ETV Bharat / international

"ఆమె నా మాట విననందుకే.."

బ్రెగ్జిట్ ఒప్పందం​పై బ్రిటన్ పార్లమెంట్​లో జరిగిన చర్చల తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పదునైన వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ ప్రధాని థెరిసా మే తన సలహా వినలేదని అందుకే ఆమె తీర్మానం ఓడిపోయిందని ఎద్దేవా చేశారు.

author img

By

Published : Mar 15, 2019, 10:16 AM IST

బ్రెగ్జిట్​పై ట్రంప్​ సునిశిత వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్, బ్రెగ్జిట్​పై బ్రిటన్​ పార్లమెంట్​లో చర్చించిన తీరును విమర్శించారు. బ్రెగ్జిట్​పై చర్చలు స్వేచ్ఛగా జరగలేదని, ఇది దేశ విభజనకు కారణమౌతుందని ట్రంప్​ అభిప్రాయపడ్డారు.

బ్రెగ్జిట్​పై ఎలా చర్చలు నిర్వహించాలో బ్రిటన్ ప్రధాని థెరిసా మేకి చెప్పానన్నారు ట్రంప్​. అయితే థెరిసా తన సలహా పాటించలేదని అందుకే ఆమె తీర్మానం వీగిపోయిందని ఎద్దేవా చేశారు.

28 దేశాలు సభ్యులుగా ఉన్న ఐరోపా సమాఖ్య​ నుంచి బ్రిటన్ వైదొలగడానికి ఉన్న గడువును మరో మూడు నెలల వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

నిజానికి ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడానికి మార్చి 29తో గడువు ముగుస్తుంది. కానీ థెరిసా ప్రభుత్వ అభ్యర్థన మేరకు బ్రెగ్జిట్​ను మూడు నెలలు అంటే జూన్​ 30 వరకు గడువు పొడిగిస్తూ పార్లమెంట్ ఆమోదం తెలిపింది.

ఐరిస్​ ప్రధాని లియో వరాద్కర్​ శ్వేతసౌధానికి వెళ్లారు. సెయింట్​ పాట్రిక్​ దినోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. వరాద్కర్​ బ్రిగ్జెట్​ వ్యతిరేకి. ఈయూ నుంచి బ్రిటన్​ వైదొలిగితే అది ఉత్తర ఐర్లాండ్​పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వరాద్కర్​ వాదనను ట్రంప్​ సమర్థించారు. త్వరలోనే సమస్య తొలగిపోతుందని, బ్రెగ్జిట్​ నిర్ణయం బ్రిటన్ వెనుకకు తీసుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఏదైనా తలచుకుంటే సాధ్యమేనని ట్రంప్​ విశ్వాసం వ్యక్తం చేశారు.


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్, బ్రెగ్జిట్​పై బ్రిటన్​ పార్లమెంట్​లో చర్చించిన తీరును విమర్శించారు. బ్రెగ్జిట్​పై చర్చలు స్వేచ్ఛగా జరగలేదని, ఇది దేశ విభజనకు కారణమౌతుందని ట్రంప్​ అభిప్రాయపడ్డారు.

బ్రెగ్జిట్​పై ఎలా చర్చలు నిర్వహించాలో బ్రిటన్ ప్రధాని థెరిసా మేకి చెప్పానన్నారు ట్రంప్​. అయితే థెరిసా తన సలహా పాటించలేదని అందుకే ఆమె తీర్మానం వీగిపోయిందని ఎద్దేవా చేశారు.

28 దేశాలు సభ్యులుగా ఉన్న ఐరోపా సమాఖ్య​ నుంచి బ్రిటన్ వైదొలగడానికి ఉన్న గడువును మరో మూడు నెలల వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

నిజానికి ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడానికి మార్చి 29తో గడువు ముగుస్తుంది. కానీ థెరిసా ప్రభుత్వ అభ్యర్థన మేరకు బ్రెగ్జిట్​ను మూడు నెలలు అంటే జూన్​ 30 వరకు గడువు పొడిగిస్తూ పార్లమెంట్ ఆమోదం తెలిపింది.

ఐరిస్​ ప్రధాని లియో వరాద్కర్​ శ్వేతసౌధానికి వెళ్లారు. సెయింట్​ పాట్రిక్​ దినోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. వరాద్కర్​ బ్రిగ్జెట్​ వ్యతిరేకి. ఈయూ నుంచి బ్రిటన్​ వైదొలిగితే అది ఉత్తర ఐర్లాండ్​పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వరాద్కర్​ వాదనను ట్రంప్​ సమర్థించారు. త్వరలోనే సమస్య తొలగిపోతుందని, బ్రెగ్జిట్​ నిర్ణయం బ్రిటన్ వెనుకకు తీసుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఏదైనా తలచుకుంటే సాధ్యమేనని ట్రంప్​ విశ్వాసం వ్యక్తం చేశారు.


New Delhi, Mar 14 (ANI): Trinamool Congress (TMC) MLA Arjun Singh on Thursday joined the Bharatiya Janata Party in presence of party leader Mukul Roy and General Secretary Kailash Vijayvargiya in national capital. Singh represents North 24 Parganas' Bhatpara constituency.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.