ETV Bharat / international

చర్చలు కొలిక్కా... లేక మళ్లీ మొదటికా!

అమెరికా - చైనా మధ్య  మరోసారి మాటల తూటాలు పేలుతున్నాయి. ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. చైనా ఉత్పత్తులపై సుంకాలు పెంచితే ప్రతిచర్యలతో తిప్పికొడతామని చైనా హెచ్చరించింది. రెండు అగ్రదేశాల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్నాయి.

author img

By

Published : May 10, 2019, 11:28 AM IST

చర్చలు కొలిక్కా... లేక మళ్లీ మొదటికా!

అమెరికా-చైనా ప్రతినిధులు మధ్య వాషింగ్టన్​లో గురువారం మరోసారి వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిగాయి. దాదాపు 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తుల మీద 25 శాతం వరకు సుంకాలను శుక్రవారం నుంచి పెంచుతామని ట్రంప్ ఇప్పటికే స్పష్టంచేశారు. సుంకాలు పెంచే ముందు రోజే ఇరు దేశాధికారులు చర్చలు జరిపారు.

ఈ చర్చలు ప్రారంభం కావటానికి ముందు కూడా ఇరు దేశాలు పరస్పరం మాటల తూటాలు పేల్చుకున్నాయి. వాణిజ్యంపై చైనాతో తాము చర్చిస్తున్న ఒప్పందాన్ని ఆ దేశ నాయకులు ఉల్లంఘించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.

"నాకు నిన్న రాత్రి చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ నుంచి ఓ మంచి లేఖ వచ్చింది. ఆయనతో ఫోన్​లో సంభాషిస్తాను. అయితే చైనాతో వాణిజ్య ఒప్పందంలో ఉన్న విభేదాల పరిష్కారానికి సుంకాలు పెంచడం నాకు ఆనందంగా ఉంది. నేను అందరిలాంటి వ్యక్తిని కాదు. సుంకాలు అనేవి మా దేశానికి సంబంధించి చాలా శక్తిమంతమైనవి.
ఒప్పందంలో వారు వెనకడుగు వేశారు, వారు అలా చేయకూడదు. అయితే చైనాతో ఒప్పందం కుదర్చుకునేందుకు ఇంకా అవకాశం ఉంది." - డొనాల్డ్​ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

కొంత కాలంగా సాగుతున్న వాణిజ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఇరు దేశాలూ ఒక ఒప్పందం చేసుకోవటానికి చేరువవుతున్నట్లుగా ఇటీవల కనిపించింది.

అయితే.. 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై ఈ వారంలో సుంకాలను పెంచుతామని, కొత్త సుంకాలను విధించే అవకాశమూ ఉందని ట్రంప్ ఆదివారం ట్వీట్ చేశారు.

ట్రంప్​ ట్వీట్
ట్రంప్​ ట్వీట్

మరో 325 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపైనా అమెరికా 25 శాతం సుంకాలను త్వరలో విధించవచ్చని ట్రంప్ పేర్కొన్నారు.

వాణిజ్య చర్చల్లో ఇచ్చిన హామీలపై చైనా వెనకడుగు వేసిందని అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైతీజర్ ఆరోపించారు.

నేటి నుంచే...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ప్రకటించిన సుంకాల మోత నేటి నుంచే అమలు కానుంది. చైనా తయారు చేసే ఎలక్ట్రికల్ పరికరాలు, కార్ల విడిభాగాలు సహా చాలా రకాల వస్తువుల మీద సుంకాలు శుక్రవారం నుంచి 25 శాతం పెరుగుతాయని అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైతీజర్ తెలిపారు.

మొత్తం 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై 10 శాతంగా ఉన్న సుంకాలు ఈ ఏడాది ఆరంభంలోనే 25 శాతానికి పెరగాల్సి ఉంది. అయితే ఇరు దేశాల మధ్య చర్చలు ముందుకు సాగటం వల్ల ఆ పెంపును అమెరికా వాయిదా వేసింది.

వెనక్కు తగ్గని చైనా...

సుంకాల పెంపు నిర్ణయాన్ని అమెరికా అమలు చేస్తే తాము అదే విధంగా తిప్పికొడతామని చైనా పేర్కొంది. వాణిజ్య ఘర్షణ ముదరటం ఇరు దేశాల ప్రజలు, ప్రపంచ ప్రజల ప్రయోజనాలకు మంచిది కాదని చైనా వాణిజ్య మంత్రి వ్యాఖ్యానించారు.

ఒకవేళ అమెరికా సుంకాల పెంపు అమలు చేస్తే చైనా వైపు నుంచి అందుకు అవసరమైన ప్రతి చర్యలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.

వాణిజ్య యుద్ధం ముదరటం.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మార్కెట్లను కుదిపేస్తోంది.

అమెరికా-చైనా ప్రతినిధులు మధ్య వాషింగ్టన్​లో గురువారం మరోసారి వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిగాయి. దాదాపు 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తుల మీద 25 శాతం వరకు సుంకాలను శుక్రవారం నుంచి పెంచుతామని ట్రంప్ ఇప్పటికే స్పష్టంచేశారు. సుంకాలు పెంచే ముందు రోజే ఇరు దేశాధికారులు చర్చలు జరిపారు.

ఈ చర్చలు ప్రారంభం కావటానికి ముందు కూడా ఇరు దేశాలు పరస్పరం మాటల తూటాలు పేల్చుకున్నాయి. వాణిజ్యంపై చైనాతో తాము చర్చిస్తున్న ఒప్పందాన్ని ఆ దేశ నాయకులు ఉల్లంఘించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.

"నాకు నిన్న రాత్రి చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ నుంచి ఓ మంచి లేఖ వచ్చింది. ఆయనతో ఫోన్​లో సంభాషిస్తాను. అయితే చైనాతో వాణిజ్య ఒప్పందంలో ఉన్న విభేదాల పరిష్కారానికి సుంకాలు పెంచడం నాకు ఆనందంగా ఉంది. నేను అందరిలాంటి వ్యక్తిని కాదు. సుంకాలు అనేవి మా దేశానికి సంబంధించి చాలా శక్తిమంతమైనవి.
ఒప్పందంలో వారు వెనకడుగు వేశారు, వారు అలా చేయకూడదు. అయితే చైనాతో ఒప్పందం కుదర్చుకునేందుకు ఇంకా అవకాశం ఉంది." - డొనాల్డ్​ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

కొంత కాలంగా సాగుతున్న వాణిజ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఇరు దేశాలూ ఒక ఒప్పందం చేసుకోవటానికి చేరువవుతున్నట్లుగా ఇటీవల కనిపించింది.

అయితే.. 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై ఈ వారంలో సుంకాలను పెంచుతామని, కొత్త సుంకాలను విధించే అవకాశమూ ఉందని ట్రంప్ ఆదివారం ట్వీట్ చేశారు.

ట్రంప్​ ట్వీట్
ట్రంప్​ ట్వీట్

మరో 325 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపైనా అమెరికా 25 శాతం సుంకాలను త్వరలో విధించవచ్చని ట్రంప్ పేర్కొన్నారు.

వాణిజ్య చర్చల్లో ఇచ్చిన హామీలపై చైనా వెనకడుగు వేసిందని అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైతీజర్ ఆరోపించారు.

నేటి నుంచే...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ప్రకటించిన సుంకాల మోత నేటి నుంచే అమలు కానుంది. చైనా తయారు చేసే ఎలక్ట్రికల్ పరికరాలు, కార్ల విడిభాగాలు సహా చాలా రకాల వస్తువుల మీద సుంకాలు శుక్రవారం నుంచి 25 శాతం పెరుగుతాయని అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైతీజర్ తెలిపారు.

మొత్తం 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై 10 శాతంగా ఉన్న సుంకాలు ఈ ఏడాది ఆరంభంలోనే 25 శాతానికి పెరగాల్సి ఉంది. అయితే ఇరు దేశాల మధ్య చర్చలు ముందుకు సాగటం వల్ల ఆ పెంపును అమెరికా వాయిదా వేసింది.

వెనక్కు తగ్గని చైనా...

సుంకాల పెంపు నిర్ణయాన్ని అమెరికా అమలు చేస్తే తాము అదే విధంగా తిప్పికొడతామని చైనా పేర్కొంది. వాణిజ్య ఘర్షణ ముదరటం ఇరు దేశాల ప్రజలు, ప్రపంచ ప్రజల ప్రయోజనాలకు మంచిది కాదని చైనా వాణిజ్య మంత్రి వ్యాఖ్యానించారు.

ఒకవేళ అమెరికా సుంకాల పెంపు అమలు చేస్తే చైనా వైపు నుంచి అందుకు అవసరమైన ప్రతి చర్యలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.

వాణిజ్య యుద్ధం ముదరటం.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మార్కెట్లను కుదిపేస్తోంది.

Shopian (J-K), May 10 (ANI): An encounter broke out between security forces and terrorists in Jammu and Kashmir's Shopian district. One terrorist has been neutralised by the security forces in the exchange of fire. Arms and ammunition have been recovered.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.