ETV Bharat / international

ఆ దేశాధినేతలకు ట్రంప్​ ఫోన్​.. కారణం?

author img

By

Published : May 9, 2020, 9:29 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. సౌదీ రాజు సల్మాన్​, జర్మనీ ఛాన్సలర్​ మెర్కెల్, మలేషియా ప్రధాని యాస్సిన్​​తో విడివిడిగా చర్చలు జరిపారు. వైరస్​పై పోరులో సానుకూల పరిణామాలు, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ వంటి అంశాలను వద్ద ప్రస్తావించినట్టు శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది.

Trump reaches out to world leaders on coronavirus, global economy
ఆ విషయంపై దేశాధినేతలతో ట్రంప్​ చర్చలు

కరోనాపై పోరులో భాగంగా వివిధ దేశాధినేతలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చర్చలు జరిపారు. వైరస్​ కట్టడి, ఆర్థిక వ్యవస్థ సహా పలు కీలక అంశాలను ప్రస్తావించినట్టు శ్వేతసౌధం తెలిపింది.

సౌదీ రాజుతో...

వైరస్​పై యుద్ధంలో తాజా సానుకూలాంశాలపై సౌదీ అరేబియా రాజు సల్మాన్​ బిన్​ అల్​ సౌద్​తో చర్చించారు ట్రంప్​. ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం అందించే అంశాలపైనా వీరిరువురూ చర్చించినట్టు శ్వేతసౌధం వెల్లడించింది. వీటితో పాటు ప్రాంతీయ, ద్వైపాక్షిక సమస్యలు, జీ7-జీ20 దేశాల నేతలుగా తమ మధ్య సహకార బంధంపైనా ట్రంప్​-సల్మాన్​ సమాలోచనలు చేశారు.

జర్మనీ ఛాన్సలర్​...

కరోనా వైరస్​పై జరుగుతున్న పరిశోధనలు, అమెరికా-జర్మనీ మధ్య ఆర్థిక సంబంధాల పునరుద్ధరణపై జర్మనీ ఛాన్సలర్​ ఏంజెలా మెర్కెల్​తో చర్చించారు ట్రంప్​. క్లిష్టమైన ప్రాంతీయ, ద్వైపాక్షిక సమస్యలనూ అమెరికా అధ్యక్షుడు ప్రస్తావించినట్టు శ్వేతసౌధం పేర్కొంది.

సౌదీ రాజు సల్మాన్​, జర్మనీ ఛాన్సలర్​ మెర్కెల్​తో పాటు మలేషియా ప్రధాని ముహయిద్దీన్​ యస్సిన్​తోనూ చర్చలు జరిపారు ట్రంప్​.

"ప్రాజెక్ట్​ ఎయిర్​ బ్రిడ్జ్​, సరఫరా వ్యవస్థను తెరిచి ఉంచడానికి చేసిన కృషికి ముహయిద్దీన్​ ప్రభుత్వానికి అధ్యక్షుడు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునేందుకు ఇరువురు నేతలు కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నారు. అమెరికా-మలేషియా సమగ్ర భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు కూడా ఇద్దరూ కట్టుబడి ఉన్నారు."

-- శ్వేతసౌధం ప్రకటన.

టెక్సాస్​లో...

అమెరికాలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి. నెల రోజుల అనంతరం.. టెక్సాస్​లో పలు ఆంక్షలను సడలించి సెలూన్లు, బ్యూటీ పార్లల్ వంటి సేవలకు అనుమతులిచ్చింది అక్కడి ప్రభుత్వం. అయితే అందరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం నిబంధనను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఒకసారి ఒక కస్టమర్​కు మాత్రమే సేవలందించాలని పేర్కొంది. మిగిలిన వారు ఆరు అడుగుల దూరం పాటిస్తూ బయట వేచి ఉండాలని సూచించింది.

పెళ్లిళ్లు, ఖననాలు, చర్చీలకు కూడా పలు నిబంధనలతో అనుమతులిచ్చింది టెక్సాస్​ ప్రభుత్వం. ఒక్కో వరుసను విడిచిపెట్టి, ఒకరి మధ్య ఒకరు కనీసం ఆరు అడుగుల దూరం ఉండాలని స్పష్టం చేసింది.

కరోనాపై పోరులో భాగంగా వివిధ దేశాధినేతలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చర్చలు జరిపారు. వైరస్​ కట్టడి, ఆర్థిక వ్యవస్థ సహా పలు కీలక అంశాలను ప్రస్తావించినట్టు శ్వేతసౌధం తెలిపింది.

సౌదీ రాజుతో...

వైరస్​పై యుద్ధంలో తాజా సానుకూలాంశాలపై సౌదీ అరేబియా రాజు సల్మాన్​ బిన్​ అల్​ సౌద్​తో చర్చించారు ట్రంప్​. ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం అందించే అంశాలపైనా వీరిరువురూ చర్చించినట్టు శ్వేతసౌధం వెల్లడించింది. వీటితో పాటు ప్రాంతీయ, ద్వైపాక్షిక సమస్యలు, జీ7-జీ20 దేశాల నేతలుగా తమ మధ్య సహకార బంధంపైనా ట్రంప్​-సల్మాన్​ సమాలోచనలు చేశారు.

జర్మనీ ఛాన్సలర్​...

కరోనా వైరస్​పై జరుగుతున్న పరిశోధనలు, అమెరికా-జర్మనీ మధ్య ఆర్థిక సంబంధాల పునరుద్ధరణపై జర్మనీ ఛాన్సలర్​ ఏంజెలా మెర్కెల్​తో చర్చించారు ట్రంప్​. క్లిష్టమైన ప్రాంతీయ, ద్వైపాక్షిక సమస్యలనూ అమెరికా అధ్యక్షుడు ప్రస్తావించినట్టు శ్వేతసౌధం పేర్కొంది.

సౌదీ రాజు సల్మాన్​, జర్మనీ ఛాన్సలర్​ మెర్కెల్​తో పాటు మలేషియా ప్రధాని ముహయిద్దీన్​ యస్సిన్​తోనూ చర్చలు జరిపారు ట్రంప్​.

"ప్రాజెక్ట్​ ఎయిర్​ బ్రిడ్జ్​, సరఫరా వ్యవస్థను తెరిచి ఉంచడానికి చేసిన కృషికి ముహయిద్దీన్​ ప్రభుత్వానికి అధ్యక్షుడు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునేందుకు ఇరువురు నేతలు కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నారు. అమెరికా-మలేషియా సమగ్ర భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు కూడా ఇద్దరూ కట్టుబడి ఉన్నారు."

-- శ్వేతసౌధం ప్రకటన.

టెక్సాస్​లో...

అమెరికాలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి. నెల రోజుల అనంతరం.. టెక్సాస్​లో పలు ఆంక్షలను సడలించి సెలూన్లు, బ్యూటీ పార్లల్ వంటి సేవలకు అనుమతులిచ్చింది అక్కడి ప్రభుత్వం. అయితే అందరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం నిబంధనను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఒకసారి ఒక కస్టమర్​కు మాత్రమే సేవలందించాలని పేర్కొంది. మిగిలిన వారు ఆరు అడుగుల దూరం పాటిస్తూ బయట వేచి ఉండాలని సూచించింది.

పెళ్లిళ్లు, ఖననాలు, చర్చీలకు కూడా పలు నిబంధనలతో అనుమతులిచ్చింది టెక్సాస్​ ప్రభుత్వం. ఒక్కో వరుసను విడిచిపెట్టి, ఒకరి మధ్య ఒకరు కనీసం ఆరు అడుగుల దూరం ఉండాలని స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.