ETV Bharat / international

అణు పరీక్షల వైపు ట్రంప్ అడుగులు.. చైనా కోసమేనా!

అగ్రరాజ్యం మళ్లీ అణు పరీక్షలు నిర్వహించనుందా? అంటే అమెరికాకు చెందిన ఓ ప్రముఖ పత్రిక అవునంటోంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఓ వార్తనూ రాసింది. రక్షణ విభాగంలోని ప్రస్తుత సీనియర్ అధికారి.. ఇటీవల ఇద్దరు మాజీ అధికారులతో అణు పరీక్షలపై చర్చించినట్లు తెలుస్తోంది. రష్యా, చైనాకు చెక్​ పెట్టేందుకు ట్రంప్​ సర్కార్​ ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

author img

By

Published : May 23, 2020, 8:56 PM IST

Updated : May 24, 2020, 12:17 PM IST

US-NUCLEAR TEST-REPORT
అణు పరీక్షల కోసం ట్రంప్ ప్రయత్నాలు

అణు పరీక్షల నిర్వహణకు సంబంధించి దశాబ్దాల తర్వాత అమెరికా తొలిసారి చర్చించింది. రష్యా, చైనాకు సరైన హెచ్చరిక పంపించేందుకు 1992 తర్వాత అణు పరీక్షల చేసేందుకు సిద్ధమౌతోందట! ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం సమాలోచనలు జరిపిందని వాషింగ్టన్​ పోస్ట్ నివేదించింది.

పోస్ట్ కథనం ప్రకారం..

అమెరికాకు చెందిన ఇద్దరు మాజీ అధికారులతో సీనియర్​ అధికారి మే 15న భేటీ అయినట్లు సమాచారం. ఈ సమావేశంలోనే అణు పరీక్షల నిర్వహణపై చర్చించినట్లు తెలుస్తోంది.

అమెరికా రక్షణ విభాగం నుంచి ఇటువంటి విధానాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఇదే కొనసాగితే అణ్వాయుధాల పోటీకి మళ్లీ ఆజ్యం పోసినట్లవుతుందని హెచ్చరిస్తున్నారు.

ఒప్పందం కోసమేనా..!

ఈ మధ్య కాలంలో రష్యా, చైనా సైతం ఎక్కువ స్థాయిలో అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని అమెరికా ఆరోపించింది. ఇందుకు సంబంధించి అమెరికా ఆధారాలేవీ చూపించలేదు. అయితే ఈ ఆరోపణలను రష్యా, చైనా కొట్టిపారేశాయి. ఆ రెండు దేశాలు అణు పరీక్షల విషయంలో వెనక్కితగ్గట్లేదని భావించిన ట్రంప్​.. తామూ పరీక్షలు చేద్దామని చర్చించడం చర్చనీయాంశమైంది.

అణ్వాయుధాల నియంత్రణకు సంబంధించి చైనా, రష్యాతో త్రైపాక్షిక ఒప్పందం కోరాలని భావిస్తోంది అగ్రరాజ్యం. ఇందుకోసం ర్యాపిడ్​ టెస్టులను నిర్వహించి.. చర్చలకు తెరలేపే వ్యూహాన్ని అమలు చేసే సామర్థ్యం అమెరికాకు ఉందని ఓ సీనియర్ అధికారి చెప్పారు. అయితే ఆ ఉపాయాన్ని ఎన్​పీటీ కార్యకర్తలు తిరస్కరిస్తున్నారు. ఈ విషయంలో ఈ మూడు దేశాల మధ్య విస్తృత చర్చలు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అణు పరీక్షల నిర్వహణకు సంబంధించి దశాబ్దాల తర్వాత అమెరికా తొలిసారి చర్చించింది. రష్యా, చైనాకు సరైన హెచ్చరిక పంపించేందుకు 1992 తర్వాత అణు పరీక్షల చేసేందుకు సిద్ధమౌతోందట! ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం సమాలోచనలు జరిపిందని వాషింగ్టన్​ పోస్ట్ నివేదించింది.

పోస్ట్ కథనం ప్రకారం..

అమెరికాకు చెందిన ఇద్దరు మాజీ అధికారులతో సీనియర్​ అధికారి మే 15న భేటీ అయినట్లు సమాచారం. ఈ సమావేశంలోనే అణు పరీక్షల నిర్వహణపై చర్చించినట్లు తెలుస్తోంది.

అమెరికా రక్షణ విభాగం నుంచి ఇటువంటి విధానాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఇదే కొనసాగితే అణ్వాయుధాల పోటీకి మళ్లీ ఆజ్యం పోసినట్లవుతుందని హెచ్చరిస్తున్నారు.

ఒప్పందం కోసమేనా..!

ఈ మధ్య కాలంలో రష్యా, చైనా సైతం ఎక్కువ స్థాయిలో అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని అమెరికా ఆరోపించింది. ఇందుకు సంబంధించి అమెరికా ఆధారాలేవీ చూపించలేదు. అయితే ఈ ఆరోపణలను రష్యా, చైనా కొట్టిపారేశాయి. ఆ రెండు దేశాలు అణు పరీక్షల విషయంలో వెనక్కితగ్గట్లేదని భావించిన ట్రంప్​.. తామూ పరీక్షలు చేద్దామని చర్చించడం చర్చనీయాంశమైంది.

అణ్వాయుధాల నియంత్రణకు సంబంధించి చైనా, రష్యాతో త్రైపాక్షిక ఒప్పందం కోరాలని భావిస్తోంది అగ్రరాజ్యం. ఇందుకోసం ర్యాపిడ్​ టెస్టులను నిర్వహించి.. చర్చలకు తెరలేపే వ్యూహాన్ని అమలు చేసే సామర్థ్యం అమెరికాకు ఉందని ఓ సీనియర్ అధికారి చెప్పారు. అయితే ఆ ఉపాయాన్ని ఎన్​పీటీ కార్యకర్తలు తిరస్కరిస్తున్నారు. ఈ విషయంలో ఈ మూడు దేశాల మధ్య విస్తృత చర్చలు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Last Updated : May 24, 2020, 12:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.