ETV Bharat / international

అమెరికా ఎన్నికల్లో 'ఏపీ ఓట్​కాస్ట్​ ' అంచనాలు నిజమయ్యేనా?

author img

By

Published : Oct 19, 2020, 12:48 PM IST

ఎన్నికలు అనగానే... ప్రచారం, పోలింగ్, ఫలితాలతో పాటు తప్పనిసరిగా విపించేమాట 'ఎగ్జిట్​ పోల్స్​'. భారత్​లో విస్తృతంగా చేపట్టే... ఈ ప్రజాభిప్రాయ సేకరణ అగ్రరాజ్యం అమెరికా​ అధ్యక్ష ఎన్నికల్లో మరింత కీలక పాత్ర పోషిస్తుంది. మారిన పరిస్థితుల దృష్ట్యా ఓటర్ల మనోగతాన్ని తెలుసుకునేందుకు అమెరికన్​ న్యూస్ ఏజెన్సీ అసోసియేటెడ్​ ప్రెస్ (ఏపీ) తీసుకొచ్చిన కొత్త విధానం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అదేంటి? దాన్ని ఎవరు రూపొందిచారు? ఓటర్ల అభిప్రాయాలను ఎలా అంచనా వేస్తారు?

Exit polls
అధ్యక్ష పోరు: అమెరికా ఎన్నికల్లో 'ఎగ్జిట్​ పోల్స్​' ఎలా చేపడతారు ?

ఎన్నికల సమయంలో ఏళ్లుగా టెలివిజన్​ నెట్​వర్క్​లు ఎగ్జిట్​ పోల్స్​ ద్వారా.. ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతు, విజయావకాశాలు, ప్రజలు ఎందుకు ఓట్లేశారు.. అన్న అంశాలు తెలిజేసేవి. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో వీటి పాత్ర కీలకంగా ఉంటుంది.

అయితే, ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల దృష్ట్యా.. ఓటేసే విధానం మారింది. ముఖ్యంగా 2016 అధ్యక్ష ఎన్నికల్లో 10మందిలో నలుగురు అమెరికన్లు.. ఎలక్షన్​ డేకు ముందే తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎక్కువగా మెయిల్​ రూపంలోనో.. లేదంటే పోలింగ్ కేంద్రాల వద్దనో ఓటింగ్​లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సాధ్యం కాదు. మారిన పరిస్థితుల దృష్ట్యా కచ్చితమైన అంచనాలను తెలియజెప్పేందుకు అమెరికన్​ న్యూస్ ఏజెన్సీ అసోసియేటెడ్​ ప్రెస్ (ఏపీ) కొత్త విధానం తీసుకొచ్చింది. అదే ఏపీ ఓట్​కాస్ట్​' కార్యక్రమం.

రూపకల్పన ఎప్పుడు..

2018లో స్వతంత్ర పరిశోధనా సంస్థ ఎన్​ఓఆర్​సీ, షికాగో విశ్వవిద్యాలయంతో సంయుక్తంగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఇది సంప్రదాయ అభిప్రాయ సేకరణకు భిన్నంగా.. ఈరోజు అమెరికన్లు ఎలా ఓటు వేస్తారో ప్రతిబింబించేలా కచ్చితమైన విధానంగా అభివర్ణిస్తున్నారు. ముందస్తు పోలింగ్, మెయిల్​ ఓటర్ల అభిప్రాయాలు కూడా సేకరిస్తుంది.

ఆ ఎన్నికల్లో సత్ఫలితాలు..

2018లో జరిగిన సెనేట్​, గవర్నర్ ఎన్నికల్లో విజయవంతగా ఓట్​కాస్ట్​ విధానం పనిచేసింది. ఎలక్షన్​ డేకు ముందే ఓట్లేసిన వారి అభిప్రాయాలు సైతం సేకరించగలిగారు. అనంతరం​ సర్వే నమూనా.. యూఎస్​ సెన్సస్ బ్యూరో నెలల తరువాత విడుదల చేసిన చేసిన జనాభా లెక్కలతో సరిపోలింది.

సర్వే ఇలా..

ఈ ఓట్​కాస్ట్​లో మెయిల్​, ఆన్​లైన్ సర్వేలు, ఫోన్​ కాల్స్​ ద్వారా అమెరికన్ల అభిప్రాయాలు సేకరిస్తారు. నమోదు చేసుకున్న ఓటర్లందరి అభిప్రాయాలు తీసుకుంటుంది. మొత్తం 50 రాష్ట్రాల్లో - ఓటు వేయకూడదని నిర్ణయించుకునే వారి అభిప్రాయాలు సైతం లెక్కగడుతుంది.

ఈ తరహా లోతైన విశ్లేషణ వివిధ వర్గాలు, విభిన్న ప్రాంతాల్లోని ఓటర్ల మనోగతం తెలియజేస్తుంది. కీలకమైన అంశాల్లో పూర్తిస్థాయి అవగాహన రావటానికి తోడ్పడుతుంది.

ప్రస్తుతం ఏపీ ఓట్​కాస్ట్​ ఎలక్షన్​ డే (నవంబర్​ 3)కు ముందే.. అమెరికాలోని 50రాష్ట్రాల్లో 1,40,000 ఇంటర్వూలు చేపట్టారని నిర్ణయించింది. అయితే, ఎన్నికల్లో విజేత ఎవరవుతారో వెల్లడించాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మొత్తంగా ఏపీ ఓట్​కాస్ట్​ విధానం.. అమెరికన్ ఓటర్ల అభిప్రాయమేంటో తెలుసుకోవటంలో కీలకంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదీ చూడండి: భారీ రెడ్‌ వేవ్ సమీపిస్తోంది: ట్రంప్‌

ఇదీ చూడండి: రంగంలోకి ఒబామా- జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం

ఎన్నికల సమయంలో ఏళ్లుగా టెలివిజన్​ నెట్​వర్క్​లు ఎగ్జిట్​ పోల్స్​ ద్వారా.. ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతు, విజయావకాశాలు, ప్రజలు ఎందుకు ఓట్లేశారు.. అన్న అంశాలు తెలిజేసేవి. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో వీటి పాత్ర కీలకంగా ఉంటుంది.

అయితే, ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల దృష్ట్యా.. ఓటేసే విధానం మారింది. ముఖ్యంగా 2016 అధ్యక్ష ఎన్నికల్లో 10మందిలో నలుగురు అమెరికన్లు.. ఎలక్షన్​ డేకు ముందే తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎక్కువగా మెయిల్​ రూపంలోనో.. లేదంటే పోలింగ్ కేంద్రాల వద్దనో ఓటింగ్​లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సాధ్యం కాదు. మారిన పరిస్థితుల దృష్ట్యా కచ్చితమైన అంచనాలను తెలియజెప్పేందుకు అమెరికన్​ న్యూస్ ఏజెన్సీ అసోసియేటెడ్​ ప్రెస్ (ఏపీ) కొత్త విధానం తీసుకొచ్చింది. అదే ఏపీ ఓట్​కాస్ట్​' కార్యక్రమం.

రూపకల్పన ఎప్పుడు..

2018లో స్వతంత్ర పరిశోధనా సంస్థ ఎన్​ఓఆర్​సీ, షికాగో విశ్వవిద్యాలయంతో సంయుక్తంగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఇది సంప్రదాయ అభిప్రాయ సేకరణకు భిన్నంగా.. ఈరోజు అమెరికన్లు ఎలా ఓటు వేస్తారో ప్రతిబింబించేలా కచ్చితమైన విధానంగా అభివర్ణిస్తున్నారు. ముందస్తు పోలింగ్, మెయిల్​ ఓటర్ల అభిప్రాయాలు కూడా సేకరిస్తుంది.

ఆ ఎన్నికల్లో సత్ఫలితాలు..

2018లో జరిగిన సెనేట్​, గవర్నర్ ఎన్నికల్లో విజయవంతగా ఓట్​కాస్ట్​ విధానం పనిచేసింది. ఎలక్షన్​ డేకు ముందే ఓట్లేసిన వారి అభిప్రాయాలు సైతం సేకరించగలిగారు. అనంతరం​ సర్వే నమూనా.. యూఎస్​ సెన్సస్ బ్యూరో నెలల తరువాత విడుదల చేసిన చేసిన జనాభా లెక్కలతో సరిపోలింది.

సర్వే ఇలా..

ఈ ఓట్​కాస్ట్​లో మెయిల్​, ఆన్​లైన్ సర్వేలు, ఫోన్​ కాల్స్​ ద్వారా అమెరికన్ల అభిప్రాయాలు సేకరిస్తారు. నమోదు చేసుకున్న ఓటర్లందరి అభిప్రాయాలు తీసుకుంటుంది. మొత్తం 50 రాష్ట్రాల్లో - ఓటు వేయకూడదని నిర్ణయించుకునే వారి అభిప్రాయాలు సైతం లెక్కగడుతుంది.

ఈ తరహా లోతైన విశ్లేషణ వివిధ వర్గాలు, విభిన్న ప్రాంతాల్లోని ఓటర్ల మనోగతం తెలియజేస్తుంది. కీలకమైన అంశాల్లో పూర్తిస్థాయి అవగాహన రావటానికి తోడ్పడుతుంది.

ప్రస్తుతం ఏపీ ఓట్​కాస్ట్​ ఎలక్షన్​ డే (నవంబర్​ 3)కు ముందే.. అమెరికాలోని 50రాష్ట్రాల్లో 1,40,000 ఇంటర్వూలు చేపట్టారని నిర్ణయించింది. అయితే, ఎన్నికల్లో విజేత ఎవరవుతారో వెల్లడించాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మొత్తంగా ఏపీ ఓట్​కాస్ట్​ విధానం.. అమెరికన్ ఓటర్ల అభిప్రాయమేంటో తెలుసుకోవటంలో కీలకంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదీ చూడండి: భారీ రెడ్‌ వేవ్ సమీపిస్తోంది: ట్రంప్‌

ఇదీ చూడండి: రంగంలోకి ఒబామా- జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.