ETV Bharat / international

చైనా బాధ్యత వహించాల్సిందే: అమెరికా

author img

By

Published : Feb 6, 2021, 9:59 PM IST

చైనా వైఖరిపై అమెరికా విదేశాంగ మంత్రి టోనీ బ్లింకన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా చేపట్టిన దుశ్చర్యలకు ఆ దేశం బాధ్యత వహించాలన్నారు. ఈ విషయంపై అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.

us hold talks, china
బ్లింకన్ కౌంటర్

అంతర్జాతీయ వ్యవస్థను ఇబ్బందికి గురిచేసిన చైనా దుశ్చర్యలకు ఆ దేశం బాధ్యత వహించాల్సిందేనని అమెరికా విదేశాంగ మంత్రి టోనీ బ్లింకన్ పేర్కొన్నారు. చైనా విదేశాంగ మంత్రి యాంగ్​ జైచీతో ఫోన్​ ద్వారా శనివారం జరిగిన చర్చల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణకు అమెరికా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. షింజాంగ్​, టిబెట్​, హాంకాంగ్​లలో చేపట్టిన దుశ్చర్యలకు చైనా బాధ్యత వహించాలన్నారు. మయన్మార్​లో సైనిక తిరుగుబాటును చైనా కచ్చితంగా ఖండించాలన్నారు. ఈ విషయంపై అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.

చైనా​ను కట్టడి చేసేందుకు..

చైనా దుశ్చర్యలను కట్టడి చేసేందుకు అమెరికా తన భాగస్వాములతో కలిసి కృషి చేస్తుందని బ్లింకన్ స్పష్టం చేసినట్లు ఆ ప్రకటన పేర్కొంది. హద్దు మీర వద్దంటూ కొద్ది రోజుల క్రితం చైనా విదేశాంగ మంత్రి యాంగ్​జైచీ అమెరికాను హెచ్చరించారు. మానవ హక్కులు, హాంకాంగ్​, తైవాన్​, కరోనా, షింజాంగ్, టిబెట్​ అంశాలు చైనా సార్వభౌమత్వానికి, ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయాలని తెలిపారు. ఇప్పుడు బదలుగా బ్లింకన్​ ఇవే అంశాలపైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి : చైనా మొండి వైఖరిపై నేపాల్ వ్యాపారుల ఆందోళన

అంతర్జాతీయ వ్యవస్థను ఇబ్బందికి గురిచేసిన చైనా దుశ్చర్యలకు ఆ దేశం బాధ్యత వహించాల్సిందేనని అమెరికా విదేశాంగ మంత్రి టోనీ బ్లింకన్ పేర్కొన్నారు. చైనా విదేశాంగ మంత్రి యాంగ్​ జైచీతో ఫోన్​ ద్వారా శనివారం జరిగిన చర్చల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణకు అమెరికా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. షింజాంగ్​, టిబెట్​, హాంకాంగ్​లలో చేపట్టిన దుశ్చర్యలకు చైనా బాధ్యత వహించాలన్నారు. మయన్మార్​లో సైనిక తిరుగుబాటును చైనా కచ్చితంగా ఖండించాలన్నారు. ఈ విషయంపై అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.

చైనా​ను కట్టడి చేసేందుకు..

చైనా దుశ్చర్యలను కట్టడి చేసేందుకు అమెరికా తన భాగస్వాములతో కలిసి కృషి చేస్తుందని బ్లింకన్ స్పష్టం చేసినట్లు ఆ ప్రకటన పేర్కొంది. హద్దు మీర వద్దంటూ కొద్ది రోజుల క్రితం చైనా విదేశాంగ మంత్రి యాంగ్​జైచీ అమెరికాను హెచ్చరించారు. మానవ హక్కులు, హాంకాంగ్​, తైవాన్​, కరోనా, షింజాంగ్, టిబెట్​ అంశాలు చైనా సార్వభౌమత్వానికి, ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయాలని తెలిపారు. ఇప్పుడు బదలుగా బ్లింకన్​ ఇవే అంశాలపైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి : చైనా మొండి వైఖరిపై నేపాల్ వ్యాపారుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.