published : Aug 31, 2021, 5:56 PM IST

Updated : Aug 31, 2021, 6:28 PM IST

taliban
తాలిబన్​- ఇండియా

17:53 August 31

తాలిబన్లతో భారత్ చర్చలు- కీలక నేతతో భేటీ

అఫ్గాన్​ సంక్షోభం నేపథ్యంలో మంగళవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఖతార్​లోని భారత రాయబారి దీపక్​ మిట్టల్​, తాలిబన్​ నేత షేర్​ మహమ్మద్​ అబ్బాస్​ స్టానెక్జాయ్​.. దోహా వేదికగా భేటీ అయ్యారు. భారత్​- తాలిబన్ల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగడం ఇదే తొలిసారి. అఫ్గాన్​ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తిగా ముగిసిన రోజే ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత్​పై ఉగ్రవాద కార్యకలాపాలు సాగించేవారికి అఫ్గాన్​ మద్దతివ్వకూడదని భేటీలో మిట్టల్​ తాలిబన్లకు తేల్చిచెప్పినట్టు విదేశాంగశాఖ వెల్లడించింది. భద్రత, అఫ్గాన్​లోని భారతీయుల తరలింపుపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు పేర్కొంది. వీటిపై తాలిబన్లు సానుకూలంగా స్పందించినట్టు స్పష్టం చేసింది.

మరికొన్ని రోజుల్లో తాలిబన్లు ప్రభుత్వాన్ని ప్రకటించనున్నారు. అఫ్గాన్​ను ఆర్థికంగా ముందుకు నడిపించాలంటే ప్రపంచ దేశాల సహకారం వారికి కావాల్సిందే. ఈ క్రమంలో పొరుగు దేశాలతో పాటు అంతర్జాతీయ సంఘం మద్దతు కూడగట్టేందుకు తాలిబన్లు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా.. భారత్​తో తాము స్నేహపూర్వక సంబంధాలే కోరుకుంటున్నట్టు ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యానించారు తాలిబన్​ నేతలు.

17:53 August 31

తాలిబన్లతో భారత్ చర్చలు- కీలక నేతతో భేటీ

అఫ్గాన్​ సంక్షోభం నేపథ్యంలో మంగళవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఖతార్​లోని భారత రాయబారి దీపక్​ మిట్టల్​, తాలిబన్​ నేత షేర్​ మహమ్మద్​ అబ్బాస్​ స్టానెక్జాయ్​.. దోహా వేదికగా భేటీ అయ్యారు. భారత్​- తాలిబన్ల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగడం ఇదే తొలిసారి. అఫ్గాన్​ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తిగా ముగిసిన రోజే ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత్​పై ఉగ్రవాద కార్యకలాపాలు సాగించేవారికి అఫ్గాన్​ మద్దతివ్వకూడదని భేటీలో మిట్టల్​ తాలిబన్లకు తేల్చిచెప్పినట్టు విదేశాంగశాఖ వెల్లడించింది. భద్రత, అఫ్గాన్​లోని భారతీయుల తరలింపుపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు పేర్కొంది. వీటిపై తాలిబన్లు సానుకూలంగా స్పందించినట్టు స్పష్టం చేసింది.

మరికొన్ని రోజుల్లో తాలిబన్లు ప్రభుత్వాన్ని ప్రకటించనున్నారు. అఫ్గాన్​ను ఆర్థికంగా ముందుకు నడిపించాలంటే ప్రపంచ దేశాల సహకారం వారికి కావాల్సిందే. ఈ క్రమంలో పొరుగు దేశాలతో పాటు అంతర్జాతీయ సంఘం మద్దతు కూడగట్టేందుకు తాలిబన్లు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా.. భారత్​తో తాము స్నేహపూర్వక సంబంధాలే కోరుకుంటున్నట్టు ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యానించారు తాలిబన్​ నేతలు.

Last Updated : Aug 31, 2021, 6:28 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.