ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 19,336 మందికి ఉరిశిక్ష అమలు - నిర్బయ ఉరిశిక్ష వాయిదా

ప్రపంచవ్యాప్తంగా 2018 వరకు అమలు చేసిన మరణశిక్ష వివరాలను విడుదల చేసింది అమెస్టీ ఇంటర్నేషనల్​ సంస్థ. మొత్తం 19,336 మందిపై ఉరిశిక్ష అమలు చేసినట్లు వెల్లడించింది సంస్థ.

690 executions globally in 2018, 142 countries abolished death penalty: Amnesty
ప్రపంచ వ్యాప్తంగా 19,336 మందికి ఉరిశిక్ష అమలు
author img

By

Published : Mar 21, 2020, 9:15 AM IST

భారత్​లో కలకలం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసు దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలైంది. ప్రపంచవ్యాప్తంగా 2018 వరకు మరణ దండన ఎదుర్కొన్న వారి సంఖ్యను వెల్లడించింది అమెస్టీ ఇంటర్నేషనల్​ సంస్థ. 2018 చివరి నాటికి అంతర్జాతీయంగా 19,336 మందిని ఉరితీసినట్లు తెలిపింది. ఒక్క 2018లోనే 690 మందికి మరణశిక్షను అమలు చేసినట్లు పేర్కొంది. ఈ మరణ దండనలను అమెరికా, చైనా, ఇరాన్​, సౌదీ, సింగపూర్​తో సహా మొత్తం 20 దేశాలు అమలు చేసినట్లు పేర్కొంది.

2018 చివరలో మొత్తం 148 దేశాలు మరణశిక్షను రద్దు చేసినట్లు తెలిపింది అమెస్టీ. అదే ఏడాది మరణశిక్షను క్షమాభిక్షగా మార్చిన 29 దేశాల్లో భారత్​ కూడా ఉందని వివరించింది.

2017లో అంతర్జాతీయంగా 993 మరణశిక్షలు అమలు చేసినట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం నివేదిక చెబుతోంది. ఆ ఏడాదితో పోలిస్తే 2018లో 31 శాతం తక్కువ మరణ శిక్షలు అమలైనట్లు అమెస్టీ పేర్కొంది. ఎక్కువగా చైనా, ఇరాన్​, సౌదీ అరేబియా, వియత్నం, ఇరాక్​ దేశాల్లోనే ఎక్కువ మరణశిక్షలు విధించినట్లు స్పష్టం చేసింది.

2018లో వియత్నంలో అత్యధికంగా 85 మరణశిక్షలు అమలు చేశారు. మొదటి ఐదు మరణ దండనలను ఇక్కడే జరిగనట్లు అమెస్టీ పేర్కొంది. అంతేకాకుండా ఇరాన్, సౌదీ అరేబియా, వియత్నం, ఇరాక్​ దేశాల్లో కలిసి 75 శాతం డెత్​ వారెంట్లను జారీ చేసినట్లు తెలిపింది.

సౌదీలో 2017లో 93 మరణశిక్షలు అమలు చేయగా.. 2018లో 136 మందిని ఉరి తీసినట్లు వివరించింది. పాకిస్థాన్​లో 2017లో 60 మరణ దండనలను అమలు చేయగా.. 2018లో 77 శాతం పడిపోయాయి.

ఇదీ చదవండి:ఉరికి ముందు తిహార్​ జైలు ఎస్పీకి నిర్భయ దోషి గిఫ్ట్!

భారత్​లో కలకలం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసు దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలైంది. ప్రపంచవ్యాప్తంగా 2018 వరకు మరణ దండన ఎదుర్కొన్న వారి సంఖ్యను వెల్లడించింది అమెస్టీ ఇంటర్నేషనల్​ సంస్థ. 2018 చివరి నాటికి అంతర్జాతీయంగా 19,336 మందిని ఉరితీసినట్లు తెలిపింది. ఒక్క 2018లోనే 690 మందికి మరణశిక్షను అమలు చేసినట్లు పేర్కొంది. ఈ మరణ దండనలను అమెరికా, చైనా, ఇరాన్​, సౌదీ, సింగపూర్​తో సహా మొత్తం 20 దేశాలు అమలు చేసినట్లు పేర్కొంది.

2018 చివరలో మొత్తం 148 దేశాలు మరణశిక్షను రద్దు చేసినట్లు తెలిపింది అమెస్టీ. అదే ఏడాది మరణశిక్షను క్షమాభిక్షగా మార్చిన 29 దేశాల్లో భారత్​ కూడా ఉందని వివరించింది.

2017లో అంతర్జాతీయంగా 993 మరణశిక్షలు అమలు చేసినట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం నివేదిక చెబుతోంది. ఆ ఏడాదితో పోలిస్తే 2018లో 31 శాతం తక్కువ మరణ శిక్షలు అమలైనట్లు అమెస్టీ పేర్కొంది. ఎక్కువగా చైనా, ఇరాన్​, సౌదీ అరేబియా, వియత్నం, ఇరాక్​ దేశాల్లోనే ఎక్కువ మరణశిక్షలు విధించినట్లు స్పష్టం చేసింది.

2018లో వియత్నంలో అత్యధికంగా 85 మరణశిక్షలు అమలు చేశారు. మొదటి ఐదు మరణ దండనలను ఇక్కడే జరిగనట్లు అమెస్టీ పేర్కొంది. అంతేకాకుండా ఇరాన్, సౌదీ అరేబియా, వియత్నం, ఇరాక్​ దేశాల్లో కలిసి 75 శాతం డెత్​ వారెంట్లను జారీ చేసినట్లు తెలిపింది.

సౌదీలో 2017లో 93 మరణశిక్షలు అమలు చేయగా.. 2018లో 136 మందిని ఉరి తీసినట్లు వివరించింది. పాకిస్థాన్​లో 2017లో 60 మరణ దండనలను అమలు చేయగా.. 2018లో 77 శాతం పడిపోయాయి.

ఇదీ చదవండి:ఉరికి ముందు తిహార్​ జైలు ఎస్పీకి నిర్భయ దోషి గిఫ్ట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.