ETV Bharat / international

విమానం ఆలస్యమైందని 3 లక్షల డాలర్ల జరిమానా

జపాన్​ ఎయిర్​లైన్స్ సంస్థకు అమెరికా ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. ఈ ఏడాది జనవరి, మే నెలల్లో రెండు విమానాలు ఆలస్యంగా నడిపి.. ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసిన కారణంగా 3 లక్షల డాలర్ల జరిమానా వేసింది అగ్రరాజ్యం.

author img

By

Published : Sep 14, 2019, 11:45 AM IST

Updated : Sep 30, 2019, 1:45 PM IST

జాప్యం కారణంగా జపాన్​ ఎయిర్​లైన్స్​కు భారీ ఫైన్!

జపాన్​కు చెందిన ఓ విమాన సంస్థకు 3 లక్షల డాలర్ల భారీ జరిమానా విధించింది అమెరికా. విమానాల ఆలస్యంతో పాటు.. అందులో ఉన్న ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేసిందనే కారణాలతో జపాన్​ ఎయిర్​లైన్స్​ సంస్థకు ఈ భారీ జరిమానా వేసినట్లు తెలిపింది.

రవాణా శాఖతో జరిగిన ఒప్పందం ప్రకారం.. ఇబ్బందులకు గురైన ప్రయాణీకులకు పరిహారం కింద 60,000 డాలర్లను చెల్లించాలి. ఏడాది పాటు ఆ సంస్థ విమానాలు జాప్యం లేకుండా నడిస్తే.. లక్షా 20 వేల డాలర్ల జరిమానా మాఫీ అవుతుంది.

ఆలస్యం ఎందుకు...

జనవరి 4న టోక్యో నుంచి న్యూయార్క్ బయల్దేరిన జపాన్​ ఎయిర్​లైన్స్ విమానం.. వాతావరణం సహకరించక చికాగోలో అర్ధంతరంగా దిగింది. విమానం దిగిన నాలుగు గంటల తర్వాత సిబ్బంది సేవలు నిలిపివేశారు. ఈ కారణంగా ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది.

మే 15న టోక్యో నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన అదే సంస్థకు చెందిన మరో విమానం.. డాలస్ ఎయిర్​పోర్ట్​కు దారిమళ్లించి ల్యాండ్​ చేశారు. దాదాపు ఐదు గంటల పాటు ప్రయాణీకులు విమానంలో చిక్కుకున్నారు. ఇంధనం నింపుకోవడం, సిబ్బంది విధులు ముగించుకునే సమయం దగ్గరపడటం కారణంగా విమానం టేకాఫ్​లో జాప్యం జరిగింది. ఈ రెండు సందర్భాల్లో వాతావరణం ప్రతికూలంగా ఉందని జపాన్ ఎయిర్​లైన్స్ తెలిపింది.

ఇదీ చూడండి: 'గూగుల్ ఎర్త్'​తో 22 ఏళ్ల మిస్టరీ వీడిందిలా!

జపాన్​కు చెందిన ఓ విమాన సంస్థకు 3 లక్షల డాలర్ల భారీ జరిమానా విధించింది అమెరికా. విమానాల ఆలస్యంతో పాటు.. అందులో ఉన్న ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేసిందనే కారణాలతో జపాన్​ ఎయిర్​లైన్స్​ సంస్థకు ఈ భారీ జరిమానా వేసినట్లు తెలిపింది.

రవాణా శాఖతో జరిగిన ఒప్పందం ప్రకారం.. ఇబ్బందులకు గురైన ప్రయాణీకులకు పరిహారం కింద 60,000 డాలర్లను చెల్లించాలి. ఏడాది పాటు ఆ సంస్థ విమానాలు జాప్యం లేకుండా నడిస్తే.. లక్షా 20 వేల డాలర్ల జరిమానా మాఫీ అవుతుంది.

ఆలస్యం ఎందుకు...

జనవరి 4న టోక్యో నుంచి న్యూయార్క్ బయల్దేరిన జపాన్​ ఎయిర్​లైన్స్ విమానం.. వాతావరణం సహకరించక చికాగోలో అర్ధంతరంగా దిగింది. విమానం దిగిన నాలుగు గంటల తర్వాత సిబ్బంది సేవలు నిలిపివేశారు. ఈ కారణంగా ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది.

మే 15న టోక్యో నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన అదే సంస్థకు చెందిన మరో విమానం.. డాలస్ ఎయిర్​పోర్ట్​కు దారిమళ్లించి ల్యాండ్​ చేశారు. దాదాపు ఐదు గంటల పాటు ప్రయాణీకులు విమానంలో చిక్కుకున్నారు. ఇంధనం నింపుకోవడం, సిబ్బంది విధులు ముగించుకునే సమయం దగ్గరపడటం కారణంగా విమానం టేకాఫ్​లో జాప్యం జరిగింది. ఈ రెండు సందర్భాల్లో వాతావరణం ప్రతికూలంగా ఉందని జపాన్ ఎయిర్​లైన్స్ తెలిపింది.

ఇదీ చూడండి: 'గూగుల్ ఎర్త్'​తో 22 ఏళ్ల మిస్టరీ వీడిందిలా!

Chandigarh, Sep 14 (ANI): While addressing a press conference in Chandigarh on September 13, Minister of State (MoS) for Social Justice and Empowerment Ramdas Athawale said, "If Pakistan wants good for itself, it should hand over Pakistan occupied Kashmir (PoK) to us. If they don't want a war and Imran Khan thinks of Pakistan's interest then he should hand over PoK to us." "Reports are coming in that people in PoK don't want to be with Pakistan and want to join India. Since 70 years Pakistan has had one third of our Kashmir captured. It is a serious matter," Athawale added.
Last Updated : Sep 30, 2019, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.