ETV Bharat / international

టీకాల 'పేటెంట్ రద్దు'.. ఇంత వివాదం ఎందుకు?

author img

By

Published : May 7, 2021, 3:14 PM IST

అమెరికా ప్రభుత్వం.. కరోనా టీకాపై మేధో సంపత్తి హక్కులను రద్దు చేయడాన్ని భారత్​తో పాటు అనేక దేశాలు స్వాగతించాయి. అయితే అమెరికాలోని ఫార్మా సంస్థలు మాత్రం అగ్రరాజ్యం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పేద, అభివృద్ధి దేశాలకు టీకాలు అందాలంటే.. మేధో సంపత్తి హక్కులను రద్దు చేస్తే లాభం లేదని తేల్చిచెబుతున్నాయి. సంస్థలు ఇంతలా వ్యతిరేకించడానకి అసలు కారణాలేంటి?

Why patents on COVID vaccines are so contentious
మేథో హక్కుల రద్దు.. ఇంత వివాదాస్పదం ఎందుకు?

కరోనా టీకాపై మేధో సంపత్తి హక్కులను రద్దు చేస్తున్నట్టు అమెరికా ప్రకటించడం సర్వత్రా చర్చకు దారితీసింది. ఇది గొప్ప విషయమని, పేద దేశాలకు వ్యాక్సిన్లు చేరడానికి ఇది ఉపయోగపడుతుందని పలువురు నిపుణులు, సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ నిర్ణయాన్ని అమెరికాలోని ఫార్మా సంస్థలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. ఫలితంగా ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. దీని వల్ల గందరగోళం ఏర్పడటం తప్ప అసలు ఎలాంటి ఉపయోగం లేదన్నది ఔషధ సంస్థల వాదన. అసలు ఆయా సంస్థలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? అసలు ఈ 'పేటెంట్స్​' వ్యవహారమేంటి?

పేటెంట్స్​ ఎలా పనిచేస్తాయి?

ఓ కంపెనీ చేసే ఆవిష్కరణలను ఇతర కంపెనీలు కాపీ కొట్టకుండా చూసుకునేందుకు ఈ పేటెంట్స్​ ఉపయోగపడతాయి. అమెరికాలో ఫైల్​ చేసిన సమయం నుంచి ఔషధాలపై పేటెంట్స్​ 20ఏళ్లు ఉంటాయి.

సాధారణంగా.. ఔషధాలు ఆవిష్కరించిన వెంటనే పేటెంట్స్​కు దరఖాస్తు చేసుకుంటాయి కంపెనీలు. ఎందుకంటే.. ఔషధాలపై ప్రయోగాలు, ఆవిష్కరణ అనుమతుల వరకు ఒక్కోసారి దశాబ్ద కాలం కూడా గడిచిపోవచ్చు. అనంతరం పోటీ లేకుండా 12ఏళ్ల వరకు ఔషధాలను అమ్ముకోవడానికి వీలుంటుంది. అదే సమయంలో తమ ఉత్పత్తులను మెరుగుపరుచుకుని, వాటి వినియోగాన్ని విస్తృతం చేసేందుకు కంపెనీలు ఆసక్తిగా ఉంటాయి. ఇందుకు అదనపు హక్కులను కూడా సొంతం చేసుకుంటాయి.

ఇదీ చూడండి:- 'మేధో హక్కుల రద్దు'కు పెరుగుతున్న మద్దతు.. కానీ!

పేటెంట్​ ఉన్న వస్తువు తయారీదార్లకు ఎందుకంత ముఖ్యం?

ఔషధాలను అభివృద్ధి చేయడం భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. దీని వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ ఉంటుంది. ల్యాబ్​లలో జంతువులు, మనుషుల మీద ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో.. ఏదో ఒక దశలో ఔషధాలు విఫలమవుతూ ఉంటాయి. వాటిని సరిచేయాల్సి ఉంటుంది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే.. ఓ ఔషధం.. ఆవిష్కరణ దశ నుంచి నియంత్రణ సంస్థ అనుమతులు పొందేంత వరకు 1 బిలియన్​ డాలర్లకు మించిన వ్యయం అవుతుంది. ఇన్ని చేశాక పోటీదారుల నుంచి ఔషధ ఫార్ములాను కాపాడుకోవడం ముఖ్యం. అందుకే పేటెంట్​వైపు వెళతాయి సంస్థలు.

కొవిడ్​-19 వ్యాక్సిన్​పై మేధో సంపత్తి హక్కుల రద్దును అమెరికా ఎందుకు సమర్థిస్తోంది?

మేధో సంపత్తి హక్కుల రద్దుకు భారత్​, దక్షిణాఫ్రికా ప్రతిపాదించగా.. అనేక దేశాల నుంచి మద్దతు లభిస్తోంది. అదే సమయంలో.. ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్​ అందించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రస్థాయిలో ఉంది. కాంగ్రెస్​లోని అనేకమంది దౌత్యవేత్తలు ఈ విషయంపై పట్టుబడుతున్నారు.

మరి ఈ ప్రతిపాదనను గతంలో అమెరికా ఎందుకు వ్యతిరేకించింది?

పరిశోధనలు, ఆవిష్కరణల విషయంలో అమెరికా వంటి ధనిక దేశాల పాత్ర ఎక్కువ ఉంటుంది. ఔషధాల విషయంలో ఇది ఇంకా ఎక్కువ. ప్రతిష్ఠతో పాటు ఫార్మా సంస్థలు లక్షలాది ఉద్యోగాలను ఇస్తుంటాయి. జీతాలు కూడా ఎక్కువే ఉంటాయి. ఆదాయంపై పన్నులు చెల్లిస్తాయి. ప్రజల జీవితాలను కాపాడేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఔషధాలను తయారీ చేస్తూ ఉంటాయి. పేటెంట్స్​పై ప్రభుత్వాలు యాథతథ స్థితి కొనసాగించేందుకు.. ఔషధాల తయారీ సంస్థలు, వాటి వాణిజ్య బృందాలు.. మిలియన్లు ఖర్చుపెడుతూ ఉంటాయి. అందువల్ల అమెరికా వంటి దేశాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి.

ఇదీ చూడండి:- అమెరికా 'మేధో హక్కుల' నిర్ణయంపై భారత్ హర్షం

పరిశ్రమ వర్గాలు ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి?

దీనికి సమాధానం "డబ్బు." అమెరికాలో.. తమ మందులకు ఫార్మా సంస్థలు ధర ఎంతైనా నిర్ణయించవచ్చు. ఏడాదికి రెండుసార్లు ధరలను పెంచవచ్చు. ఫలితంగా.. ఔషధాలకు పేటెంట్​ రక్షణ ఉన్న సంవత్సరాల్లో.. వాటి ధరలు రెండింతలు, మూడింతలు కూడా అయ్యే అవకాశాలున్నాయి. ఫలితంగా కంపెనీలు లాభాలు పొందుతాయి.

అయితే పరిశోధనలపై భారీ మొత్తంలో వెచ్చించాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఎప్పటికప్పుడు డబ్బులు పోగు చేస్తూ ఉండాలి. వెంచర్​ క్యాపిటల్​ సంస్థలు, ఇతర పెట్టుబడిదారుల నుంచి ధనం తీసుకోవాలి. కొత్త ఔషధాలపై పేటెంట్స్​ లేవంటే.. పెట్టుబడిదారులను ఆకర్షించడం కష్టమవుతుంది.

కొవిడ్​ టీకాపై రక్షణను ఎత్తివేస్తే.. దాని ప్రభావం ఎలా ఉంటుంది?

దీనిపై సరైన స్పష్టత లేదు. అయితే.. ఇలా మేధో సంపత్తి హక్కులను రద్దు చేసినంత మాత్రాన.. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు టీకాలు త్వరగా అందుతాయి అని అనుకోవడం పొరపాటు అని అంటున్నాయి ఫార్మా సంస్థలు.

టీకా ఫార్ములను తయారీ సంస్థలు ఇస్తే సరిపోదని.. వాటిని రూపొందించే సామర్థ్యం కూడా ఉండాలని ఆయా సంస్థల వాదన. టీకా తయారీకి ప్రత్యేకమైన పరికరాలు, శిక్షణ తీసుకున్న ఉద్యోగులు వంటి అంశాలు ఉంటాయని చెబుతున్నాయి.

మరోవైపు టీకా తయారీకి కావాల్సిన ముడిసరకు కొరత ఉందని, పంపిణీ వ్యవస్థ కూడా బలహీనంగా ఉందని అనేక నెలల నుంచి ఫార్మా సంస్థలు చెబుతూనే ఉన్నాయి.

ఇదీ చూడండి:- 'భారత్​కు సాయపడటం అమెరికా నైతిక బాధ్యత'

కరోనా టీకాపై మేధో సంపత్తి హక్కులను రద్దు చేస్తున్నట్టు అమెరికా ప్రకటించడం సర్వత్రా చర్చకు దారితీసింది. ఇది గొప్ప విషయమని, పేద దేశాలకు వ్యాక్సిన్లు చేరడానికి ఇది ఉపయోగపడుతుందని పలువురు నిపుణులు, సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ నిర్ణయాన్ని అమెరికాలోని ఫార్మా సంస్థలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. ఫలితంగా ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. దీని వల్ల గందరగోళం ఏర్పడటం తప్ప అసలు ఎలాంటి ఉపయోగం లేదన్నది ఔషధ సంస్థల వాదన. అసలు ఆయా సంస్థలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? అసలు ఈ 'పేటెంట్స్​' వ్యవహారమేంటి?

పేటెంట్స్​ ఎలా పనిచేస్తాయి?

ఓ కంపెనీ చేసే ఆవిష్కరణలను ఇతర కంపెనీలు కాపీ కొట్టకుండా చూసుకునేందుకు ఈ పేటెంట్స్​ ఉపయోగపడతాయి. అమెరికాలో ఫైల్​ చేసిన సమయం నుంచి ఔషధాలపై పేటెంట్స్​ 20ఏళ్లు ఉంటాయి.

సాధారణంగా.. ఔషధాలు ఆవిష్కరించిన వెంటనే పేటెంట్స్​కు దరఖాస్తు చేసుకుంటాయి కంపెనీలు. ఎందుకంటే.. ఔషధాలపై ప్రయోగాలు, ఆవిష్కరణ అనుమతుల వరకు ఒక్కోసారి దశాబ్ద కాలం కూడా గడిచిపోవచ్చు. అనంతరం పోటీ లేకుండా 12ఏళ్ల వరకు ఔషధాలను అమ్ముకోవడానికి వీలుంటుంది. అదే సమయంలో తమ ఉత్పత్తులను మెరుగుపరుచుకుని, వాటి వినియోగాన్ని విస్తృతం చేసేందుకు కంపెనీలు ఆసక్తిగా ఉంటాయి. ఇందుకు అదనపు హక్కులను కూడా సొంతం చేసుకుంటాయి.

ఇదీ చూడండి:- 'మేధో హక్కుల రద్దు'కు పెరుగుతున్న మద్దతు.. కానీ!

పేటెంట్​ ఉన్న వస్తువు తయారీదార్లకు ఎందుకంత ముఖ్యం?

ఔషధాలను అభివృద్ధి చేయడం భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. దీని వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ ఉంటుంది. ల్యాబ్​లలో జంతువులు, మనుషుల మీద ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో.. ఏదో ఒక దశలో ఔషధాలు విఫలమవుతూ ఉంటాయి. వాటిని సరిచేయాల్సి ఉంటుంది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే.. ఓ ఔషధం.. ఆవిష్కరణ దశ నుంచి నియంత్రణ సంస్థ అనుమతులు పొందేంత వరకు 1 బిలియన్​ డాలర్లకు మించిన వ్యయం అవుతుంది. ఇన్ని చేశాక పోటీదారుల నుంచి ఔషధ ఫార్ములాను కాపాడుకోవడం ముఖ్యం. అందుకే పేటెంట్​వైపు వెళతాయి సంస్థలు.

కొవిడ్​-19 వ్యాక్సిన్​పై మేధో సంపత్తి హక్కుల రద్దును అమెరికా ఎందుకు సమర్థిస్తోంది?

మేధో సంపత్తి హక్కుల రద్దుకు భారత్​, దక్షిణాఫ్రికా ప్రతిపాదించగా.. అనేక దేశాల నుంచి మద్దతు లభిస్తోంది. అదే సమయంలో.. ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్​ అందించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రస్థాయిలో ఉంది. కాంగ్రెస్​లోని అనేకమంది దౌత్యవేత్తలు ఈ విషయంపై పట్టుబడుతున్నారు.

మరి ఈ ప్రతిపాదనను గతంలో అమెరికా ఎందుకు వ్యతిరేకించింది?

పరిశోధనలు, ఆవిష్కరణల విషయంలో అమెరికా వంటి ధనిక దేశాల పాత్ర ఎక్కువ ఉంటుంది. ఔషధాల విషయంలో ఇది ఇంకా ఎక్కువ. ప్రతిష్ఠతో పాటు ఫార్మా సంస్థలు లక్షలాది ఉద్యోగాలను ఇస్తుంటాయి. జీతాలు కూడా ఎక్కువే ఉంటాయి. ఆదాయంపై పన్నులు చెల్లిస్తాయి. ప్రజల జీవితాలను కాపాడేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఔషధాలను తయారీ చేస్తూ ఉంటాయి. పేటెంట్స్​పై ప్రభుత్వాలు యాథతథ స్థితి కొనసాగించేందుకు.. ఔషధాల తయారీ సంస్థలు, వాటి వాణిజ్య బృందాలు.. మిలియన్లు ఖర్చుపెడుతూ ఉంటాయి. అందువల్ల అమెరికా వంటి దేశాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి.

ఇదీ చూడండి:- అమెరికా 'మేధో హక్కుల' నిర్ణయంపై భారత్ హర్షం

పరిశ్రమ వర్గాలు ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి?

దీనికి సమాధానం "డబ్బు." అమెరికాలో.. తమ మందులకు ఫార్మా సంస్థలు ధర ఎంతైనా నిర్ణయించవచ్చు. ఏడాదికి రెండుసార్లు ధరలను పెంచవచ్చు. ఫలితంగా.. ఔషధాలకు పేటెంట్​ రక్షణ ఉన్న సంవత్సరాల్లో.. వాటి ధరలు రెండింతలు, మూడింతలు కూడా అయ్యే అవకాశాలున్నాయి. ఫలితంగా కంపెనీలు లాభాలు పొందుతాయి.

అయితే పరిశోధనలపై భారీ మొత్తంలో వెచ్చించాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఎప్పటికప్పుడు డబ్బులు పోగు చేస్తూ ఉండాలి. వెంచర్​ క్యాపిటల్​ సంస్థలు, ఇతర పెట్టుబడిదారుల నుంచి ధనం తీసుకోవాలి. కొత్త ఔషధాలపై పేటెంట్స్​ లేవంటే.. పెట్టుబడిదారులను ఆకర్షించడం కష్టమవుతుంది.

కొవిడ్​ టీకాపై రక్షణను ఎత్తివేస్తే.. దాని ప్రభావం ఎలా ఉంటుంది?

దీనిపై సరైన స్పష్టత లేదు. అయితే.. ఇలా మేధో సంపత్తి హక్కులను రద్దు చేసినంత మాత్రాన.. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు టీకాలు త్వరగా అందుతాయి అని అనుకోవడం పొరపాటు అని అంటున్నాయి ఫార్మా సంస్థలు.

టీకా ఫార్ములను తయారీ సంస్థలు ఇస్తే సరిపోదని.. వాటిని రూపొందించే సామర్థ్యం కూడా ఉండాలని ఆయా సంస్థల వాదన. టీకా తయారీకి ప్రత్యేకమైన పరికరాలు, శిక్షణ తీసుకున్న ఉద్యోగులు వంటి అంశాలు ఉంటాయని చెబుతున్నాయి.

మరోవైపు టీకా తయారీకి కావాల్సిన ముడిసరకు కొరత ఉందని, పంపిణీ వ్యవస్థ కూడా బలహీనంగా ఉందని అనేక నెలల నుంచి ఫార్మా సంస్థలు చెబుతూనే ఉన్నాయి.

ఇదీ చూడండి:- 'భారత్​కు సాయపడటం అమెరికా నైతిక బాధ్యత'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.